Political News

కేసీఆర్ మా వాళ్ల‌తో మాట్లాడుతున్నారు: డీకే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 24 గంట‌ల గ‌డువే ఉండ‌డంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ క‌ర్నాట‌క పీసీసీ చీఫ్‌, ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన‌కు అందిన స‌మాచారం మేర‌కు… దాదాపు 40 మంది నేత‌ల‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు డీకే వెల్ల‌డించారు.

కేసీఆర్ ఓడిపోతున్నారు. బీఆర్ ఎస్ నేల మ‌ట్టం అయ్యేందుకు రెడీ అయింది. కానీ, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్ర‌లోబాలు పెట్టేందుకు ప‌న్నాగారు రెడీ చేసుకున్నారు. మా నాయ‌కుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శ‌నివారం ఉదయం వ‌ర‌కు దాదాపు 40 మంది నాయ‌కుల‌కు ఆయ‌న ఫోన్‌లు చేసిన మాట్లాడారు. ఈ స‌మాచారం మా ద‌గ్గ‌ర ఉంది. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని డీకే వెల్ల‌డించారు.

అంతేకాదు.. ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ఎక్క‌డా అబ‌ద్ధం కాలేద‌ని చెప్పిన డీకే.. క‌ర్ణాట‌లో ఎగ్జిట్ పోల్స్ నిజ‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేకే.. కేసీఆర్ మ‌భ్య‌పెట్టి, ప్ర‌లోభ‌ప‌రిచే రాజ‌కీయాల‌కు తెరదీశార‌ని చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ నేత‌లు ధైర్యంతో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఏ ఒక్క‌రూ పార్టీ ఆదేశాల‌కు దూరంగా ఉండ‌ర‌ని, ప‌దేళ్ల త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పుకొచ్చారు.

This post was last modified on December 2, 2023 3:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

17 mins ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

1 hour ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

2 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

4 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago