హైదరాబాద్ ఓటరు అస్సలు మారలేదు. నేతలు గొంతు చించుకున్నా.. మీడియా చైతన్యం చేసినా.. ఎన్ని కల సంఘం రండి బాబూ రండని ఆహ్వానించినా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. కిక్కురుమనలేదు. తన మానాన తను సైలెంట్ అయిపోయారు. దాదాపు 42 రోజుల పాటు మైకులు హోరెత్తాయి. నాయకలు ప్రచారంతో ఊరూవాడా దద్దరిల్లింది. ఇక, పోలింగ్ కూడా గురువారం ఉదయం ప్రారంభమైంది.
వీధి చవర్లోనో.. రోడ్డు మధ్యలోనో పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓ నాలుగు అడుగులు వేస్తే.. పోలింగ్ కేంద్రం. అయినా.. హైదరాబాద్ ఓటరు కునుకు తీస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకుని.. జిల్లాలు, పట్టణాలు, గ్రామాల నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక, సాధారణ జనాలకు దూరంగా ఉండే సెలబ్రిటీలు సైతం.. క్యూల్లో నిలబడి ఓటెత్తారు.
అదేసమయంలో వృద్ధులు, వికలాంగులు.. పేషంట్లు కూడా వచ్చి ఈ ఎన్నికల్లో పాలు పంచుకున్నారు. ఇలా ఎన్ని ఉదాహరణలుకళ్ల ముందు కనిపిస్తున్నా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయానికి వివిధ జిల్లాల్లో 35 శాతం సగటున పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్లో మాత్రం.. 13 శాతమే నమోదైంది. దీనిని బట్టి హైదరాబాద్ ఓటరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో.. ఎంత నిరుత్సాహంతో ఉన్నాడో అర్థమవుతోంది. ఏదేమైనా.. వీరిని మార్చడం ఇక ఎవరి వల్లా కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on November 30, 2023 1:59 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…