Political News

ఒక‌రిపై ఒక‌రు.. ఏపీలో దొంగ ఓట్ల రాజ‌కీయం!

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్నిక‌ల‌కు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెల‌కొంది. పైగా ఎవ‌రికి వారు రాజ‌కీయ ప్ర‌చారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గ‌త కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(స‌రిహ‌ద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండ‌డం, ఇప్ప‌టికే చ‌నిపోయిన వారికి కూడా ఓటు అలానే ఉండ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ విష‌యంలో వైసీపీపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఫాం-7 ద్వారా ఓట్ల‌ను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయ‌కులు ఇంటింటికీ తిరుగు తూ.. ఓట్లుఉన్నాయా? లేదా? అనే విష‌యాల‌ను ఆరా తీస్తున్నారు. అదేస‌మ‌యంలో జీరో డోర్ నెంబ‌ర్‌లో భారీ సంఖ్య‌లో ఓట్లు ఉండ‌డాన్ని కూడా వారు వెలికి తీస్తున్నారు. ఇక‌, టీడీపీసానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గించారంటూ.. తాజాగాశ్రీకాకుళంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇలా.. టీడీపీ దొంగ ఓట్ల‌పై స‌మ‌రం షురూ చేసింది. వ‌చ్చే 15 వ‌ర‌కు కొత్త ఓట్ల‌కు అవ‌కాశం ఉండ‌డం.. ఓట‌ర్ల జాబితాలో మార్పుల‌కు అవ‌కాశం ఉండడంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని నాయ‌కులు కంటికి కునుకులేకుండా .. ఓట్ల వ్య‌వ‌హారంపైనే దృష్టి పెట్టారు. అయితే.. టీడీపీ చేస్తున్న ఈ ప్ర‌చారానికి వైసీపీ ఎదురు దాడి ప్రారంభించింది. అస‌లు దొంగ ఓట్ల వ్య‌వ‌హారం అంతా కూడా.. టీడీపీదేన‌ని.. ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి తొల‌గిస్తు న్నారని.. వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ బృందం తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసి.. టీడీపీ నేత‌ల‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ వేడి పెరిగిన నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు, అటు టీడీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రంవిమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఓట్ల‌పై విరుచుకుప‌డ‌డం.. రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.

This post was last modified on November 29, 2023 4:09 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

48 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

51 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

52 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago