హైదరాబాద్ ఓటరు అస్సలు మారలేదు. నేతలు గొంతు చించుకున్నా.. మీడియా చైతన్యం చేసినా.. ఎన్ని కల సంఘం రండి బాబూ రండని ఆహ్వానించినా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. కిక్కురుమనలేదు. తన మానాన తను సైలెంట్ అయిపోయారు. దాదాపు 42 రోజుల పాటు మైకులు హోరెత్తాయి. నాయకలు ప్రచారంతో ఊరూవాడా దద్దరిల్లింది. ఇక, పోలింగ్ కూడా గురువారం ఉదయం ప్రారంభమైంది.
వీధి చవర్లోనో.. రోడ్డు మధ్యలోనో పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓ నాలుగు అడుగులు వేస్తే.. పోలింగ్ కేంద్రం. అయినా.. హైదరాబాద్ ఓటరు కునుకు తీస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకుని.. జిల్లాలు, పట్టణాలు, గ్రామాల నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక, సాధారణ జనాలకు దూరంగా ఉండే సెలబ్రిటీలు సైతం.. క్యూల్లో నిలబడి ఓటెత్తారు.
అదేసమయంలో వృద్ధులు, వికలాంగులు.. పేషంట్లు కూడా వచ్చి ఈ ఎన్నికల్లో పాలు పంచుకున్నారు. ఇలా ఎన్ని ఉదాహరణలుకళ్ల ముందు కనిపిస్తున్నా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయానికి వివిధ జిల్లాల్లో 35 శాతం సగటున పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్లో మాత్రం.. 13 శాతమే నమోదైంది. దీనిని బట్టి హైదరాబాద్ ఓటరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో.. ఎంత నిరుత్సాహంతో ఉన్నాడో అర్థమవుతోంది. ఏదేమైనా.. వీరిని మార్చడం ఇక ఎవరి వల్లా కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on November 30, 2023 1:59 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…