Political News

‘వై ఏపీ నీడ్స్ జగన్’కు హైకోర్టు బ్రేక్!

‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి మరోసారి జగన్ సీఎం కావాలని, రాష్ట్రానికి జగన్ అవసరం ఎందుకు ఉంది అన్న నినాదంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, ‘వై ఏపీ నీడ్స్’ జగన్ స్లోగన్ పై టీడీపీ సోషల్ మీడియా విభాగం సెటైర్లు కూడా వేసింది. ఏపీకి జగన్ అవసరం లేదు….ఏపీకి జగన్ ఎందుకు? అన్న రీతిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి.

అదలా ఉండగానే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఏపీ సీఎస్, పలువురు అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారందరికీ ఈ వ్యవహారంపై నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా నియంత్రించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. సజ్జల సూచనల ప్రకారమే ప్రభుత్వ సిబ్బంది ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, సజ్జలతో పాటు సి ఎస్, జీఏడీ సీఎస్, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ, వాలంటీర్ శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. వైసీపీతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని మీడియా సమావేశంలో సజ్జల బహిరంగంగా చెప్పారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధితో అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. జగన్ ను పొగిడేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిగిన హైకోర్టు వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఓవైపు ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ నేతలంతా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇలా నోటీసులు జారీ చేయడం వారికి షాక్ ఇచ్చినట్లయింది.

This post was last modified on November 29, 2023 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

15 minutes ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

22 minutes ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

2 hours ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

3 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

4 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

6 hours ago