Political News

మూడు చోట్ల తమ్ముళ్ళు డిసైడ్ అయ్యారా ?

ఉమ్మడి కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్ధులు ఫైనల్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఫైనల్ అయిపోయానట్లేనట. ఎందుకంటే నియోజకవర్గాల ఇన్చార్జిల హోదాలో ముగ్గురు తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కమలాపురంలో పుత్తా నర్సింహారెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమంటున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన హామీల కారణంగా తామే అభ్యర్ధులం అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు నియోజకవర్గాల్లో తిరుగుతు బారీగా ఖర్చులు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి, మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి, కమలాపురంలో రవీంద్రనాధ రెడ్డి ఎంఎల్ఏలుగా ఉన్నారు. నిజానికి వీళ్ళముగ్గురు గట్టి అభ్యర్ధులనే చెప్పాలి. వీళ్ళల్లో డాక్టర్ సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లోనే డైరెక్టుగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫారాయించటంతో 2019 ఎన్నికల్లో డాక్టర్ కు టికెట్ దక్కింది.

ఇక టీడీపీలో చూస్తే పుట్టా ఇప్పటికే ఎంఎల్ఏగా పనిచేశారు. ఒకసారి తిరుపతి తిరుమల దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఆర్ధికంగా బాగా గట్టి నేతనే చెప్పాలి. ఇక పుత్తా నర్సింహారెడ్డి సీనియర్ తమ్ముడే. నియోజకవర్గంలో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. భూపేష్ రెడ్డిని తీసుకుంటే చెప్పుకోదగ్గ సీనియారిటి లేదు. ఇదే సమయంలో గడచిన మూడు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం పార్టీకి మైనస్ అనే చెప్పాలి.

వీళ్ళలాగే కడపలో మాధవీరెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్ధి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి భార్య హోదాలో మాధవి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు కారణంగా ఎక్కడైనా చివరినిముషంలో అభ్యర్ధులు మారితే మారచ్చని తమ్ముళ్ళు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. లేకపోతే టీడీపీ తరపున వీళ్ళే అభ్యర్ధులుగా ఉంటారటంలో సందేహంలేదు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

18 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago