Political News

ఆ ఐఏఎస్‌ల‌ను జైల్లో పెట్టండి: ఏపీ హైకోర్టు తీర్పు

ఏపీలోని వైసీపీ హ‌యాంలో అనేక మంది ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. వారిని కోర్టుకు పిలిపించి.. బోనులో నిల‌బెట్ట‌డం..రూల్స్‌పై వివ‌ర‌ణ తీసుకోవ‌డం వంటివి గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో సీఎస్‌గా ప‌నిచేసిన వారు.. డీజీపీగా ప‌నిచేసిన గౌతం స‌వాంగ్‌లు సైతం.. హైకోర్టు మెట్లు ఎక్కిన వారే. తాజాగా ఓ కేసులో ఇద్ద‌రు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను జైల్లో పెట్టాలంటూ.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. “వారిని జైల్లో పెట్టండి. త‌మాషా చేస్తున్నారు” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ క‌ళాశాల‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, కోర్టును ఆశ్ర‌యించిన కొంద‌రు పిటిష‌నర్ల అర్హ‌త మేర‌కు.. వారిని ఉద్యోగాల్లో నియ‌మించాల‌ని 2022, జూలై 26న హైకోర్టు రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జె. శ్యామ‌ల‌రావు, విద్యాశాఖ క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్‌ల‌ను ఆదేశించింది. అయితే.. వీరు ఆ విష‌యాన్ని మ‌రుగున ప‌డేశారు. దీంతో పిటిష‌న‌ర్లు మ‌రోసారి హైకోర్టును ఆశ్రయించి.. కోర్టు ధిక్క‌ర‌ణ వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా.. త‌మాషా చేసిన అధికారుల‌ను ఉపేక్షించేది లేద‌ని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌న్మ‌థ‌రావు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జె. శ్యామ‌ల‌రావు, విద్యాశాఖ క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్‌ల‌ను నెల రోజుల పాటు జైలుకు పంపించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. డిసెంబ‌రు 8న స్వ‌యంగా వ‌చ్చి జ్యుడీషియ‌ల్ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాల‌ని ఆదేశించారు. అదేస‌మ‌యంలో ఒక్కొక్క‌రూ రూ.1000 చొప్పున జ‌రిమానా చెల్లించాల‌ని ఆదేశించింది.

This post was last modified on November 28, 2023 9:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

3 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

6 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

7 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago