అటు ప్రచార సభలు, సమావేశాలు, రోడ్ షోలు, మీడియాతో ఇంటర్వ్యూలు, విలేకర్ల సమావేశాలు ఇలా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎక్కడ చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఒక్కడే సైన్యంగా మారి రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను భుజాలపై మోసుకుంటూ సాగిపోతున్నారు. పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం దగ్గరి నుంచి తెలంగాణలో పార్టీని ఆయన పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయంటే అందుకు రేవంత్ కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో పార్టీకి లభిస్తున్న ఆదరణను ఓట్లుగా మార్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రోజుకు అయిదారు సభలు, సమావేశాల్లో పాల్గొంటు ఒక్కడే పార్టీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే చెప్పాలి.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్, కోమటి రెడ్డి సోదరులు, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లాంటి నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని చెప్పాలి. తమ విజయం కోసం ఈ కాంగ్రెస్ నాయకులు పాటుపడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి ఢిల్లీ నేతలు సభలు, సమావేశాలు పెడితే మాత్రమే ఈ నాయకులు కనిపిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇతర సమయాల్లో కేవలం తమ నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతున్నారు. కానీ రేవంత్ మాత్రం సుడిగాలిలా రాష్ట్రం మొత్తం తిరిగేస్తున్నారు. పదునైన మాటలతో కేసీఆర్ ను ఇరకాటంలో పెడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రేవంత్ కు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అనే స్పష్టమైన సమాచారం అందిందని తెలిసింది. దీంతో రేవంత్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నారని చెబుతున్నారు.
This post was last modified on November 27, 2023 10:55 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…