తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అధికార పీఠం ఎవర దక్కించుకుంటారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్వయంగా ఈ సీటు కోసం 12 మంది నాయకులు పోటీ పడుతున్నారని వెల్లడించి బాంబు పేల్చారు. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. అక్కడ ఇద్దరు మాత్రమే సీఎం సీటుకోసం పోట్లాడుకున్నారు. కానీ, దాదాపు పదేళ్ల విరామం తర్వాత.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం దక్కించుకుందని సర్వేలు చెబుతున్న వేళ.. ఇక్కడ ముఖ్యమంత్రి పీఠంపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు.
ఇదేవిషయంపై గురువారం ఎన్నికల పోలింగ్ అనంతరం.. ప్రముఖ సర్వే సంస్థ, మీడియా అగ్ర సంస్థ.. ‘ఇండియా టుడే’ జనంలోకి వెళ్లింది. తెలంగాణ సమాజంలో ఉన్న అభిప్రాయాలను వెతికి పట్టుకుంది. దీని ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నేరుగా తెలంగాణ ప్రజలను ఇండియా టుడే ప్రశ్నించింది. దీనికి ప్రజలు బాగానే రియాక్ట్ అయ్యారు. సుమారు 21 శాతం మంది రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. ఇదేసమయంలో మరొక శాతం ఎక్కువగా అంటే.. 22 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా.. తమకు బాగానే ఉంటుందని చెప్పడం విశేషం.
ఇక, బీఆర్ ఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న ఇండియా టుడే ప్రశ్నకు 33 శాతం మంది ప్రజలు కేసీఆర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. మిగిలిన వారిలో 15 శాతం మంది కేటీఆర్కు జైకొట్టారు. ఇక, మరో 10 శాతం మంది ఎవరైనా తమకు ఓకే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసమే కేసీఆర్ ఈ ఎన్నికల్లో చాలా కష్టపడుతున్నారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎక్కువ మంది సమర్థించడం.. గమనార్హం. వారసత్వ రాజకీయాలను ఎక్కువ మంది ప్రజలు సమర్థించారు. అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలన్న వాదనకు కూడా మెజారిటీ ప్రజలు జై కొట్టారు.
This post was last modified on December 2, 2023 8:24 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…