రాజకీయాలు రాజకీయాలే! అవి ఎవరివైనా కావొచ్చు. తెలగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారంలో జరుగుతున్న వ్యూహాలు.. సీఎం కేసీఆర్కు టెస్ట్ మ్యాచ్గా మారాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి డోలాయమానంగా ఉందనే టాక్ సర్వేల ద్వారా వినిపిస్తోంది. అలాగని .. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా.. పాజిటివ్ టాక్ లేదట.
అంతేకాదు.. ఆయా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి కొన్నిసూచనలు వస్తున్నాయి. మీరు బీఆర్ ఎస్లో ఉంటే గెలిపించే వాళ్లం! అంటూ.. ప్రజల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అలెర్టయిన కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు.. అయితే.. ఓకే.. కాంగ్రెస్లో గెలిపించండి.. ఆవెంటనే పార్టీ మారిపోతా! అని బిగ్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ ఎస్ నాయకులకు ఇబ్బంది ఏర్పడింది. బీఆర్ ఎస్ నేతల ఓటు బ్యాంకు ఇలాంటి కాంగ్రెస్ నేతలకు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీనిని పసిగట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. తర్వాత బీఆర్ ఎస్ లోకి వస్తామంటే.. ఎట్టి పరిస్థితిలోనూ వారిని చేర్చుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఇలా.. తాము కాంగ్రెస్లో గెలిచినా బీఆర్ ఎస్లో చేరతామని.. చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మకుర్రి! అంటూ ఆయన ప్రకటన చేశారు.
“ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొత్త ప్రచారం షురూ చేసిన్రు. ఆ పార్టీ తరఫున ఎలానూ గెలవలేమని.. గుర్తించారు. అందుకే బీఆర్ ఎస్ పేరును వాడేసుకుంటున్నారు. తాము కాంగ్రెస్లో గెలిచినా.. రేపు బీఆర్ ఎస్లోనే చేరతామని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. ఈ మాటలు నమ్మకుర్రి. కాంగ్రెస్లో గెలిచిన వారికి.. బీఆర్ ఎస్లో కండువా కప్పేదేలేదు” అని కేసీఆర్ తేల్చి చెప్పారు. మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 25, 2023 4:33 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…