తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్ ఎస్ విముక్త తెలంగా ణ లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. బీఆర్ ఎస్ను తరిమి కొట్టడమే లక్ష్యంగా ఇక్కడి ప్రజలు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అదేసమయంలో కేసీఆర్పైనా వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.. నన్ను తిడితే.. కేసీఆర్ సంతోషిస్తారని, పార్టీ చేసుకుంటారని అన్నారు.
తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కావాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ దళితులకు చేసిందేమీ లేదని మోడీ దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ పాలనపై నమ్మకం పెరుగుతోందన్న మోడీ… బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దళితులకు చేసిందేమీ లేదన్నారు.
“బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కడే. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నా యి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్రోహ పార్టీలు, సమాజ విరోధులు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్కు వేసే ప్రతీ ఓటుతో బీఆర్ఎస్కు లబ్ధి. బీఆర్ఎస్ను హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారు. తెలంగాణలో అన్ని వర్గాల లక్ష్యాలను నెరవేర్చడమే నా లక్ష్యం. మోడీని తిట్టడం అంటే కేసీఆర్కు ఇష్టం. ఆయన పార్టీ చేసుకుంటారు” అని ప్రధాని మోడీ అన్నారు. కాగా, ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం గమనార్హం.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…