రాజకీయాలు రాజకీయాలే! అవి ఎవరివైనా కావొచ్చు. తెలగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారంలో జరుగుతున్న వ్యూహాలు.. సీఎం కేసీఆర్కు టెస్ట్ మ్యాచ్గా మారాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి డోలాయమానంగా ఉందనే టాక్ సర్వేల ద్వారా వినిపిస్తోంది. అలాగని .. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా.. పాజిటివ్ టాక్ లేదట.
అంతేకాదు.. ఆయా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి కొన్నిసూచనలు వస్తున్నాయి. మీరు బీఆర్ ఎస్లో ఉంటే గెలిపించే వాళ్లం! అంటూ.. ప్రజల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అలెర్టయిన కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు.. అయితే.. ఓకే.. కాంగ్రెస్లో గెలిపించండి.. ఆవెంటనే పార్టీ మారిపోతా! అని బిగ్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ ఎస్ నాయకులకు ఇబ్బంది ఏర్పడింది. బీఆర్ ఎస్ నేతల ఓటు బ్యాంకు ఇలాంటి కాంగ్రెస్ నేతలకు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది.
దీనిని పసిగట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. తర్వాత బీఆర్ ఎస్ లోకి వస్తామంటే.. ఎట్టి పరిస్థితిలోనూ వారిని చేర్చుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఇలా.. తాము కాంగ్రెస్లో గెలిచినా బీఆర్ ఎస్లో చేరతామని.. చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మకుర్రి! అంటూ ఆయన ప్రకటన చేశారు.
“ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొత్త ప్రచారం షురూ చేసిన్రు. ఆ పార్టీ తరఫున ఎలానూ గెలవలేమని.. గుర్తించారు. అందుకే బీఆర్ ఎస్ పేరును వాడేసుకుంటున్నారు. తాము కాంగ్రెస్లో గెలిచినా.. రేపు బీఆర్ ఎస్లోనే చేరతామని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. ఈ మాటలు నమ్మకుర్రి. కాంగ్రెస్లో గెలిచిన వారికి.. బీఆర్ ఎస్లో కండువా కప్పేదేలేదు” అని కేసీఆర్ తేల్చి చెప్పారు. మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చూడాలి.
నిన్న ది ప్యారడైజ్ నుంచి రాఘవ్ జుయెల్ పోషించిన విక్రమ్ మాలిక్ ఫస్ట్ లుక్ ని టీజర్ రూపంలో టీమ్…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…