తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అధికార పీఠం ఎవర దక్కించుకుంటారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్వయంగా ఈ సీటు కోసం 12 మంది నాయకులు పోటీ పడుతున్నారని వెల్లడించి బాంబు పేల్చారు. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. అక్కడ ఇద్దరు మాత్రమే సీఎం సీటుకోసం పోట్లాడుకున్నారు. కానీ, దాదాపు పదేళ్ల విరామం తర్వాత.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం దక్కించుకుందని సర్వేలు చెబుతున్న వేళ.. ఇక్కడ ముఖ్యమంత్రి పీఠంపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు.
ఇదేవిషయంపై గురువారం ఎన్నికల పోలింగ్ అనంతరం.. ప్రముఖ సర్వే సంస్థ, మీడియా అగ్ర సంస్థ.. ‘ఇండియా టుడే’ జనంలోకి వెళ్లింది. తెలంగాణ సమాజంలో ఉన్న అభిప్రాయాలను వెతికి పట్టుకుంది. దీని ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నేరుగా తెలంగాణ ప్రజలను ఇండియా టుడే ప్రశ్నించింది. దీనికి ప్రజలు బాగానే రియాక్ట్ అయ్యారు. సుమారు 21 శాతం మంది రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. ఇదేసమయంలో మరొక శాతం ఎక్కువగా అంటే.. 22 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా.. తమకు బాగానే ఉంటుందని చెప్పడం విశేషం.
ఇక, బీఆర్ ఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న ఇండియా టుడే ప్రశ్నకు 33 శాతం మంది ప్రజలు కేసీఆర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. మిగిలిన వారిలో 15 శాతం మంది కేటీఆర్కు జైకొట్టారు. ఇక, మరో 10 శాతం మంది ఎవరైనా తమకు ఓకే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసమే కేసీఆర్ ఈ ఎన్నికల్లో చాలా కష్టపడుతున్నారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎక్కువ మంది సమర్థించడం.. గమనార్హం. వారసత్వ రాజకీయాలను ఎక్కువ మంది ప్రజలు సమర్థించారు. అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలన్న వాదనకు కూడా మెజారిటీ ప్రజలు జై కొట్టారు.
This post was last modified on December 2, 2023 8:24 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…