Political News

జ‌న‌సేన నేత‌లను ట్విస్ట్ చేస్తున్న ప‌వ‌న్!

ఏపీలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. వాస్త‌వానికి నిక్క‌చ్చిగా చెప్పాలంటే.. ఈ మిత్ర‌ప‌క్షానికి ఇరు పార్టీల నుంచి స్పంద‌న పెద్ద‌గా రావ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఇప్ప‌టికే.. వేర్వేరుగానే పోటీ ఉంటుంద‌ని.. భావించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకున్నారు. కానీ, ఇంత‌లోనే క‌లిసిపోటీ అనే అంశం తెర‌మీద‌కి రావ‌డంతో నాయ‌కులు డోలాయ‌మానంలో ప‌డ్డారు.

దీంతో ఇరు పార్టీలు క‌లిసి తీసుకున్న స‌మ‌న్వ‌య స‌మావేశాలు.. ఆదిలోనే బెడిసి కొట్టాయి. కొన్ని జిల్లాల్లో ఇరు పార్టీల నాయ‌కులు కూడా.. బాహాబాహీకి దిగితే.. మ‌రికొన్ని చోట్ల అసంతృప్తులు వెలుగుచూశాయి. ఇంకొన్ని చోట్ల ముఖ‌స్తుతితో ప‌నికానిచ్చారు. కానీ.. క్షేత్ర‌స్తాయిలో మాత్రం చేతులు క‌ల‌ప‌లేదు. దీంతో స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిసిపోయాయి. ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన రెండు ప్ర‌క‌ట‌న‌లు నాయ‌కుల‌ను మ‌రింత ట్విస్ట్‌కు గురి చేస్తున్నాయి.

ఒక‌టి.. ప‌దేళ్ల వ‌ర‌కు ఏపీలో మ‌నం మిత్ర‌ప‌క్షంగానే ఉందామ‌ని చెప్ప‌డం.. రెండు.. ప‌దువుల ఆశించ‌వద్దు.. కేవ‌లం వైసీపీని పార‌దోల‌డ‌మే ప‌నిగా క్షేత్ర‌స్తాయిలో యుద్ధం ప్ర‌క‌టించాల‌ని విశాఖ వేదిక‌గా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌లు కూడా.. జ‌న‌సేనలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చేసిన‌ట్టే ఏపీలోనూ చేస్తారా? అనేది నాయ‌కుల సందేహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. క‌నీసం 40 స్థానాల్లో బ‌ల‌మైన జ‌న‌సేన నాయ‌కులు పోటీకి రెడీ అవుతున్నారు.

కానీ.. పొత్తుల్లో భాగంగా ఇన్ని సీట్లు ద‌క్కే చాన్స్ లేదు. పైగా ఇప్పుడు ప‌దేళ్ల పాట మ‌రింతగా వారిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు.. ప‌ద‌వులు ఆశించ‌కుండా ప‌నిచేయాల‌ని చెప్ప‌డం కూడా.. నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఇదేంట‌ని? వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే 10 ఏళ్ల‌కుపైగా ఎద‌రు చూస్తున్నామ‌ని.. జెండాలు మోస్తున్నామ‌ని.. మ‌రో ప‌దేళ్లు వెయిట్ చేయాలా? అనివారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దీనిని ఎదుర్కొనేందుకు త్వ‌ర‌లోనే జ‌న‌సేనాని నియోజ‌క‌వ‌ర్గాల బాట ప‌డతార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

ఆలస్యం చేస్తే అమృతం విషమే

పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…

3 hours ago

వైసీపీకి వచ్చేది తక్కువ… పోయేది ఎక్కువ!

వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు ప‌డిపోయింది. దీనికి కార‌ణాలు ఏంటన్న‌వి అంద‌రికీ తెలిసినా..…

4 hours ago

మూడో పొలిమేర… ఇంకా పెద్దగా?

కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్‌ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…

4 hours ago

బుల్లెట్ రైలుకు `రాజకీయ` రెడ్ సిగ్న‌ల్‌?!

తెలంగాణకు కీల‌క ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీల‌కంగా మార‌నుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్ల‌ను కేంద్ర…

5 hours ago

గ్రీన్ డ్రెస్ లో రాశీ గ్లామర్ మెరుపులు

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…

9 hours ago

ట్రోజన్ హార్స్… జక్కన్న చేతిలో పడుంటే?

క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…

12 hours ago