Political News

‘చే’ జార‌కుండా జాగ్ర‌త్త‌లు.. క్యాంపు రాజ‌కీయాలు షురూ!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మ‌రొ 24 గంట‌ల్లో ఫ‌లితం కూడా రానుంది. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ఫ‌లితాల వెల్ల‌డి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీల‌కైన నాలుగు రాష్ట్రాలు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, రాజస్థాన్‌(మ‌రోసారి), ఛ‌త్తీస్‌గ‌ఢ్ల‌(మ‌రోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థుల‌కు త‌న అభ్య‌ర్థులు చిక్క‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లకు హ‌స్తం పార్టీ సిద్ధ‌మైపోయింది.

మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌ను ఇచ్చామ‌న్న కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ అధికారంలోకి వచ్చే అవ‌కాశం మెండుగా ఉంద‌ని..దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అయితే.. ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని మాత్రం చెప్పుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలో మ్యాజిక్ ఫిగ‌ర్ విష‌యంలో ఇత‌ర పార్టీలు త‌మ వారిని లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తాయ‌నే భావ‌న కాంగ్రెస్ నాయ‌కుల్లోను.. అధిష్టానంలోనూ క‌నిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టింది. ఒక్క అభ్య‌ర్థినీ చేజార‌కుండా చూసుకునే బాధ్య‌త‌ల‌ను క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి, షార్ప్ షూట‌ర్ డీకే శివ‌కుమార్‌కు అప్ప‌గించింది. దీంతో ఆయ‌న ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఎంత‌గా అంటే.. వాస్త‌వానికి అధికారిక ప‌నిమీద‌.. డీకే దుబాయ్ వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించి.. శుక్ర‌వారం టికెట్లు కూడా క‌న్ఫ‌ర్మ్ అయ్యాయి. కానీ, ఆయ‌న మాత్రం ఈ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవ‌డంతోపాటు.. అటు రాజ‌స్థాన్‌, ఇటు తెలంగాణ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చేశారు. గెలుస్తార‌నే నాయ‌కుల‌ను ఆయ‌న మ‌చ్చిక చేసుకుంటున్నారు. వారిని నిరంతరం క‌నిపెడుతున్నారు. అంతేకాదు.. వారిని అవ‌స‌ర‌మైతే.. శ‌నివారం మ‌ధ్యాహ్నానికే(ఆదివారం ఫ‌లితాల‌కు ముందే) బెంగ‌ళూరుకు వ‌చ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

బెంగ‌ళూరు శివారులోని 600 మంది బ‌స చేయ‌గ‌ల ఈగ‌ల్ట‌న్ రిసార్టును గుండుగుత్త‌గా కాంగ్రెస్ బ్లాక్ చేసేసింది. ఈ గ‌దుల‌ను ఎవ‌రికీ ఇవ్వ‌ద్ద‌ని పార్టీ నుంచి అడ్వాన్సులు కూడా అందిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో గెలుపు గుర్రం ఎక్కే నాయ‌కులు, ప్ర‌లోభాల‌కు గుర‌వుతార‌ని అనుమానం ఉన్న‌నాయ‌కుల‌ను శ‌నివారం మ‌ధ్యాహ్నానికే ఈగ‌ల్ట‌న్‌కు త‌ర‌లించేలా ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన‌ట్టు క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. “ప‌రిస్థితులు బాగోలేదు. మావాళ్ల‌ను మేం కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది” అని తెలంగాణ ప్ర‌చారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ రాష్ట్ర మంత్రి జావేద్ వెల్ల‌డించ‌డం.. ఈ ప‌రిణామాల‌కు మ‌ద్ద‌తుగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఏర్పాట్లు.. గ‌తంలోనూ ఇలానే జ‌రిగాయి. మ‌రి ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి.

This post was last modified on December 2, 2023 8:22 am

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

22 minutes ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

5 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

9 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

11 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

11 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

12 hours ago