ఒకవైపు కరోనా.. మరోవైపు తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు. వెరసి.. ఏపీ సర్కారుకు ఆదాయం అంతకంతకూ తగ్గుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల కోసం నిధులు అవుసరమవుతున్నాయి. చేతిలో డబ్బులేని వేళ.. ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు తేవటంపైన ఏపీ సర్కారు ఫోకస్ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ అప్పును తీసుకురావటం తెలిసిందే.
అయినప్పటికీ నెల తిరగేసరికి నిధుల కోసం కిందామీదా పడే పరిస్థితి. తాజాగా మరింత అప్పు అవసరమైన నేపథ్యంలో ఏపీ సర్కారు ద్రవ్య నియంత్రణ- బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 3.5 శాతం పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త అప్పు తీసుకునే వెసులుబాటు కలగనుంది.
కొత్త అప్పు కోసం ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఏపీ సర్కారు జారీ చేసిన కొత్త ఆర్డినెన్సు పుణ్యమా అని మరో రూ.20వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తసీుకునే వెసులుబాటు కలుగనుంది. అయితే.. ఈ ఆర్డినెన్సును మోడీ సర్కారు ఓకే చేయాల్సి ఉంటుంది. ఏమైనా.. తరచూ అప్పులు చేస్తూ.. పాలనా రథాన్ని లాగించటం కత్తి మీద సాముగా మారిందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి నుంచి ఏపీ సర్కారు ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2020 4:55 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…