ఒక ప్రమాదకర విషయం బయటపడ్డపుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ అదే ప్రమాదకర పరిస్థితి రోజుల తరబడి కొనసాగుతున్నపుడు.. ఒక దశ దాటాక అది మామూలు విషయం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం తాలూకు వార్తలు ఇలాగే తయారయ్యాయి. ఒకప్పుడు ఏపీలో వందల్లో కేసులు బయటపడుతుంటేనే తెగ భయపడిపోయే వాళ్లం. కానీ అది వేల స్థాయికి వెళ్లిపోయి చాలా కాలం అయింది.
ఒక దశలో రోజుకు పది వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. తొలిసారి ఆ మార్కును అందుకున్నపుడు వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇదే పరిస్థితి కొన్ని వారాలుగా కొనసాగుతోంది. కేసులు నిలకడగా పది వేల మార్కును టచ్ చేస్తున్నారు. రోజుకు 80-100 మంది మధ్య చనిపోతున్నారు. చూస్తుండగానే దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో పైపైకి వెళ్లిపోతోంది ఏపీ.
ఇప్పుడు ఏకంగా ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. ఆదివారం నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 24,767కు చేరుకుంది. ఆదివారం కూడా 10,603 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు (4,22,085)ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది ఏపీ. యాక్టివ్ కేసుల్లోనూ ఏపీది రెండో స్థానమే. 99,129 యాక్టివ్ కేసులున్నాయి ఏపీలో. ఈ విషయంలో తమిళనాడు (52,721) చాలా మెరుగు.
మహారాష్ట్ర మొత్తం 7,80,689 కేసులతో అగ్ర స్థానంలో ఉంది. అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 1,93,548. ఏపీలో 3 లక్షల మందికి పైగానే కరోనా బాధితులు రికవర్ అయ్యారు. ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని చోట్లా కరోనా విలయం కొనసాగుతోంది. గోదావరి, చిత్తూరు లాంటి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటిదాకా ఏపీలో 3,884 మంది మరణించారు. ఇక ఇండియా మొత్తంలో కరోనా కేసులు 36 లక్షల మార్కును దాటేశాయి. ఇప్పటిదాకా 64,617 మంది కరోనా వల్ల చనిపోయారు.
This post was last modified on August 31, 2020 4:55 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…