Political News

జ‌న‌సేన నేత‌లను ట్విస్ట్ చేస్తున్న ప‌వ‌న్!

ఏపీలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. వాస్త‌వానికి నిక్క‌చ్చిగా చెప్పాలంటే.. ఈ మిత్ర‌ప‌క్షానికి ఇరు పార్టీల నుంచి స్పంద‌న పెద్ద‌గా రావ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఇప్ప‌టికే.. వేర్వేరుగానే పోటీ ఉంటుంద‌ని.. భావించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకున్నారు. కానీ, ఇంత‌లోనే క‌లిసిపోటీ అనే అంశం తెర‌మీద‌కి రావ‌డంతో నాయ‌కులు డోలాయ‌మానంలో ప‌డ్డారు.

దీంతో ఇరు పార్టీలు క‌లిసి తీసుకున్న స‌మ‌న్వ‌య స‌మావేశాలు.. ఆదిలోనే బెడిసి కొట్టాయి. కొన్ని జిల్లాల్లో ఇరు పార్టీల నాయ‌కులు కూడా.. బాహాబాహీకి దిగితే.. మ‌రికొన్ని చోట్ల అసంతృప్తులు వెలుగుచూశాయి. ఇంకొన్ని చోట్ల ముఖ‌స్తుతితో ప‌నికానిచ్చారు. కానీ.. క్షేత్ర‌స్తాయిలో మాత్రం చేతులు క‌ల‌ప‌లేదు. దీంతో స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిసిపోయాయి. ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన రెండు ప్ర‌క‌ట‌న‌లు నాయ‌కుల‌ను మ‌రింత ట్విస్ట్‌కు గురి చేస్తున్నాయి.

ఒక‌టి.. ప‌దేళ్ల వ‌ర‌కు ఏపీలో మ‌నం మిత్ర‌ప‌క్షంగానే ఉందామ‌ని చెప్ప‌డం.. రెండు.. ప‌దువుల ఆశించ‌వద్దు.. కేవ‌లం వైసీపీని పార‌దోల‌డ‌మే ప‌నిగా క్షేత్ర‌స్తాయిలో యుద్ధం ప్ర‌క‌టించాల‌ని విశాఖ వేదిక‌గా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌లు కూడా.. జ‌న‌సేనలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో చేసిన‌ట్టే ఏపీలోనూ చేస్తారా? అనేది నాయ‌కుల సందేహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. క‌నీసం 40 స్థానాల్లో బ‌ల‌మైన జ‌న‌సేన నాయ‌కులు పోటీకి రెడీ అవుతున్నారు.

కానీ.. పొత్తుల్లో భాగంగా ఇన్ని సీట్లు ద‌క్కే చాన్స్ లేదు. పైగా ఇప్పుడు ప‌దేళ్ల పాట మ‌రింతగా వారిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు.. ప‌ద‌వులు ఆశించ‌కుండా ప‌నిచేయాల‌ని చెప్ప‌డం కూడా.. నాయ‌కుల‌కు రుచించ‌డం లేదు. ఇదేంట‌ని? వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే 10 ఏళ్ల‌కుపైగా ఎద‌రు చూస్తున్నామ‌ని.. జెండాలు మోస్తున్నామ‌ని.. మ‌రో ప‌దేళ్లు వెయిట్ చేయాలా? అనివారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దీనిని ఎదుర్కొనేందుకు త్వ‌ర‌లోనే జ‌న‌సేనాని నియోజ‌క‌వ‌ర్గాల బాట ప‌డతార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 27, 2023 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago