ఏపీ అధికార పార్టీ వైసీపీ అరాచకాలను పార్లమెంటులోనూ లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలోనూ యుద్ధం ప్రకటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలుప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో వైసీపీ అరాచకాలు.. ఓట్ల తొలగింపు, ఎస్సీలపై వేధింపులు, తన అరెస్టు సహా బెదిరింపులు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, అధికారులను ప్రలోభాలకు గురిచేయడం వంటివిషయాలను పార్లమెంటులో చర్చించాలని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.”ఈగోలకు పోవద్దు. ఇది మీ పార్టీ. మన పార్టీ. రేపు అధికారంలోకి రావాల్సి ఉంది. చిన్ని చిన్న తప్పులు ఉంటే సరిచేసుకుందాం. ఈగోలను పక్కన పెట్టండి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీరు కూడా కష్టపడాలి. ఒక్కరు శ్రమిస్తే.. అందరూ ఫలాలు అనుభవించే పరిస్థితి ఉంటుందని అనుకోవద్దు. అన్నీ గమనిస్తున్నా. ప్రతి ఒక్కరూ సమష్టిగా ముందుకు రావాలి” అని చంద్రబాబు సూచించారు. దీనికి ముందు ఆయన గన్నవరం విమానాశ్రయానికి రాగా.. పార్టీ నేతల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి చంద్రబాబు వచ్చారు. ఇక, గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేసరపల్లి గూడవల్లి , నిడమానూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడులో చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. రోడ్లు మీదకు వచ్చి చంద్రబాబుకు మహిళలు సంఘీభావం తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ప్రసాదంపాడులో జన ఉత్సాహం ఉప్పొంగిపోయింది. చంద్రబాబును చూసేందుకు మహిళలు, ప్రజలు రోడ్లమీదకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుని మహిళలు, తెలుగు తమ్ముళ్లు పూలతో ముంచెత్తారు. గన్నవరం నుంచి రామవరప్పాడు రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది. కాగా, చంద్రబాబు కారు డోర్పక్కన నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. అనంతరం.. పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
This post was last modified on December 1, 2023 10:17 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…