తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 24 గంటల గడువే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ కర్నాటక పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అందిన సమాచారం మేరకు… దాదాపు 40 మంది నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్టు డీకే వెల్లడించారు.
కేసీఆర్ ఓడిపోతున్నారు. బీఆర్ ఎస్ నేల మట్టం అయ్యేందుకు రెడీ అయింది. కానీ, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రలోబాలు పెట్టేందుకు పన్నాగారు రెడీ చేసుకున్నారు. మా నాయకులకు టచ్లో ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు దాదాపు 40 మంది నాయకులకు ఆయన ఫోన్లు చేసిన మాట్లాడారు. ఈ సమాచారం మా దగ్గర ఉంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని డీకే వెల్లడించారు.
అంతేకాదు.. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎక్కడా అబద్ధం కాలేదని చెప్పిన డీకే.. కర్ణాటలో ఎగ్జిట్ పోల్స్ నిజమైన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే.. కేసీఆర్ మభ్యపెట్టి, ప్రలోభపరిచే రాజకీయాలకు తెరదీశారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ధైర్యంతో ఉంటారని ఆయన చెప్పారు. ఏ ఒక్కరూ పార్టీ ఆదేశాలకు దూరంగా ఉండరని, పదేళ్ల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చారు.
This post was last modified on December 2, 2023 3:49 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…