ఒకవైపు కరోనా.. మరోవైపు తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు. వెరసి.. ఏపీ సర్కారుకు ఆదాయం అంతకంతకూ తగ్గుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల కోసం నిధులు అవుసరమవుతున్నాయి. చేతిలో డబ్బులేని వేళ.. ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు తేవటంపైన ఏపీ సర్కారు ఫోకస్ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ అప్పును తీసుకురావటం తెలిసిందే.
అయినప్పటికీ నెల తిరగేసరికి నిధుల కోసం కిందామీదా పడే పరిస్థితి. తాజాగా మరింత అప్పు అవసరమైన నేపథ్యంలో ఏపీ సర్కారు ద్రవ్య నియంత్రణ- బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 3.5 శాతం పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త అప్పు తీసుకునే వెసులుబాటు కలగనుంది.
కొత్త అప్పు కోసం ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఏపీ సర్కారు జారీ చేసిన కొత్త ఆర్డినెన్సు పుణ్యమా అని మరో రూ.20వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తసీుకునే వెసులుబాటు కలుగనుంది. అయితే.. ఈ ఆర్డినెన్సును మోడీ సర్కారు ఓకే చేయాల్సి ఉంటుంది. ఏమైనా.. తరచూ అప్పులు చేస్తూ.. పాలనా రథాన్ని లాగించటం కత్తి మీద సాముగా మారిందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి నుంచి ఏపీ సర్కారు ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…