Political News

‘క్రైస్త‌వుడైన జ‌గ‌నే మ‌రోసారి సీఎం కావాలి’

“రాష్ట్రంలో మ‌రోసారి జ‌గ‌నే రావాలి. ఆయ‌న పాల‌న చాలా బాగుంది. క్రైస్త‌వుల పాల‌న‌లో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్ర‌జ‌లు ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారు. కాబ‌ట్టి క్రైస్త‌వుడైన జ‌గ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం. మాజీ మంత్రి క‌న్న‌బాబు వంటి వారు కూడా.. క్రైస్త‌వుడైన జ‌గ‌నే సీఎం కావాల‌ని కోరుకుంటున్నారు” -అని తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన సామాజిక సాధికార బ‌స్సు యాత్ర‌లో మాజీ మంత్రి క‌న్న‌బాబు.. స‌హా ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ద్వారంపూడి మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ పాల‌న‌ను ఆకాశానికి ఎత్తేశారు. అదేస‌మయంలో ప‌నీపాటా లేక కొంద‌రు పాద‌యాత్ర‌లు చేస్తున్నార‌ని.. వారివ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. వారికి వ్య‌క్తిగ‌త ఆరోగ్యం మాత్ర‌మే బాగుప‌డుతుంద‌ని ప‌రోక్షంగా నారా లోకేష్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, కాపులు అంద‌రూ ఐక్యంగా ఉండాల‌ని.. జ‌గ‌న్‌ను మ‌రోసారి గెలిపించుకోవాల‌ని ద్వారంపూడి పిలుపుని చ్చారు. ఎవ‌రో ఏదో చెప్పారు.. ఏదో అన్నారు.. అని మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు. వాళ్లంతా యాక్ట‌ర్లు. ఇప్పుడుంటారు.. రేపు సినిమాల‌కు వెళ్లిపోతారు. రాష్ట్రంలో ఉండేది మ‌నం. మ‌న‌కు జ‌గ‌న్ మంచి పాల‌న అందిస్తు న్నారు. ప్ర‌భువు మాదిరిగా ఆయ‌న శాంతి కోరుకుంటున్నారు. అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని కోరుతున్నారు కాబ‌ట్టి.. క్రైస్త‌వుడైన జ‌గ‌న్‌ను మ‌రోసారి గెలిపించుకోవాల‌ని ద్వారంపూడి వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on November 28, 2023 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago