ఒకవైపు కరోనా.. మరోవైపు తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు. వెరసి.. ఏపీ సర్కారుకు ఆదాయం అంతకంతకూ తగ్గుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల కోసం నిధులు అవుసరమవుతున్నాయి. చేతిలో డబ్బులేని వేళ.. ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు తేవటంపైన ఏపీ సర్కారు ఫోకస్ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ అప్పును తీసుకురావటం తెలిసిందే.
అయినప్పటికీ నెల తిరగేసరికి నిధుల కోసం కిందామీదా పడే పరిస్థితి. తాజాగా మరింత అప్పు అవసరమైన నేపథ్యంలో ఏపీ సర్కారు ద్రవ్య నియంత్రణ- బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 3.5 శాతం పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త అప్పు తీసుకునే వెసులుబాటు కలగనుంది.
కొత్త అప్పు కోసం ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఏపీ సర్కారు జారీ చేసిన కొత్త ఆర్డినెన్సు పుణ్యమా అని మరో రూ.20వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తసీుకునే వెసులుబాటు కలుగనుంది. అయితే.. ఈ ఆర్డినెన్సును మోడీ సర్కారు ఓకే చేయాల్సి ఉంటుంది. ఏమైనా.. తరచూ అప్పులు చేస్తూ.. పాలనా రథాన్ని లాగించటం కత్తి మీద సాముగా మారిందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి నుంచి ఏపీ సర్కారు ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2020 4:55 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…