వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెలకొంది. పైగా ఎవరికి వారు రాజకీయ ప్రచారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారం తెరమీదకి వచ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(సరిహద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండడం, ఇప్పటికే చనిపోయిన వారికి కూడా ఓటు అలానే ఉండడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫాం-7 ద్వారా ఓట్లను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరుగు తూ.. ఓట్లుఉన్నాయా? లేదా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అదేసమయంలో జీరో డోర్ నెంబర్లో భారీ సంఖ్యలో ఓట్లు ఉండడాన్ని కూడా వారు వెలికి తీస్తున్నారు. ఇక, టీడీపీసానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ.. తాజాగాశ్రీకాకుళంలో నిరసన వ్యక్తం చేశారు.
ఇలా.. టీడీపీ దొంగ ఓట్లపై సమరం షురూ చేసింది. వచ్చే 15 వరకు కొత్త ఓట్లకు అవకాశం ఉండడం.. ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాయకులు కంటికి కునుకులేకుండా .. ఓట్ల వ్యవహారంపైనే దృష్టి పెట్టారు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ ప్రచారానికి వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. అసలు దొంగ ఓట్ల వ్యవహారం అంతా కూడా.. టీడీపీదేనని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ సానుభూతి పరుల ఓట్లను ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి తొలగిస్తు న్నారని.. వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ బృందం తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి.. టీడీపీ నేతలపైచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే.. ఈ వేడి పెరిగిన నేపథ్యంలో వైసీపీ నాయకులు, అటు టీడీపీ నాయకులు పరస్పరంవిమర్శలు చేసుకోవడం.. ఓట్లపై విరుచుకుపడడం.. రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
This post was last modified on November 29, 2023 4:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…