Political News

ఆ ఐఏఎస్‌ల‌ను జైల్లో పెట్టండి: ఏపీ హైకోర్టు తీర్పు

ఏపీలోని వైసీపీ హ‌యాంలో అనేక మంది ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. వారిని కోర్టుకు పిలిపించి.. బోనులో నిల‌బెట్ట‌డం..రూల్స్‌పై వివ‌ర‌ణ తీసుకోవ‌డం వంటివి గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో సీఎస్‌గా ప‌నిచేసిన వారు.. డీజీపీగా ప‌నిచేసిన గౌతం స‌వాంగ్‌లు సైతం.. హైకోర్టు మెట్లు ఎక్కిన వారే. తాజాగా ఓ కేసులో ఇద్ద‌రు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను జైల్లో పెట్టాలంటూ.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. “వారిని జైల్లో పెట్టండి. త‌మాషా చేస్తున్నారు” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ క‌ళాశాల‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, కోర్టును ఆశ్ర‌యించిన కొంద‌రు పిటిష‌నర్ల అర్హ‌త మేర‌కు.. వారిని ఉద్యోగాల్లో నియ‌మించాల‌ని 2022, జూలై 26న హైకోర్టు రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జె. శ్యామ‌ల‌రావు, విద్యాశాఖ క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్‌ల‌ను ఆదేశించింది. అయితే.. వీరు ఆ విష‌యాన్ని మ‌రుగున ప‌డేశారు. దీంతో పిటిష‌న‌ర్లు మ‌రోసారి హైకోర్టును ఆశ్రయించి.. కోర్టు ధిక్క‌ర‌ణ వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా.. త‌మాషా చేసిన అధికారుల‌ను ఉపేక్షించేది లేద‌ని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌న్మ‌థ‌రావు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జె. శ్యామ‌ల‌రావు, విద్యాశాఖ క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్‌ల‌ను నెల రోజుల పాటు జైలుకు పంపించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. డిసెంబ‌రు 8న స్వ‌యంగా వ‌చ్చి జ్యుడీషియ‌ల్ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాల‌ని ఆదేశించారు. అదేస‌మ‌యంలో ఒక్కొక్క‌రూ రూ.1000 చొప్పున జ‌రిమానా చెల్లించాల‌ని ఆదేశించింది.

Satya

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

2 hours ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

2 hours ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

3 hours ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

5 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

6 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

7 hours ago