Political News

న‌న్ను తిడితే.. కేసీఆర్ పార్టీ చేసుకుంటారు: మోడీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం మహేశ్వరం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బీజేపీ ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్ ఎస్ విముక్త తెలంగా ణ ల‌క్ష్యంగా ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధాని చెప్పారు. బీఆర్ ఎస్‌ను త‌రిమి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు ఓటేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అదేస‌మ‌యంలో కేసీఆర్‌పైనా వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.. న‌న్ను తిడితే.. కేసీఆర్ సంతోషిస్తార‌ని, పార్టీ చేసుకుంటార‌ని అన్నారు.

తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి తెలంగాణకు విముక్తి కావాలని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దళితులకు చేసిందేమీ లేదని మోడీ దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌ట్టం క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందన్న మోడీ… బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ దళితులకు చేసిందేమీ లేదన్నారు.

“బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కడే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నా యి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ద్రోహ పార్టీలు, సమాజ విరోధులు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్‌కు వేసే ప్రతీ ఓటుతో బీఆర్‌ఎస్‌కు లబ్ధి. బీఆర్ఎస్‌ను హుజూరాబాద్‌, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారు. తెలంగాణలో అన్ని వర్గాల లక్ష్యాలను నెరవేర్చడమే నా లక్ష్యం. మోడీని తిట్టడం అంటే కేసీఆర్‌కు ఇష్టం. ఆయ‌న పార్టీ చేసుకుంటారు” అని ప్రధాని మోడీ అన్నారు. కాగా, ఈ స‌భ‌కు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లి రావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 25, 2023 11:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

37 minutes ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

2 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

2 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

3 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago