Political News

జ‌న‌సేన నేత‌లను ట్విస్ట్ చేస్తున్న ప‌వ‌న్!

ఏపీలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. వాస్త‌వానికి నిక్క‌చ్చిగా చెప్పాలంటే.. ఈ మిత్ర‌ప‌క్షానికి ఇరు పార్టీల నుంచి స్పంద‌న పెద్ద‌గా రావ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఇప్ప‌టికే.. వేర్వేరుగానే పోటీ ఉంటుంద‌ని.. భావించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకున్నారు. కానీ, ఇంత‌లోనే క‌లిసిపోటీ అనే అంశం తెర‌మీద‌కి రావ‌డంతో నాయ‌కులు డోలాయ‌మానంలో ప‌డ్డారు.

దీంతో ఇరు పార్టీలు క‌లిసి తీసుకున్న స‌మ‌న్వ‌య స‌మావేశాలు.. ఆదిలోనే బెడిసి కొట్టాయి. కొన్ని జిల్లాల్లో ఇరు పార్టీల నాయ‌కులు కూడా.. బాహాబాహీకి దిగితే.. మ‌రికొన్ని చోట్ల అసంతృప్తులు వెలుగుచూశాయి. ఇంకొన్ని చోట్ల ముఖ‌స్తుతితో ప‌నికానిచ్చారు. కానీ.. క్షేత్ర‌స్తాయిలో మాత్రం చేతులు క‌ల‌ప‌లేదు. దీంతో స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిసిపోయాయి. ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన రెండు ప్ర‌క‌ట‌న‌లు నాయ‌కుల‌ను మ‌రింత ట్విస్ట్‌కు గురి చేస్తున్నాయి.

ఒక‌టి.. ప‌దేళ్ల వ‌ర‌కు ఏపీలో మ‌నం మిత్ర‌ప‌క్షంగానే ఉందామ‌ని చెప్ప‌డం.. రెండు.. ప‌దువుల ఆశించ‌వద్దు.. కేవ‌లం వైసీపీని పార‌దోల‌డ‌మే ప‌నిగా క్షేత్ర‌స్తాయిలో యుద్ధం ప్ర‌క‌టించాల‌ని విశాఖ వేదిక‌గా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌లు కూడా.. జ‌న‌సేనలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చేసిన‌ట్టే ఏపీలోనూ చేస్తారా? అనేది నాయ‌కుల సందేహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. క‌నీసం 40 స్థానాల్లో బ‌ల‌మైన జ‌న‌సేన నాయ‌కులు పోటీకి రెడీ అవుతున్నారు.

కానీ.. పొత్తుల్లో భాగంగా ఇన్ని సీట్లు ద‌క్కే చాన్స్ లేదు. పైగా ఇప్పుడు ప‌దేళ్ల పాట మ‌రింతగా వారిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు.. ప‌ద‌వులు ఆశించ‌కుండా ప‌నిచేయాల‌ని చెప్ప‌డం కూడా.. నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఇదేంట‌ని? వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే 10 ఏళ్ల‌కుపైగా ఎద‌రు చూస్తున్నామ‌ని.. జెండాలు మోస్తున్నామ‌ని.. మ‌రో ప‌దేళ్లు వెయిట్ చేయాలా? అనివారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దీనిని ఎదుర్కొనేందుకు త్వ‌ర‌లోనే జ‌న‌సేనాని నియోజ‌క‌వ‌ర్గాల బాట ప‌డతార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 27, 2023 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

38 minutes ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

2 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

2 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

3 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago