Political News

ఓటేసిన క‌విత‌.. కామెంట్సే వివాదం.. కాంగ్రెస్ రెడీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ఈ రోజు(గురువారం) ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌శాంతంగా ప్రారంభ‌మైంది. ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే.. ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ల‌లో నిల‌బ‌డ్డారు. సినీ రంగం నుంచి రాజ‌కీయ రంగం, పారిశ్రామిక రంగాల‌కు చెందిన దిగ్గ‌జాలు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అయితే.. ఓటు వేసిన అనంత‌రం.. క‌విత మాట్లాడిన వ్యాఖ్య‌లు వివాదానికి దారితీస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. ఎన్నిక‌ల సంఘానికిఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యా రు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం క‌విత మీడియాతో మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా యూత్‌ తప్పకుండా ఓటు వేయాలన్నారు.

ఇదేస‌మ‌యంలో తెలంగాణ‌లో మూడో సారి కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మూడోసారి వ‌రుస‌గా ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశం కేసీఆర్‌కు క‌ల్పించాల‌ని ఆమె విన్న‌వించారు. కారు గుర్తుకు ఓటేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అభివృద్ధి చేస్తున్న పార్టీని, నాయ‌కుడిని గెలిపించాల‌ని కూడా ఆమె విన్న‌వించారు. పెద్ద ఎత్తున యువ‌త త‌ర‌లి వ‌చ్చి కారు గుర్తుకు ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని విన్న‌వించారు.

అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. ఇలా ఒక పార్టీకిఓటేయాల‌ని కానీ.. ఒక పార్టీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌డం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. పైగా.. పోలింగ్ ప్రారంభ‌మైన స‌మ‌యంలో అస‌లు ఎవ‌రూ కూడా ఒక పార్టీకి ఓటేయాల‌ని కోర‌కూడ‌దు. అందునా ఒక ఎన్నిక‌ల గుర్తును పేర్కొంటూ.. దానికే ఓటేయాల‌ని చెప్ప‌డం.. ఎన్నిక‌ల నిబంధ‌న‌లను పూర్తిగా ఉల్లంఘించిన‌ట్టేన‌ని కాంగ్రెస్ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి క‌విత చేసిన కామెంట్లు ఎలాంటి దుమారానికి దారి తీస్తాయో చూడాలి. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి అంబ‌ర్‌పేట‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అయితే.. ఆయ‌న మీడియాతో మాట్లాడ‌కుండా.. మౌనంగా వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

17 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

50 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

58 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago