Political News

తెలంగాణ‌లో పోలింగ్.. ఏపీలో చ‌లి జ్వ‌రం…!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతుంటే.. ఏపీలో మాత్రం చ‌లీ జ్వ‌రం ప‌ట్టుకున్న విధంగా ప‌రిస్థితి మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డ ఎన్నిక‌ల‌ను ఏపీకి చెందిన కీల‌క పార్టీలు చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి. తెలంగాణ‌లో పోలింగ్ ప్ర‌క్రియ‌ను, ప్ర‌చారాన్ని కూడా. ఏపీ పార్టీలు అంచ‌నాలు చేస్తున్నాయి. అదేంటి.. ఎందుకు అనుకుంటున్నారా? తెలంగాణ‌లో గెలిచే పార్టీ వ‌ల్ల వ‌చ్చే ఏడాది జ‌రిగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డ‌మే!

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీని ప‌క్క‌కు పెట్టి.. తాము అధికారంలోకి రావాల‌ని టీడీపీ-జ‌న‌సేన భావిస్తున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2024ను జార‌విడుచుకోరాద‌ని భావిస్తున్నాయి. ఇక‌, వైసీపీ కూడా.. ఒక్క‌చాన్స్ స్థానంలో రెండో చాన్స్ కోసం త‌పిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధికారం నిల‌బెట్టుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ ఇక్క‌డ విజ‌యం దక్కించుకోవాల‌న్నా.. తెలంగాణ‌లో ఏర్ప‌డే ప్ర‌భుత్వం కీల‌కం.

తెలంగాణ‌లో ఏర్ప‌డే ప్ర‌భుత్వం ఏపీ రాజ‌కీయాల‌ను ఒకింత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. స‌రిహ‌ద్దు జిల్లాలు, రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని సెటిల‌ర్లు, వారి బంధువ‌ల ఓటు బ్యాంకును కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉందని అంటున్నారు. అందుకే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీపై ప్ర‌భావం చూపుతుంద‌ని లెక్కలు వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌స్తే.. ఏపీలో జ‌గ‌న్‌కు సాయం చేసే అవ‌కాశం క‌చ్చితంగా ఉంద‌ని అంటున్నారు.

ఒక‌వేళ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ఉభ‌య కుశ‌లోప‌రిగా.. ఏపీలో టీడీపీ-జ‌నసేన‌ ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. అంతేకాదు.. ఏపీలో గెలిచే పార్టీకి తెలంగాణ స‌రిహ‌ద్దు జిల్లాల ఓటు బ్యాంకు కీల‌క‌మైన నేప‌థ్యంలో తెలంగాణలో త‌మ‌కు అనుకూల ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌నేది ఏపీలోని అధికార , ప్ర‌తిప‌క్ష పార్టీల వాద‌న‌. అయితే.. ఎవ‌రూ పైకి ఏమీ అన‌డం లేదు. కానీ.. అంతా మౌనంగా.. తెర‌చాటున స‌హ‌కారం.. న‌డిచిపోతుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు.. ఏపీలో చ‌లి జ్వ‌రాన్ని తెప్పిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 27, 2023 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

57 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago