Political News

ఒక‌రిపై ఒక‌రు.. ఏపీలో దొంగ ఓట్ల రాజ‌కీయం!

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్నిక‌ల‌కు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెల‌కొంది. పైగా ఎవ‌రికి వారు రాజ‌కీయ ప్ర‌చారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గ‌త కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(స‌రిహ‌ద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండ‌డం, ఇప్ప‌టికే చ‌నిపోయిన వారికి కూడా ఓటు అలానే ఉండ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ విష‌యంలో వైసీపీపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫాం-7 ద్వారా ఓట్ల‌ను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయ‌కులు ఇంటింటికీ తిరుగు తూ.. ఓట్లుఉన్నాయా? లేదా? అనే విష‌యాల‌ను ఆరా తీస్తున్నారు. అదేస‌మ‌యంలో జీరో డోర్ నెంబ‌ర్‌లో భారీ సంఖ్య‌లో ఓట్లు ఉండ‌డాన్ని కూడా వారు వెలికి తీస్తున్నారు. ఇక‌, టీడీపీసానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గించారంటూ.. తాజాగాశ్రీకాకుళంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇలా.. టీడీపీ దొంగ ఓట్ల‌పై స‌మ‌రం షురూ చేసింది. వ‌చ్చే 15 వ‌ర‌కు కొత్త ఓట్ల‌కు అవ‌కాశం ఉండ‌డం.. ఓట‌ర్ల జాబితాలో మార్పుల‌కు అవ‌కాశం ఉండడంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని నాయ‌కులు కంటికి కునుకులేకుండా .. ఓట్ల వ్య‌వ‌హారంపైనే దృష్టి పెట్టారు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ ప్ర‌చారానికి వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. అస‌లు దొంగ ఓట్ల వ్య‌వ‌హారం అంతా కూడా.. టీడీపీదేన‌ని.. ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి తొల‌గిస్తు న్నారని.. వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ బృందం తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసి.. టీడీపీ నేత‌ల‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ వేడి పెరిగిన నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు, అటు టీడీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రంవిమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఓట్ల‌పై విరుచుకుప‌డ‌డం.. రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.

This post was last modified on November 29, 2023 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

18 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago