అటు ప్రచార సభలు, సమావేశాలు, రోడ్ షోలు, మీడియాతో ఇంటర్వ్యూలు, విలేకర్ల సమావేశాలు ఇలా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎక్కడ చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఒక్కడే సైన్యంగా మారి రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను భుజాలపై మోసుకుంటూ సాగిపోతున్నారు. పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం దగ్గరి నుంచి తెలంగాణలో పార్టీని ఆయన పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయంటే అందుకు రేవంత్ కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో పార్టీకి లభిస్తున్న ఆదరణను ఓట్లుగా మార్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రోజుకు అయిదారు సభలు, సమావేశాల్లో పాల్గొంటు ఒక్కడే పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే చెప్పాలి.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్, కోమటి రెడ్డి సోదరులు, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లాంటి నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని చెప్పాలి. తమ విజయం కోసం ఈ కాంగ్రెస్ నాయకులు పాటుపడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి ఢిల్లీ నేతలు సభలు, సమావేశాలు పెడితే మాత్రమే ఈ నాయకులు కనిపిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇతర సమయాల్లో కేవలం తమ నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతున్నారు. కానీ రేవంత్ మాత్రం సుడిగాలిలా రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్నారు. పదునైన మాటలతో కేసీఆర్ ను ఇరకాటంలో పెడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రేవంత్ కు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అనే స్పష్టమైన సమాచారం అందిందని తెలిసింది. దీంతో రేవంత్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నారని చెబుతున్నారు.
This post was last modified on November 27, 2023 10:55 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…