టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు 1 నుంచి యాక్టివ్ కానున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. విజయవాడకు చేరుకుని శుక్రవారం నుంచి యాధావిధిగా అన్నికార్యక్రమాల్లోనూ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
గురువారం సాయంత్రం చంద్రబాబు హైదరాబాద్ నుంచి శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి అక్కడే బస చేయనున్నారు. సంప్రదాయం మేరకు రేపు ఉదయం ముందుగా వరాహస్వామి వారిని బాబు దర్శించుకోనున్నారు. ఉదయం 7.30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం గాయత్రి నిలయంలో కాసేపు విశ్రాంతి తీసుకోనున్న చంద్రబాబు.. 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరనున్నారు. రేణిగుంట నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్ళనున్నారు.
అక్కడ నుంచి తొలుత అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం.. విశాఖలోని సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. అటు నుంచి తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకునే చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చిస్తారు. అనంతరం.. తన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
డిసెంబరు 3, 11, 15, 21 తేదీల్లో జరిగే బహిరంగ సభల్లోనూ చంద్రబాబు పాల్గొంటారు. అదేసమయంలో జనసేన-టీడీపీసమన్వయ సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, కురుపాం, విశాఖ, విజయవాడ, అనంతపురంలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.
This post was last modified on November 30, 2023 2:11 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…