Political News

ఒక‌రిపై ఒక‌రు.. ఏపీలో దొంగ ఓట్ల రాజ‌కీయం!

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్నిక‌ల‌కు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెల‌కొంది. పైగా ఎవ‌రికి వారు రాజ‌కీయ ప్ర‌చారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గ‌త కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(స‌రిహ‌ద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండ‌డం, ఇప్ప‌టికే చ‌నిపోయిన వారికి కూడా ఓటు అలానే ఉండ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ విష‌యంలో వైసీపీపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫాం-7 ద్వారా ఓట్ల‌ను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయ‌కులు ఇంటింటికీ తిరుగు తూ.. ఓట్లుఉన్నాయా? లేదా? అనే విష‌యాల‌ను ఆరా తీస్తున్నారు. అదేస‌మ‌యంలో జీరో డోర్ నెంబ‌ర్‌లో భారీ సంఖ్య‌లో ఓట్లు ఉండ‌డాన్ని కూడా వారు వెలికి తీస్తున్నారు. ఇక‌, టీడీపీసానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గించారంటూ.. తాజాగాశ్రీకాకుళంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇలా.. టీడీపీ దొంగ ఓట్ల‌పై స‌మ‌రం షురూ చేసింది. వ‌చ్చే 15 వ‌ర‌కు కొత్త ఓట్ల‌కు అవ‌కాశం ఉండ‌డం.. ఓట‌ర్ల జాబితాలో మార్పుల‌కు అవ‌కాశం ఉండడంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని నాయ‌కులు కంటికి కునుకులేకుండా .. ఓట్ల వ్య‌వ‌హారంపైనే దృష్టి పెట్టారు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ ప్ర‌చారానికి వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. అస‌లు దొంగ ఓట్ల వ్య‌వ‌హారం అంతా కూడా.. టీడీపీదేన‌ని.. ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి తొల‌గిస్తు న్నారని.. వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ బృందం తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసి.. టీడీపీ నేత‌ల‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ వేడి పెరిగిన నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు, అటు టీడీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రంవిమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఓట్ల‌పై విరుచుకుప‌డ‌డం.. రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.

This post was last modified on November 29, 2023 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

షాకింగ్… ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బాలీవుడ్ దర్శకుడి పేరు?

ఎప్‌స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్‌స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…

55 minutes ago

కాంగ్రెస్ నేత‌ల‌కు రేవంత్ క్లాస్?

తెలంగాణ‌లో జ‌రుగుతున్న మునిసిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని క‌మిటీల‌ను నియ‌మించింది. మ‌రో…

1 hour ago

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

4 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

10 hours ago

‘మళ్లీ దర్శకుడిగా పుట్టను’.. దర్శకుడి వివరణ

సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…

10 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

10 hours ago