Political News

కేసీఆర్ మా వాళ్ల‌తో మాట్లాడుతున్నారు: డీకే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 24 గంట‌ల గ‌డువే ఉండ‌డంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ క‌ర్నాట‌క పీసీసీ చీఫ్‌, ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన‌కు అందిన స‌మాచారం మేర‌కు… దాదాపు 40 మంది నేత‌ల‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు డీకే వెల్ల‌డించారు.

కేసీఆర్ ఓడిపోతున్నారు. బీఆర్ ఎస్ నేల మ‌ట్టం అయ్యేందుకు రెడీ అయింది. కానీ, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్ర‌లోబాలు పెట్టేందుకు ప‌న్నాగారు రెడీ చేసుకున్నారు. మా నాయ‌కుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శ‌నివారం ఉదయం వ‌ర‌కు దాదాపు 40 మంది నాయ‌కుల‌కు ఆయ‌న ఫోన్‌లు చేసిన మాట్లాడారు. ఈ స‌మాచారం మా ద‌గ్గ‌ర ఉంది. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని డీకే వెల్ల‌డించారు.

అంతేకాదు.. ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ఎక్క‌డా అబ‌ద్ధం కాలేద‌ని చెప్పిన డీకే.. క‌ర్ణాట‌లో ఎగ్జిట్ పోల్స్ నిజ‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేకే.. కేసీఆర్ మ‌భ్య‌పెట్టి, ప్ర‌లోభ‌ప‌రిచే రాజ‌కీయాల‌కు తెరదీశార‌ని చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ నేత‌లు ధైర్యంతో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఏ ఒక్క‌రూ పార్టీ ఆదేశాల‌కు దూరంగా ఉండ‌ర‌ని, ప‌దేళ్ల త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పుకొచ్చారు.

This post was last modified on December 2, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

17 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago