వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెలకొంది. పైగా ఎవరికి వారు రాజకీయ ప్రచారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారం తెరమీదకి వచ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(సరిహద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండడం, ఇప్పటికే చనిపోయిన వారికి కూడా ఓటు అలానే ఉండడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫాం-7 ద్వారా ఓట్లను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరుగు తూ.. ఓట్లుఉన్నాయా? లేదా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అదేసమయంలో జీరో డోర్ నెంబర్లో భారీ సంఖ్యలో ఓట్లు ఉండడాన్ని కూడా వారు వెలికి తీస్తున్నారు. ఇక, టీడీపీసానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ.. తాజాగాశ్రీకాకుళంలో నిరసన వ్యక్తం చేశారు.
ఇలా.. టీడీపీ దొంగ ఓట్లపై సమరం షురూ చేసింది. వచ్చే 15 వరకు కొత్త ఓట్లకు అవకాశం ఉండడం.. ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాయకులు కంటికి కునుకులేకుండా .. ఓట్ల వ్యవహారంపైనే దృష్టి పెట్టారు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ ప్రచారానికి వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. అసలు దొంగ ఓట్ల వ్యవహారం అంతా కూడా.. టీడీపీదేనని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ సానుభూతి పరుల ఓట్లను ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి తొలగిస్తు న్నారని.. వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ బృందం తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి.. టీడీపీ నేతలపైచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే.. ఈ వేడి పెరిగిన నేపథ్యంలో వైసీపీ నాయకులు, అటు టీడీపీ నాయకులు పరస్పరంవిమర్శలు చేసుకోవడం.. ఓట్లపై విరుచుకుపడడం.. రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
This post was last modified on November 29, 2023 4:09 pm
కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల…
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…