తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయాలపై తాజాగా అనేక సర్వేలు వచ్చాయి. కాంగ్రెస్-బీజేపీల మధ్య మూడు రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉంటుందని సర్వేలు చెప్పగా.. ఒక రాష్ట్రం మిజోరాంలో కాంగ్రెస్-అక్కడి స్థానిక పార్టీ ఎంఎన్పీల మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశాయి. అయితే.. తెలంగాణలో కూడా ఇంతే పోటీ ఉంటుందని చెప్పినా.. కాంగ్రెస్కు ఆధిక్యం ఇచ్చాయి.
ఇదిలావుంటే.. ఈ సర్వేలపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. తాము ఈ సర్వేలను నమ్మేది లేదని.. బీఆర్ ఎస్ నేత, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతేకాదు.. డిసెంబరు 3న సర్వే సంస్థలు తేడా వస్తే.. క్షమాపణలు చెబుతాయా? అని ప్రశ్నించారు. ఇక, 2018లోనూ ఇలానే తమకు వ్యతిరేకంగా సర్వే రిజల్ట్ వచ్చిందని.. కానీ, కేసీఆర్ విజయం దక్కించుకుని. అధికారంలోకి వచ్చారని కేటీఆర్ చెప్పారు.
ఇక, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సర్వే సంస్థల నిజాయితీని కొనియాడారు. అవి తప్పు చెప్పబోవమని అన్నారు. కొద్దిపాటి తేడా ఉన్నప్పటికీ.. సర్వేలు నిజమే చెబుతున్నాయన్నారు. దీంతో ఇప్పుడు అసలు 2018లో ఏం జరిగింది? కేటీఆర్ చెప్పినట్టు అప్పట్లో కేసీఆర్ ఓడిపోతున్నారని సర్వేలు వెల్లడించాయా? అనే విషయం ఆసక్తిగా మారింది. దీంతో తెలంగాణ జనాలు.. ఇప్పుడు నెట్లో తీవ్రంగా ఈ విషయంపై శోధిస్తున్నారు.
2018లో తెలంగాణలో ఏం జరిగింది? అప్పటి సర్వే ఫలితాలేంటి? అనే విషయాన్ని భారీగా వెతికే పనిలో పడ్డారు. అంతేకాదు.. సర్వేలు తర్వాత.. వచ్చిన రిజల్ట్పైనా నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా.. 2018లో సర్వేలు ఏం చెప్పాయి? అనే ప్రశ్నే ఉత్పన్నమవుతోంది.
2018లో సర్వేలు ఏం చెప్పాయంటే
సీఎన్ ఎక్స్ సర్వే ప్రకారం… టీఆర్ ఎస్ భారీ మెజారిటీ దక్కించుకుంటుంది. ఏకంగా.. 62-70 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 32-38 సీట్లు వస్తాయని పేర్కొంది.
టీవీ 9: ఈ సర్వే ప్రకారం.. బీఆర్ ఎస్కు 75-85 సీట్లు, కాంగ్రెస్కు 25-35 సీట్లు వస్తాయని చెప్పింది.
రిపబ్లిక్ సీ ఓటరు: ఈ సర్వే ప్రకారం.. బీఆర్ ఎస్కు 56-62 సీట్లు, కాంగ్రెస్కు 47-59 సీట్లు వస్తాయని తెలిపింది.
టైమ్స్ నౌ: బీఆర్ ఎస్కు 66 స్థానాలు, కాంగ్రెస్కు 37 సీట్లు వస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది.
కొసమెరుపు: ఎన్నికల వాస్తవ ఫలితాల్లోనూ ఇదే నిజమైంది. టీఆర్ ఎస్కు 88 సీట్లలో విజయం దక్కింది. కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితం అయింది. ఇక, టీడీపీ రెండు చోట్ల విజయం దక్కించుకుంది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. స్వల్ప తేడాలే తప్ప.. భారీ తేడాలైతే.. కనిపించలేదు.
This post was last modified on November 30, 2023 10:17 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…