ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరొ 24 గంటల్లో ఫలితం కూడా రానుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఫలితాల వెల్లడి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీలకైన నాలుగు రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్(మరోసారి), ఛత్తీస్గఢ్ల(మరోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థులకు తన అభ్యర్థులు చిక్కకుండా ముందస్తు జాగ్రత్తలకు హస్తం పార్టీ సిద్ధమైపోయింది.
మరీ ముఖ్యంగా తెలంగాణను ఇచ్చామన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని..దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే.. టఫ్ ఫైట్ ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఇతర పార్టీలు తమ వారిని లాక్కునే ప్రయత్నం చేస్తాయనే భావన కాంగ్రెస్ నాయకుల్లోను.. అధిష్టానంలోనూ కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఒక్క అభ్యర్థినీ చేజారకుండా చూసుకునే బాధ్యతలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, షార్ప్ షూటర్ డీకే శివకుమార్కు అప్పగించింది. దీంతో ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఎంతగా అంటే.. వాస్తవానికి అధికారిక పనిమీద.. డీకే దుబాయ్ వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించి.. శుక్రవారం టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. కానీ, ఆయన మాత్రం ఈ పర్యటనను వాయిదా వేసుకోవడంతోపాటు.. అటు రాజస్థాన్, ఇటు తెలంగాణ నేతలతో టచ్లోకి వచ్చేశారు. గెలుస్తారనే నాయకులను ఆయన మచ్చిక చేసుకుంటున్నారు. వారిని నిరంతరం కనిపెడుతున్నారు. అంతేకాదు.. వారిని అవసరమైతే.. శనివారం మధ్యాహ్నానికే(ఆదివారం ఫలితాలకు ముందే) బెంగళూరుకు వచ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
బెంగళూరు శివారులోని 600 మంది బస చేయగల ఈగల్టన్ రిసార్టును గుండుగుత్తగా కాంగ్రెస్ బ్లాక్ చేసేసింది. ఈ గదులను ఎవరికీ ఇవ్వద్దని పార్టీ నుంచి అడ్వాన్సులు కూడా అందినట్టు సమాచారం. ఈ క్రమంలో గెలుపు గుర్రం ఎక్కే నాయకులు, ప్రలోభాలకు గురవుతారని అనుమానం ఉన్ననాయకులను శనివారం మధ్యాహ్నానికే ఈగల్టన్కు తరలించేలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. “పరిస్థితులు బాగోలేదు. మావాళ్లను మేం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలంగాణ ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన ఆ రాష్ట్ర మంత్రి జావేద్ వెల్లడించడం.. ఈ పరిణామాలకు మద్దతుగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఏర్పాట్లు.. గతంలోనూ ఇలానే జరిగాయి. మరి ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి.
This post was last modified on December 2, 2023 8:22 am
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…