రాజకీయాలు రాజకీయాలే! అవి ఎవరివైనా కావొచ్చు. తెలగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారంలో జరుగుతున్న వ్యూహాలు.. సీఎం కేసీఆర్కు టెస్ట్ మ్యాచ్గా మారాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి డోలాయమానంగా ఉందనే టాక్ సర్వేల ద్వారా వినిపిస్తోంది. అలాగని .. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా.. పాజిటివ్ టాక్ లేదట.
అంతేకాదు.. ఆయా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి కొన్నిసూచనలు వస్తున్నాయి. మీరు బీఆర్ ఎస్లో ఉంటే గెలిపించే వాళ్లం! అంటూ.. ప్రజల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అలెర్టయిన కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు.. అయితే.. ఓకే.. కాంగ్రెస్లో గెలిపించండి.. ఆవెంటనే పార్టీ మారిపోతా! అని బిగ్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ ఎస్ నాయకులకు ఇబ్బంది ఏర్పడింది. బీఆర్ ఎస్ నేతల ఓటు బ్యాంకు ఇలాంటి కాంగ్రెస్ నేతలకు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీనిని పసిగట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. తర్వాత బీఆర్ ఎస్ లోకి వస్తామంటే.. ఎట్టి పరిస్థితిలోనూ వారిని చేర్చుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఇలా.. తాము కాంగ్రెస్లో గెలిచినా బీఆర్ ఎస్లో చేరతామని.. చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మకుర్రి! అంటూ ఆయన ప్రకటన చేశారు.
“ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొత్త ప్రచారం షురూ చేసిన్రు. ఆ పార్టీ తరఫున ఎలానూ గెలవలేమని.. గుర్తించారు. అందుకే బీఆర్ ఎస్ పేరును వాడేసుకుంటున్నారు. తాము కాంగ్రెస్లో గెలిచినా.. రేపు బీఆర్ ఎస్లోనే చేరతామని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. ఈ మాటలు నమ్మకుర్రి. కాంగ్రెస్లో గెలిచిన వారికి.. బీఆర్ ఎస్లో కండువా కప్పేదేలేదు” అని కేసీఆర్ తేల్చి చెప్పారు. మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 25, 2023 4:33 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…