తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటుందని.. మెజారిటీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ సొంతం చేసుకుంటుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఒకటి రెండు తప్ప.. మిగిలిన సర్వేలు.. పూర్తిస్థాయిలో మెజారిటీ కూడా కాంగ్రెస్ పంపాయించుకుంటుందని అంచనా వేశాయి. సో.. డిసెంబరు 3నాటి ఫలితం ముందు.. ఇప్పుడు వచ్చిన సర్వేల రిజల్ట్.. సహజంగానే కాంగ్రెస్లో ఊపు తెచ్చింది.
తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్.. గత పదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. అయినా.. తెలంగాణ ప్రజలు గత రెండు ఎన్నికల్లోనూ పార్టీని ఆదరించలేదు. ఇక, ఇప్పుడు మాత్రం ఆదరిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే.. ఈ క్రెడిట్ మొత్తం పార్టీ చీఫ్ రేవంత్రెడ్డికే వస్తుందని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు చేర్చి.. పార్టీని నిలబెట్టేందుకు ఆయన చేసిన కృషిని కూడా తలుచుకుంటున్నారు.
“ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమై.. కాంగ్రెస్పార్టీ విజయం దక్కించుకుంటే.. అది పూర్తిగా రేవంత్ క్రెడిటే” అని కొడంగల్ నియోజకవర్గం నాయకులు చెబుతున్నారు. ఇక, అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ నేతలు కూడా.. రేవంత్ కృషిని తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. అనేక విమర్శలు.. అపవాదు లు.. మాటల తూటాలు.. ఎదుర్కొన్న రేవంత్ను చెక్కిన శిల్పమనే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి సహాయనిరాకరణ ఓ రేంజ్లో రేవంత్ను కుదిపేసింది. మిగిలిన నాయకులు జగ్గారెడ్డి వంటి వారు కూడా.. ఎక్కడ నుంచో వచ్చినోళ్లకు పదవులు ఇస్తున్నారంటూ.. విమర్శలు గుప్పించారు. ఇటు వీళ్లని గాడిలో పెట్టుకుంటూనే అధికార పార్టీ బీఆర్ ఎస్ నుంచి వస్తున్న విమర్శలు.. దాడులు.. నియోజకవర్గాల్లో కార్యకర్తల, నాయకుల జంపింగులను తట్టుకుని.. రేవంత్ తాను నిలబడి.. పార్టీని పరుగులు పెట్టించిన తీరు.. నభూతో అనే చెబుతున్నారు పరిశీలకులు.
నిజంగానే రేపు డిసెంబరు 3న పార్టీ విన్ అయి. అధికారంలోకి వస్తే.. రేవంత్ కృషిని విస్మరించలేమని అంటున్నారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలు.. ఎదురీతలు.. ఢీ అంటే ఢీ అన్నట్టుగా బీఆర్ ఎస్కు పోటీగా నిలవడం వంటివాటిని వారు గుర్తు చేస్తున్నారు. ఇదంతా.. రేవంత్ రాకతోనే సాధ్యమైందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన అధికార పీఠం రేవంత్ హయాంలో దక్కుతుండడం మరింతగా ఆయన హవాను పెంచుతుందని లెక్కలు వేస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…