మంత్రులూ.. మీకు కౌంట్ డౌన్ స్టార్టయింది! రోజులు లెక్కపెట్టుకోండి! అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్వరంతో హెచ్చరించారు. తాజాగా ఆయన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ప్రారంభించిన ఈ యాత్రలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను నారాలోకేష్ కలుసుకున్నారు. అనంతరం.. జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో నిర్వహించిన సభలో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబును వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా.. 53 రోజుల పాటు జైల్లో ఉంచారని.. దీని వెనుక వైసీపీ నేతలు వ్యవస్థలను మేనేజ్ చేశారని.. నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తనపై నా సీఐడీ అధికారులు ఆరు కేసులు పెట్టారని.. అయినా.. తాను భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తనపైనా.. పార్టీ అధినేత చంద్రబాబుపైనా పెట్టిన కేసుల్లో ఒక్క ఆధారమూ చూపలేకపోయారన్నారు.
ఏ తప్పూ చేయనందునే మళ్లీ యువగళం ప్రారంభించానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. “స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? నాపై ఆరు కేసులు పెట్టారు.. అయినా వెనక్కి తగ్గం. మంత్రులకు చెబుతున్నా.. మీకు కౌంట్డౌన్ మొదలైంది. నాడు జనసేన అధినేత పవన్కల్యాణ్ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశాం. మాపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. మేం కూడా మీలాగే చేస్తే వైసీపీ నేతలంతా జైలులోనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాదే” అని నారా లోకేష్ హెచ్చరించారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలిచారని నారా లోకేష్ చెప్పారు. బాబును జైలుకు పంపితేయువగళం పాదయాత్ర ఆగుతుందని, తద్వారా పార్టీ కూడా నాశనం అవుతుందని వైసీపీ కుటిల పన్నాగాలు పన్నిందని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా యువగళం ఆగలేదన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరిగిందని.. అనేక మంది దళితులను వేధించి చంపారని నిప్పులు చెరిగారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…