Political News

కాంగ్రెస్ డేరింగ్ స్టెప్

పోలింగుకు వారం రోజులముందు పార్టీలోని కొందరు నేతలను బహిష్కరించటం అంటే ఊహించలేం. అధికారికంగా పోటీచేస్తున్న అభ్యర్ధులకు సహకరించటంలేదని తెలిసినా మామూలుగా ఏ పార్టీ కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే పార్టీ నష్టంచేస్తున్న నేతలపై యాక్షన్ తీసుకుంటే ఇంకెంత కంపుచేస్తారో అనే భయం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి భయాలు పెట్టుకోకుండా వెంటనే కొందరిపై బహష్కరణ అస్త్రాన్ని ప్రయోగించేసింది. దాంతో మిగిలిన జిల్లాల్లోని కొందరు అసంతృప్తనేతలు దారికి వస్తున్నట్లు సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు మనస్పూర్తిగా సహకరిస్తున్నది ఎవరు ? వ్యతిరేకంగా చేస్తున్నది ఎవరనే విషయాన్ని పార్టీ అనేకమార్గాల్లో రిపోర్టు తెప్పించుకుంటోంది. ఇలాంటి రిపోర్టులు తెప్పించుకుని నార్ధారణ చేసుకుని పరిస్ధితులను విశ్లేషించేందుకే పార్టీ ఆపీసులో ప్రత్యేకించి వార్ రూమ్ అని ఏర్పాటుచేసింది. ఈ రూములో 24 గంటలూ ఫిఫ్టు సిస్టమ్ లో దాదాపు 15 బృందాలు పనిచేస్తునే ఉన్నాయి. వీటిని పర్యవేక్షించటానికి వ్యూహకర్తలు కూడా అందుబాటులోనే ఉన్నారు.

ఇదే విషయమై నేతలపై యాక్షన్ తీసుకునే ఉద్దేశ్యంతోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఆయన నిరంతరం రిపోర్టుల విశ్లేషణలోనే ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అభ్యర్ధుల గెలుపుకు మరికొందరు నేతలు ఏమాత్రం సహకరించటంలేదని రిపోర్టులు అందాయి. గెలుపుకు సహకరించకపోగా ఓటమికి ప్రత్యర్ధులతో చేతులు కలిపినట్లు సమాచారం అందింది. దాన్ని పార్టీలోని ఇంటర్నల్ వర్గాల ద్వారా వార్ రూమ్ నుండి అవసరమైన సమాచారాన్ని క్రాస్ చెక్ చేయించుకున్నారు.

తమకు అందిన సమాచారం నిజమే అని నిర్ధారించుకోగానే కొందరు సీనియర్లను బహిష్కరించేశారు. ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న సంజీవరెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, లోకల్ లీడర్లు భార్గవ్ దేశ్ పాండే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతపై బహిష్కరణ వేటు పడింది. పోలింగ్ దగ్గరలోనే ఉన్నా రెండో ఆలోచన లేకుండా వీళ్ళని అధిష్టానం బహిష్కరించటంతో ముందు షాక్ తిన్నారు. తర్వాత అధిష్టానం మంచిపనే చేసిందని హ్యాపీ ఫీలయ్యారు. ఈ చర్యతో మిగిలిన జిల్లాల్లోని నేతలు దారిలోకి వచ్చినట్లు సమాచారం.

This post was last modified on November 26, 2023 12:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago