తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదు. ఈ విషయం అందరికీతెలిసిందే. అలాగని.. ఏ పార్టీకీ బహిరంగ మద్దతు మాత్రం ప్రకటించలేదు. ఇది కూడా తెలిసిందే. అయితే.. పేరు చెప్పకుండానే.. ఈ టీడీపీ సానుకూల ఓట్ల కోసం.. బీఆర్ ఎస్, కాంగ్రెస్, జనసేన నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చంద్రబాబు అనుకూలంగా బీఆర్ ఎస్ కీలక నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబును ప్రశంసిస్తున్నారు.
ఇది ఒక భాగం. అయితే, క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో(టీడీపీకి బలమైన కార్యవర్గం ఉన్న చోట) నాయకులు తమ పార్టీ కండువాలతో పాటు టీడీపీ కండువాలు కూడా మెడలో వేసుకుని దర్శనమిస్తున్నారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో టీడీపీలో పనిచేసి. తర్వాత పార్టీ మారిన నాయకులు నేరుగా కండువాలు కప్పుకోకపోయినా.. తమ అనుచరులకు కప్పిస్తున్నారు. దీంతో టీడీపీ వీరికి మద్దతు పలికి ఉంటుందనే భ్రమ కల్పిస్తున్నారు.
ఇక, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు నేరుగా టీడీపీ కండువా వేసుకుని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ సానుభూతి పరులు తమకు అనుకూలంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే.. దీనిని టీడీపీ అధిష్టానం తాజాగా ఖండించింది. తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు దీనికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. తాము ఏ పార్టీకీ, ఏ నాయకుడికి మద్దతు ప్రకటించలేదన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏ పార్టీకీ మద్దతుగా ప్రకటన చేయలేదని.. తాము తటస్థంగా ఉన్నామని.. కండువాలు కప్పుకొని వచ్చేస్తున్నవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ సానుభూతి పరులు తమ ఆత్మ ప్రబోధాను సారం ఓటు వేయాలని ఆయన సూచించారు.
This post was last modified on November 28, 2023 3:08 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…