Political News

కేసీఆర్ మా వాళ్ల‌తో మాట్లాడుతున్నారు: డీకే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 24 గంట‌ల గ‌డువే ఉండ‌డంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీ క‌ర్నాట‌క పీసీసీ చీఫ్‌, ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన‌కు అందిన స‌మాచారం మేర‌కు… దాదాపు 40 మంది నేత‌ల‌తో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు డీకే వెల్ల‌డించారు.

కేసీఆర్ ఓడిపోతున్నారు. బీఆర్ ఎస్ నేల మ‌ట్టం అయ్యేందుకు రెడీ అయింది. కానీ, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్ర‌లోబాలు పెట్టేందుకు ప‌న్నాగారు రెడీ చేసుకున్నారు. మా నాయ‌కుల‌కు ట‌చ్‌లో ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శ‌నివారం ఉదయం వ‌ర‌కు దాదాపు 40 మంది నాయ‌కుల‌కు ఆయ‌న ఫోన్‌లు చేసిన మాట్లాడారు. ఈ స‌మాచారం మా ద‌గ్గ‌ర ఉంది. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని డీకే వెల్ల‌డించారు.

అంతేకాదు.. ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ఎక్క‌డా అబ‌ద్ధం కాలేద‌ని చెప్పిన డీకే.. క‌ర్ణాట‌లో ఎగ్జిట్ పోల్స్ నిజ‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేకే.. కేసీఆర్ మ‌భ్య‌పెట్టి, ప్ర‌లోభ‌ప‌రిచే రాజ‌కీయాల‌కు తెరదీశార‌ని చెప్పుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ నేత‌లు ధైర్యంతో ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఏ ఒక్క‌రూ పార్టీ ఆదేశాల‌కు దూరంగా ఉండ‌ర‌ని, ప‌దేళ్ల త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పుకొచ్చారు.

This post was last modified on December 2, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago