టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు 1 నుంచి యాక్టివ్ కానున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. విజయవాడకు చేరుకుని శుక్రవారం నుంచి యాధావిధిగా అన్నికార్యక్రమాల్లోనూ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
గురువారం సాయంత్రం చంద్రబాబు హైదరాబాద్ నుంచి శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి అక్కడే బస చేయనున్నారు. సంప్రదాయం మేరకు రేపు ఉదయం ముందుగా వరాహస్వామి వారిని బాబు దర్శించుకోనున్నారు. ఉదయం 7.30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం గాయత్రి నిలయంలో కాసేపు విశ్రాంతి తీసుకోనున్న చంద్రబాబు.. 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరనున్నారు. రేణిగుంట నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్ళనున్నారు.
అక్కడ నుంచి తొలుత అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం.. విశాఖలోని సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుంటారు. అటు నుంచి తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకునే చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చిస్తారు. అనంతరం.. తన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
డిసెంబరు 3, 11, 15, 21 తేదీల్లో జరిగే బహిరంగ సభల్లోనూ చంద్రబాబు పాల్గొంటారు. అదేసమయంలో జనసేన-టీడీపీసమన్వయ సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, కురుపాం, విశాఖ, విజయవాడ, అనంతపురంలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.
This post was last modified on November 30, 2023 2:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…