Political News

టీడీపీని ఇరుకున పెడుతున్న రెండు నియోజ‌క‌వ‌ర్గాలు..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి బ‌లమైన జిల్లాలు చాలానే ఉన్నాయి. ఉభ‌య గోదావ‌రులు, గుంటూరు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు, కృష్ణా వంటివి కేడ‌ర్ ప‌రంగా బాగున్న జిల్లాలు. వీటిలో మ‌రీ ముఖ్యంగా సీమ ప‌రిధిలో ఉన్న అనంత‌పురం టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుచుకుంది. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఒక్క హిందూపురం, ఉర‌వకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే విజ‌యం సాధించింది.

అయిన‌ప్ప‌టికీ.. కేడ‌ర్ బ‌లంగానే ఉంది. ఇక‌, ఈ అనంత‌పురంలోనూ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు.. వ్య‌క్తులు, పార్టీ ప‌రంగా చూసుకున్నా.. ఈ రెండు పార్టీకి కీల‌క‌మై. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దూకుడున్నా.. వైసీపీ నాయ‌కులు కాలు దువ్వుతున్నా.. పార్టీ ఎదురీత ఈదుతోంది. అయితే.. అనంత‌లోని ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం.. వైసీపీ దూకుడు లేకున్నా.. టీడీపీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో విల‌విల్లాడుతోంది.

నిజానికి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల నుంచి ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ లేదు. కానీ, పార్టీలో నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. పంతాలు పట్టింపులు తెలుగు దేశం పార్టీని ఇరుకున పెడుతున్నాయి. వీటిలో అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాలు కీల‌కంగా ఉన్నాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైకుంఠం ప్ర‌భాక‌ర్‌చౌద‌రి, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ, తాడిప‌త్రి బ్ర‌ద‌ర్స్‌.. జేసీ ప్ర‌భాక‌ర్‌, దివాక‌ర్‌ల హ‌వా.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

వారు రారు.. ఎవ‌రినీ రానివ్వ‌రు.. అన్నచందంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు విఘాతం క‌లిగిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో .. పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న వైకుంఠం చౌద‌రికి. ర‌ఘునాథ‌రెడ్డికి టికెట్లు ఇవ్వ‌ర‌ని.. తాము చెప్పిన వారికే టికెట్లు ఇస్తార‌ని.. అంత‌ర్గ‌త ప్ర‌చారం చేయిస్తున్నారు. గ‌త నెల రోజులుగా సోష‌ల్ మీడియాలో తాడిప‌త్రి బ్ర‌డ‌ర్స్ ట్యాగ్‌తో వ‌స్తున్న ఈ ప్రచారం.. టీడీపిన ఇబ్బంది పెడుతోంది.

ఇక‌, చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సంద‌డి చేయాల‌ని అనుకున్న వైకుంఠం, ప‌ల్లెల కార్య‌క్ర‌మాల‌కు కేడ‌ర్ వెళ్ల‌కుండా.. తాడిప‌త్రి బ్ర‌ద‌ర్స్ క‌ట్ట‌డి చేశారు. ఇక‌, ఇప్పుడు టికెట్ల‌పై కాక రేపుతున్నారు.ఇన్ని తెలిసినా.. పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది.

This post was last modified on December 1, 2023 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

12 minutes ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

45 minutes ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

2 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

2 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

3 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

4 hours ago