Political News

‘చే’ జార‌కుండా జాగ్ర‌త్త‌లు.. క్యాంపు రాజ‌కీయాలు షురూ!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మ‌రొ 24 గంట‌ల్లో ఫ‌లితం కూడా రానుంది. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ఫ‌లితాల వెల్ల‌డి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీల‌కైన నాలుగు రాష్ట్రాలు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, రాజస్థాన్‌(మ‌రోసారి), ఛ‌త్తీస్‌గ‌ఢ్ల‌(మ‌రోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థుల‌కు త‌న అభ్య‌ర్థులు చిక్క‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లకు హ‌స్తం పార్టీ సిద్ధ‌మైపోయింది.

మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌ను ఇచ్చామ‌న్న కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ అధికారంలోకి వచ్చే అవ‌కాశం మెండుగా ఉంద‌ని..దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అయితే.. ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని మాత్రం చెప్పుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలో మ్యాజిక్ ఫిగ‌ర్ విష‌యంలో ఇత‌ర పార్టీలు త‌మ వారిని లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తాయ‌నే భావ‌న కాంగ్రెస్ నాయ‌కుల్లోను.. అధిష్టానంలోనూ క‌నిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టింది. ఒక్క అభ్య‌ర్థినీ చేజార‌కుండా చూసుకునే బాధ్య‌త‌ల‌ను క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి, షార్ప్ షూట‌ర్ డీకే శివ‌కుమార్‌కు అప్ప‌గించింది. దీంతో ఆయ‌న ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఎంత‌గా అంటే.. వాస్త‌వానికి అధికారిక ప‌నిమీద‌.. డీకే దుబాయ్ వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించి.. శుక్ర‌వారం టికెట్లు కూడా క‌న్ఫ‌ర్మ్ అయ్యాయి. కానీ, ఆయ‌న మాత్రం ఈ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవ‌డంతోపాటు.. అటు రాజ‌స్థాన్‌, ఇటు తెలంగాణ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చేశారు. గెలుస్తార‌నే నాయ‌కుల‌ను ఆయ‌న మ‌చ్చిక చేసుకుంటున్నారు. వారిని నిరంతరం క‌నిపెడుతున్నారు. అంతేకాదు.. వారిని అవ‌స‌ర‌మైతే.. శ‌నివారం మ‌ధ్యాహ్నానికే(ఆదివారం ఫ‌లితాల‌కు ముందే) బెంగ‌ళూరుకు వ‌చ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

బెంగ‌ళూరు శివారులోని 600 మంది బ‌స చేయ‌గ‌ల ఈగ‌ల్ట‌న్ రిసార్టును గుండుగుత్త‌గా కాంగ్రెస్ బ్లాక్ చేసేసింది. ఈ గ‌దుల‌ను ఎవ‌రికీ ఇవ్వ‌ద్ద‌ని పార్టీ నుంచి అడ్వాన్సులు కూడా అందిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో గెలుపు గుర్రం ఎక్కే నాయ‌కులు, ప్ర‌లోభాల‌కు గుర‌వుతార‌ని అనుమానం ఉన్న‌నాయ‌కుల‌ను శ‌నివారం మ‌ధ్యాహ్నానికే ఈగ‌ల్ట‌న్‌కు త‌ర‌లించేలా ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన‌ట్టు క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. “ప‌రిస్థితులు బాగోలేదు. మావాళ్ల‌ను మేం కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది” అని తెలంగాణ ప్ర‌చారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ రాష్ట్ర మంత్రి జావేద్ వెల్ల‌డించ‌డం.. ఈ ప‌రిణామాల‌కు మ‌ద్ద‌తుగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఏర్పాట్లు.. గ‌తంలోనూ ఇలానే జ‌రిగాయి. మ‌రి ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి.

This post was last modified on December 2, 2023 8:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago