“రాష్ట్రంలో మరోసారి జగనే రావాలి. ఆయన పాలన చాలా బాగుంది. క్రైస్తవుల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి క్రైస్తవుడైన జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని మనమంతా కోరుకుందాం. మాజీ మంత్రి కన్నబాబు వంటి వారు కూడా.. క్రైస్తవుడైన జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు” -అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్.. ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఈ నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి కన్నబాబు.. సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ద్వారంపూడి మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. అదేసమయంలో పనీపాటా లేక కొందరు పాదయాత్రలు చేస్తున్నారని.. వారివల్ల.. ప్రయోజనం లేదని.. వారికి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే బాగుపడుతుందని పరోక్షంగా నారా లోకేష్పై విమర్శలు గుప్పించారు.
ఇక, కాపులు అందరూ ఐక్యంగా ఉండాలని.. జగన్ను మరోసారి గెలిపించుకోవాలని ద్వారంపూడి పిలుపుని చ్చారు. ఎవరో ఏదో చెప్పారు.. ఏదో అన్నారు.. అని మనసులో పెట్టుకోవద్దు. వాళ్లంతా యాక్టర్లు. ఇప్పుడుంటారు.. రేపు సినిమాలకు వెళ్లిపోతారు. రాష్ట్రంలో ఉండేది మనం. మనకు జగన్ మంచి పాలన అందిస్తు న్నారు. ప్రభువు మాదిరిగా ఆయన శాంతి కోరుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుతున్నారు కాబట్టి.. క్రైస్తవుడైన జగన్ను మరోసారి గెలిపించుకోవాలని ద్వారంపూడి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
This post was last modified on November 28, 2023 3:02 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…