తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చిత్రమైన సంగతులు వెలుగు చూస్తున్నాయి. పదే పదే ఓడిపోతున్నా.. అలుపెరగకుండాపోటీ చేస్తున్నవారు కొందరైతే.. ఒకే అభ్యర్థిపై గత 20 ఇరవై ఏళ్లు తలపడుతున్న నాయకులు మరికొందరు ఉన్నారు. ఇలాంటివారిలో ఇప్పుడు ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నాయకులు మంచిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. వీరిద్దరూ 2004 నుంచి ప్రత్యర్తులుగా చెరో పార్టీ పక్షాన పోటీ చేయడం.. ఒకరు గెలవడం సాధారణంగా మారింది.
ఇక, ఇప్పుడు మరోసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మంచిరెడ్డి, మల్రెడ్డి తలపడుతున్నారు. వీరి పోరు ఆసక్తిగా మారింది. మంచిరెడ్డి రెండుసార్లు టీడీపీ తరఫున, ఒకసారి బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక, మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు మలక్పేట ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి అదే పార్టీ నుంచి ఇబ్రహీంపట్నం బరిలోకి దిగారు.
వాస్తవానికి మంచిరెడ్డి కిషన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మధ్య పోరు 2004 ఎన్నికల్లోనే మలక్పేట నియోజకవర్గంలో మొదలైంది. ఆ ఎన్నికల్లో మంచిరెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగి.. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మారారు. ఇద్దరూ అవే పార్టీల తరఫున పోటీ చేయగా.. అప్పట్లో మంచిరెడ్డి గెలుపొందారు.
ఇక, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం రంగారెడ్డికి కాకుండా శ్యామ మల్లేశ్కు టికెట్ ఇచ్చింది. రంగారెడ్డి కి మహేశ్వరం టికెట్ కేటాయించింది. అయితే ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి సోదరుడు మల్రెడ్డి రాంరెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, మరోసారి మంచిరెడ్డిదే పైచేయి అయింది. రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇక తాజా ఎన్నికల్లో మంచిరెడ్డి మరోసారి బీఆర్ఎస్ నుంచి, మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
This post was last modified on November 28, 2023 6:35 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…