హైదరాబాద్ ఓటరు అస్సలు మారలేదు. నేతలు గొంతు చించుకున్నా.. మీడియా చైతన్యం చేసినా.. ఎన్ని కల సంఘం రండి బాబూ రండని ఆహ్వానించినా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. కిక్కురుమనలేదు. తన మానాన తను సైలెంట్ అయిపోయారు. దాదాపు 42 రోజుల పాటు మైకులు హోరెత్తాయి. నాయకలు ప్రచారంతో ఊరూవాడా దద్దరిల్లింది. ఇక, పోలింగ్ కూడా గురువారం ఉదయం ప్రారంభమైంది.
వీధి చవర్లోనో.. రోడ్డు మధ్యలోనో పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓ నాలుగు అడుగులు వేస్తే.. పోలింగ్ కేంద్రం. అయినా.. హైదరాబాద్ ఓటరు కునుకు తీస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకుని.. జిల్లాలు, పట్టణాలు, గ్రామాల నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక, సాధారణ జనాలకు దూరంగా ఉండే సెలబ్రిటీలు సైతం.. క్యూల్లో నిలబడి ఓటెత్తారు.
అదేసమయంలో వృద్ధులు, వికలాంగులు.. పేషంట్లు కూడా వచ్చి ఈ ఎన్నికల్లో పాలు పంచుకున్నారు. ఇలా ఎన్ని ఉదాహరణలుకళ్ల ముందు కనిపిస్తున్నా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయానికి వివిధ జిల్లాల్లో 35 శాతం సగటున పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్లో మాత్రం.. 13 శాతమే నమోదైంది. దీనిని బట్టి హైదరాబాద్ ఓటరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో.. ఎంత నిరుత్సాహంతో ఉన్నాడో అర్థమవుతోంది. ఏదేమైనా.. వీరిని మార్చడం ఇక ఎవరి వల్లా కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on November 30, 2023 1:59 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…