ఒకవైపు కరోనా.. మరోవైపు తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు. వెరసి.. ఏపీ సర్కారుకు ఆదాయం అంతకంతకూ తగ్గుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల కోసం నిధులు అవుసరమవుతున్నాయి. చేతిలో డబ్బులేని వేళ.. ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు తేవటంపైన ఏపీ సర్కారు ఫోకస్ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ అప్పును తీసుకురావటం తెలిసిందే.
అయినప్పటికీ నెల తిరగేసరికి నిధుల కోసం కిందామీదా పడే పరిస్థితి. తాజాగా మరింత అప్పు అవసరమైన నేపథ్యంలో ఏపీ సర్కారు ద్రవ్య నియంత్రణ- బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 3.5 శాతం పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త అప్పు తీసుకునే వెసులుబాటు కలగనుంది.
కొత్త అప్పు కోసం ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఏపీ సర్కారు జారీ చేసిన కొత్త ఆర్డినెన్సు పుణ్యమా అని మరో రూ.20వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తసీుకునే వెసులుబాటు కలుగనుంది. అయితే.. ఈ ఆర్డినెన్సును మోడీ సర్కారు ఓకే చేయాల్సి ఉంటుంది. ఏమైనా.. తరచూ అప్పులు చేస్తూ.. పాలనా రథాన్ని లాగించటం కత్తి మీద సాముగా మారిందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి నుంచి ఏపీ సర్కారు ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2020 4:55 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…