తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత జరిగిన ఈ పరిణామం.. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మారిన సీన్.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 30 మంది పోలీసులు రేవంత్ ఇంటి చుట్టుపక్కల భద్రతకు కేటాయించడం గమనార్హం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఆయన ఇంటికి పోలీసు భద్రత ఉంది.
అయితే.. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత.. ఈ భద్రతను నాలుగింతలు పెంచడం గమనార్హం. శుక్రవారం సాయంత్రానికి ఓ మాదిరిగా ఉన్న భద్రత రాత్రికి మరింత పెరిగింది. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు.ఇదిలావుంట, పోలింగ్ అంచనాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్రెడ్డి అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయన నివాసానికి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని.. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
This post was last modified on December 2, 2023 8:28 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…