Political News

బీజేపీకి పెద్ద పరీక్షేనా ?

తాజాగా జరిగిన పోలింగులో మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా బీజేపీకి మాత్రం పెద్ద పరీక్షే ఎదురయ్యింది. అందులోను పోటీచేసిన అభ్యర్ధులందరిలో ఆరుగురి పరిస్ధితి మరీ ప్రత్యేకం. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు చాలా ప్రత్యేకం. ఎలాగంటే ఇపుడు పోటీచేసిన వారిలో ముగ్గురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏల హోదాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కూడా పోటీచేసిన వాళ్ళున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని నానా రచ్చ చేశారు.

ఇపుడు బీజేపీలో పోటీచేసిన ముగ్గురు ఎంఎల్ఏలు కూడా ఉపఎన్నికల్లో గెలిచిన వారే. ఇక ముగ్గురి ఎంపీల సంగతి చూస్తే మరీ ప్రత్యేకం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంఎల్ఏగా పోటీచేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల సిగ్మెంట్ లో పోటీచేశారు. రఘునందనరావు దుబ్బాకలోను, ఈటల రాజేందర్ గజ్వేలు, హుజూరాబాద్, రాజాసింగ్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేశారు.

ఇపుడు విషయం ఏమిటంటే పార్టీ అధికారంలోకి రావటం సంగతి దేవుడెరుగు అసలు వీళ్ళ ముగ్గురు గెలుస్తారా అన్నదే పాయింట్. వీళ్ళల్లో బండి సంజయ్ కరీంనగర్లో గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. మిగిలిన ఐదుగురి గెలుపుపై ఎవరూ నమ్మకంగా చెప్పటంలేదు. ఈ ఎన్నికల్లో గనుక ఈ ఆరుగురు గెలవకపోతే పోయిన ఎన్నికల్లో ఏదో అదృష్టం కలిసొచ్చి గెలిచారంతే అన్న విమర్శలు బాగా పెరిగిపోతాయి. వీళ్ళు ఆరుగురు కూడా తమ గెలుపు ఖాయమని పదేపదే చాలెంజులు చేసిన విషయం తెలిసిందే.

తాజా ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్ధితిని గమనిస్తే అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ అనే అంటున్నారు కానీ ఎవరూ బీజేపీ ప్రస్తావన తేవటంలేదు. వివిధ సంస్ధలు నిర్వహించిన సర్వేల్లో కూడా బీజేపీకి మహాయితే 4 లేదా 5 సీట్లకు మించి రావని జోస్యాలు చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఎవరికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం కలగటంలేదు. ఈ పరిస్ధితే ఇపుడు పై ఆరుగురికి పెద్ద పరీక్షగా మారిపోయిందని చెప్పాలి.

This post was last modified on December 1, 2023 9:53 am

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago