తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 24 గంటల గడువే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ కర్నాటక పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అందిన సమాచారం మేరకు… దాదాపు 40 మంది నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టు డీకే వెల్లడించారు.
కేసీఆర్ ఓడిపోతున్నారు. బీఆర్ ఎస్ నేల మట్టం అయ్యేందుకు రెడీ అయింది. కానీ, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రలోబాలు పెట్టేందుకు పన్నాగారు రెడీ చేసుకున్నారు. మా నాయకులకు టచ్లో ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు దాదాపు 40 మంది నాయకులకు ఆయన ఫోన్లు చేసిన మాట్లాడారు. ఈ సమాచారం మా దగ్గర ఉంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని డీకే వెల్లడించారు.
అంతేకాదు.. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎక్కడా అబద్ధం కాలేదని చెప్పిన డీకే.. కర్ణాటలో ఎగ్జిట్ పోల్స్ నిజమైన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే.. కేసీఆర్ మభ్యపెట్టి, ప్రలోభపరిచే రాజకీయాలకు తెరదీశారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ధైర్యంతో ఉంటారని ఆయన చెప్పారు. ఏ ఒక్కరూ పార్టీ ఆదేశాలకు దూరంగా ఉండరని, పదేళ్ల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చారు.
This post was last modified on December 2, 2023 3:49 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…