Political News

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ర‌ద్ద‌వుతుందా…?

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు ఈ వ్య‌వ‌స్థ ఉంటుందా? ఎన్నిక‌ల స‌మయానికి ర‌ద్ద‌వుతుందా? అదే జ‌రిగితే వైసీపీ నాయ‌కులు ఏం చేయాలి? పార్టీ అధిష్టానం ప్ర‌త్య‌మ్యాయ మార్గాల‌ను అన్వేషిందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 2019 అక్టోబ‌రులోనే వ‌చ్చిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై రెండు ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఒక‌టి దీనిలో పాజిటివ్‌. రెండు నెగిటివ్‌. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరువ చేయ‌డం.. పాజిటివ్‌.

అంతేకాదు.. నెలనెలా .. సామాజిక పింఛ‌న్ల‌ను.. వ‌లంటీర్లు ఇంటింటికీ పంచుతుండ‌డం.. ఇతర ప‌థ‌కాల‌పైనా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసి ల‌బ్ధిదారులు కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా.. స‌హ‌క‌రించి.. వారికి మేలు చేయ‌డం.. అనేది పాజిటివ్. దీనిపై ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే.. అస‌లు సిస‌లు అంశం రెండోదే. రాజ‌కీయంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును గుర్తించి ఓట‌ర్ల జాబితా నుంచి తీసేస్తున్నార‌నేది.. ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌.

అంతేకాదు.. వైసీపీకి వ‌లంటీర్లు మౌత్ పీస్‌గా మారార‌నేది మ‌రో కీల‌క అంశం. ఈ అంశాలు.. గ‌త మూడేళ్లుగా రాష్ట్రంలో రాజ‌కీయ వివాదంగా మారాయి. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. ఏకంగా.. వ‌లంటీర్ల‌పై ఉమెన్ ట్రాఫికింగ్ అనే ముద్ర వేసేశారు. మ‌హిళ‌ల అదృశ్యం వెనుక వ‌లంటీర్ల పాత్ర ఉంద‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఒకానొక ద‌శ‌లో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై స‌మాజంలోనూ వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కానీ, దీనిని వైసీపీ ప్ర‌భుత్వం అధిగ‌మించి.. వ‌లంటీర్ల‌ను నిల‌బెట్టింది.

అయితే.. ఇప్పుడు ఈ విష‌యం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాజీ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్‌బాబు.. వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఉన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ వేశారు. వ‌లంటీర్లు ప్ర‌భుత్వానికి చెందిన వారైనా.. వైసీపీకి చెందిన ప‌నులు చేస్తున్నార‌ని, ఓట‌ర్ల జాబితాలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నార‌ని.. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న సుప్రీంకోర్టుకు తెలిపారు.

దీంతో ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు వ‌చ్చే నెల‌కు వాయిదా వేసింది. అయితే.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాత్కాలికంగా అయినా.. స‌స్పెండ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో విపత్తును ముందుగానే గుర్తించిన వైసీపీ ప్ర‌భుత్వం గృహ‌సార‌థుల‌ను అలెర్ట్ చేస్తోంది. వీరు పూర్తిగా పార్టీకి చెందిన వారే. వీరికి వ‌లంటీర్ల‌కు ఉన్న అవ‌కాశాలు లేక‌పోయినా.. దాదాపు అంతే రేంజ్‌లో బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 1, 2023 12:13 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

41 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

56 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

56 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago