ఒక ప్రమాదకర విషయం బయటపడ్డపుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ అదే ప్రమాదకర పరిస్థితి రోజుల తరబడి కొనసాగుతున్నపుడు.. ఒక దశ దాటాక అది మామూలు విషయం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం తాలూకు వార్తలు ఇలాగే తయారయ్యాయి. ఒకప్పుడు ఏపీలో వందల్లో కేసులు బయటపడుతుంటేనే తెగ భయపడిపోయే వాళ్లం. కానీ అది వేల స్థాయికి వెళ్లిపోయి చాలా కాలం అయింది.
ఒక దశలో రోజుకు పది వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. తొలిసారి ఆ మార్కును అందుకున్నపుడు వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇదే పరిస్థితి కొన్ని వారాలుగా కొనసాగుతోంది. కేసులు నిలకడగా పది వేల మార్కును టచ్ చేస్తున్నారు. రోజుకు 80-100 మంది మధ్య చనిపోతున్నారు. చూస్తుండగానే దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో పైపైకి వెళ్లిపోతోంది ఏపీ.
ఇప్పుడు ఏకంగా ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. ఆదివారం నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 24,767కు చేరుకుంది. ఆదివారం కూడా 10,603 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు (4,22,085)ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది ఏపీ. యాక్టివ్ కేసుల్లోనూ ఏపీది రెండో స్థానమే. 99,129 యాక్టివ్ కేసులున్నాయి ఏపీలో. ఈ విషయంలో తమిళనాడు (52,721) చాలా మెరుగు.
మహారాష్ట్ర మొత్తం 7,80,689 కేసులతో అగ్ర స్థానంలో ఉంది. అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 1,93,548. ఏపీలో 3 లక్షల మందికి పైగానే కరోనా బాధితులు రికవర్ అయ్యారు. ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని చోట్లా కరోనా విలయం కొనసాగుతోంది. గోదావరి, చిత్తూరు లాంటి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటిదాకా ఏపీలో 3,884 మంది మరణించారు. ఇక ఇండియా మొత్తంలో కరోనా కేసులు 36 లక్షల మార్కును దాటేశాయి. ఇప్పటిదాకా 64,617 మంది కరోనా వల్ల చనిపోయారు.
This post was last modified on August 31, 2020 4:55 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…