Political News

‘చే’ జార‌కుండా జాగ్ర‌త్త‌లు.. క్యాంపు రాజ‌కీయాలు షురూ!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మ‌రొ 24 గంట‌ల్లో ఫ‌లితం కూడా రానుంది. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి పోలింగ్ ఫ‌లితాల వెల్ల‌డి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీల‌కైన నాలుగు రాష్ట్రాలు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, రాజస్థాన్‌(మ‌రోసారి), ఛ‌త్తీస్‌గ‌ఢ్ల‌(మ‌రోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థుల‌కు త‌న అభ్య‌ర్థులు చిక్క‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లకు హ‌స్తం పార్టీ సిద్ధ‌మైపోయింది.

మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌ను ఇచ్చామ‌న్న కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ అధికారంలోకి వచ్చే అవ‌కాశం మెండుగా ఉంద‌ని..దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అయితే.. ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని మాత్రం చెప్పుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలో మ్యాజిక్ ఫిగ‌ర్ విష‌యంలో ఇత‌ర పార్టీలు త‌మ వారిని లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తాయ‌నే భావ‌న కాంగ్రెస్ నాయ‌కుల్లోను.. అధిష్టానంలోనూ క‌నిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టింది. ఒక్క అభ్య‌ర్థినీ చేజార‌కుండా చూసుకునే బాధ్య‌త‌ల‌ను క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి, షార్ప్ షూట‌ర్ డీకే శివ‌కుమార్‌కు అప్ప‌గించింది. దీంతో ఆయ‌న ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఎంత‌గా అంటే.. వాస్త‌వానికి అధికారిక ప‌నిమీద‌.. డీకే దుబాయ్ వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించి.. శుక్ర‌వారం టికెట్లు కూడా క‌న్ఫ‌ర్మ్ అయ్యాయి. కానీ, ఆయ‌న మాత్రం ఈ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవ‌డంతోపాటు.. అటు రాజ‌స్థాన్‌, ఇటు తెలంగాణ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చేశారు. గెలుస్తార‌నే నాయ‌కుల‌ను ఆయ‌న మ‌చ్చిక చేసుకుంటున్నారు. వారిని నిరంతరం క‌నిపెడుతున్నారు. అంతేకాదు.. వారిని అవ‌స‌ర‌మైతే.. శ‌నివారం మ‌ధ్యాహ్నానికే(ఆదివారం ఫ‌లితాల‌కు ముందే) బెంగ‌ళూరుకు వ‌చ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

బెంగ‌ళూరు శివారులోని 600 మంది బ‌స చేయ‌గ‌ల ఈగ‌ల్ట‌న్ రిసార్టును గుండుగుత్త‌గా కాంగ్రెస్ బ్లాక్ చేసేసింది. ఈ గ‌దుల‌ను ఎవ‌రికీ ఇవ్వ‌ద్ద‌ని పార్టీ నుంచి అడ్వాన్సులు కూడా అందిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో గెలుపు గుర్రం ఎక్కే నాయ‌కులు, ప్ర‌లోభాల‌కు గుర‌వుతార‌ని అనుమానం ఉన్న‌నాయ‌కుల‌ను శ‌నివారం మ‌ధ్యాహ్నానికే ఈగ‌ల్ట‌న్‌కు త‌ర‌లించేలా ప్ర‌త్యేక ఏర్పాటు చేసిన‌ట్టు క‌ర్ణాట‌క కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. “ప‌రిస్థితులు బాగోలేదు. మావాళ్ల‌ను మేం కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది” అని తెలంగాణ ప్ర‌చారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆ రాష్ట్ర మంత్రి జావేద్ వెల్ల‌డించ‌డం.. ఈ ప‌రిణామాల‌కు మ‌ద్ద‌తుగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఏర్పాట్లు.. గ‌తంలోనూ ఇలానే జ‌రిగాయి. మ‌రి ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి.

This post was last modified on December 2, 2023 8:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

1 hour ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago