ఏపీ అధికార పార్టీ వైసీపీ అరాచకాలను పార్లమెంటులోనూ లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలోనూ యుద్ధం ప్రకటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలుప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో వైసీపీ అరాచకాలు.. ఓట్ల తొలగింపు, ఎస్సీలపై వేధింపులు, తన అరెస్టు సహా బెదిరింపులు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, అధికారులను ప్రలోభాలకు గురిచేయడం వంటివిషయాలను పార్లమెంటులో చర్చించాలని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.”ఈగోలకు పోవద్దు. ఇది మీ పార్టీ. మన పార్టీ. రేపు అధికారంలోకి రావాల్సి ఉంది. చిన్ని చిన్న తప్పులు ఉంటే సరిచేసుకుందాం. ఈగోలను పక్కన పెట్టండి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీరు కూడా కష్టపడాలి. ఒక్కరు శ్రమిస్తే.. అందరూ ఫలాలు అనుభవించే పరిస్థితి ఉంటుందని అనుకోవద్దు. అన్నీ గమనిస్తున్నా. ప్రతి ఒక్కరూ సమష్టిగా ముందుకు రావాలి” అని చంద్రబాబు సూచించారు. దీనికి ముందు ఆయన గన్నవరం విమానాశ్రయానికి రాగా.. పార్టీ నేతల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి చంద్రబాబు వచ్చారు. ఇక, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేసరపల్లి గూడవల్లి , నిడమానూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడులో చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. రోడ్లు మీదకు వచ్చి చంద్రబాబుకు మహిళలు సంఘీభావం తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ప్రసాదంపాడులో జన ఉత్సాహం ఉప్పొంగిపోయింది. చంద్రబాబును చూసేందుకు మహిళలు, ప్రజలు రోడ్లమీదకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుని మహిళలు, తెలుగు తమ్ముళ్లు పూలతో ముంచెత్తారు. గన్నవరం నుంచి రామవరప్పాడు రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది. కాగా, చంద్రబాబు కారు డోర్పక్కన నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. అనంతరం.. పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…