Political News

మూడు చోట్ల తమ్ముళ్ళు డిసైడ్ అయ్యారా ?

ఉమ్మడి కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్ధులు ఫైనల్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఫైనల్ అయిపోయానట్లేనట. ఎందుకంటే నియోజకవర్గాల ఇన్చార్జిల హోదాలో ముగ్గురు తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కమలాపురంలో పుత్తా నర్సింహారెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమంటున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన హామీల కారణంగా తామే అభ్యర్ధులం అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు నియోజకవర్గాల్లో తిరుగుతు బారీగా ఖర్చులు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కమలాపురంలో రవీంద్రనాధ రెడ్డి ఎంఎల్ఏలుగా ఉన్నారు. నిజానికి వీళ్ళముగ్గురు గట్టి అభ్యర్ధులనే చెప్పాలి. వీళ్ళల్లో డాక్టర్ సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లోనే డైరెక్టుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫారాయించటంతో 2019 ఎన్నికల్లో డాక్టర్ కు టికెట్ దక్కింది.

ఇక టీడీపీలో చూస్తే పుట్టా ఇప్పటికే ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి తిరుపతి తిరుమల దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఆర్ధికంగా బాగా గట్టి నేతనే చెప్పాలి. ఇక పుత్తా నర్సింహారెడ్డి సీనియర్ తమ్ముడే. నియోజకవర్గంలో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. భూపేష్ రెడ్డిని తీసుకుంటే చెప్పుకోదగ్గ సీనియారిటి లేదు. ఇదే సమయంలో గడచిన మూడు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం పార్టీకి మైనస్ అనే చెప్పాలి.

వీళ్ళలాగే కడపలో మాధవీరెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్ధి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి భార్య హోదాలో మాధవి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు కారణంగా ఎక్కడైనా చివరినిముషంలో అభ్యర్ధులు మారితే మారచ్చని తమ్ముళ్ళు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. లేకపోతే టీడీపీ తరపున వీళ్ళే అభ్యర్ధులుగా ఉంటారటంలో సందేహంలేదు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

6 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

7 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

9 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

9 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

10 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

11 hours ago