Political News

మూడు చోట్ల తమ్ముళ్ళు డిసైడ్ అయ్యారా ?

ఉమ్మడి కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్ధులు ఫైనల్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఫైనల్ అయిపోయానట్లేనట. ఎందుకంటే నియోజకవర్గాల ఇన్చార్జిల హోదాలో ముగ్గురు తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కమలాపురంలో పుత్తా నర్సింహారెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమంటున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన హామీల కారణంగా తామే అభ్యర్ధులం అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు నియోజకవర్గాల్లో తిరుగుతు బారీగా ఖర్చులు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కమలాపురంలో రవీంద్రనాధ రెడ్డి ఎంఎల్ఏలుగా ఉన్నారు. నిజానికి వీళ్ళముగ్గురు గట్టి అభ్యర్ధులనే చెప్పాలి. వీళ్ళల్లో డాక్టర్ సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లోనే డైరెక్టుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫారాయించటంతో 2019 ఎన్నికల్లో డాక్టర్ కు టికెట్ దక్కింది.

ఇక టీడీపీలో చూస్తే పుట్టా ఇప్పటికే ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి తిరుపతి తిరుమల దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఆర్ధికంగా బాగా గట్టి నేతనే చెప్పాలి. ఇక పుత్తా నర్సింహారెడ్డి సీనియర్ తమ్ముడే. నియోజకవర్గంలో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. భూపేష్ రెడ్డిని తీసుకుంటే చెప్పుకోదగ్గ సీనియారిటి లేదు. ఇదే సమయంలో గడచిన మూడు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం పార్టీకి మైనస్ అనే చెప్పాలి.

వీళ్ళలాగే కడపలో మాధవీరెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్ధి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి భార్య హోదాలో మాధవి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు కారణంగా ఎక్కడైనా చివరినిముషంలో అభ్యర్ధులు మారితే మారచ్చని తమ్ముళ్ళు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. లేకపోతే టీడీపీ తరపున వీళ్ళే అభ్యర్ధులుగా ఉంటారటంలో సందేహంలేదు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

39 minutes ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

2 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

2 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

3 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago