Political News

టీడీపీని ఇరుకున పెడుతున్న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి బ‌లమైన జిల్లాలు చాలానే ఉన్నాయి. ఉభ‌య గోదావ‌రులు, గుంటూరు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు, కృష్ణా వంటివి కేడ‌ర్ ప‌రంగా బాగున్న జిల్లాలు. వీటిలో మ‌రీ ముఖ్యంగా సీమ ప‌రిధిలో ఉన్న అనంత‌పురం టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుచుకుంది. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఒక్క హిందూపురం, ఉర‌వకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే విజ‌యం సాధించింది.

అయిన‌ప్ప‌టికీ.. కేడ‌ర్ బ‌లంగానే ఉంది. ఇక‌, ఈ అనంత‌పురంలోనూ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు.. వ్య‌క్తులు, పార్టీ ప‌రంగా చూసుకున్నా.. ఈ రెండు పార్టీకి కీల‌క‌మై. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దూకుడున్నా.. వైసీపీ నాయ‌కులు కాలు దువ్వుతున్నా.. పార్టీ ఎదురీత ఈదుతోంది. అయితే.. అనంత‌లోని ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. వైసీపీ దూకుడు లేకున్నా.. టీడీపీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో విల‌విల్లాడుతోంది.

నిజానికి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల నుంచి ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ లేదు. కానీ, పార్టీలో నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. పంతాలు పట్టింపులు తెలుగు దేశం పార్టీని ఇరుకున పెడుతున్నాయి. వీటిలో అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాలు కీల‌కంగా ఉన్నాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైకుంఠం ప్ర‌భాక‌ర్‌చౌద‌రి, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ, తాడిప‌త్రి బ్ర‌ద‌ర్స్‌.. జేసీ ప్ర‌భాక‌ర్‌, దివాక‌ర్‌ల హ‌వా.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

వారు రారు.. ఎవ‌రినీ రానివ్వ‌రు.. అన్నచందంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు విఘాతం క‌లిగిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో .. పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న వైకుంఠం చౌద‌రికి. ర‌ఘునాథ‌రెడ్డికి టికెట్లు ఇవ్వ‌ర‌ని.. తాము చెప్పిన వారికే టికెట్లు ఇస్తార‌ని.. అంత‌ర్గ‌త ప్ర‌చారం చేయిస్తున్నారు. గ‌త నెల రోజులుగా సోష‌ల్ మీడియాలో తాడిప‌త్రి బ్ర‌డ‌ర్స్ ట్యాగ్‌తో వ‌స్తున్న ఈ ప్రచారం.. టీడీపిన ఇబ్బంది పెడుతోంది.

ఇక‌, చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సంద‌డి చేయాల‌ని అనుకున్న వైకుంఠం, ప‌ల్లెల కార్య‌క్ర‌మాల‌కు కేడ‌ర్ వెళ్ల‌కుండా.. తాడిప‌త్రి బ్ర‌ద‌ర్స్ క‌ట్ట‌డి చేశారు. ఇక‌, ఇప్పుడు టికెట్ల‌పై కాక రేపుతున్నారు.ఇన్ని తెలిసినా.. పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago