Political News

క‌దులుతున్న‌నారా కుటుంబం.. ప‌క్కా ప్లాన్ ఇదే!

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ.. దీనికి సంబంధించి ప‌క్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎన్నిఅవాంత‌రాలు వ‌చ్చినా.. ఇబ్బందులు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డ‌మే ధ్యేయంగా ప్లాన్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాద‌యాత్ర‌ను పునః ప్రారంభించ‌నున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులో నిలిపివేసిన పాద‌యాత్ర‌ను అక్క‌డ నుంచి ఆయ‌న తిరిగి ప్రారంభించ‌నున్నారు. ఈ యాత్ర వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి రెండో వారం వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు హైకోర్టు నుంచి కేసుల విష‌యంలో వెసులు బాటు వ‌చ్చింది. ఆయ‌న రాజ‌కీయ పార్టీకి అధినేత కాబ‌ట్టి.. ఆయ‌న‌ను ప్ర‌సంగాలు, రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌కుండా అడ్డుకోలేమ‌ని హైకోర్టు స్ప‌ష్టీక‌రించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా.. వ‌చ్చే నెల తొలి వారం నుంచి తిరిగి ప్ర‌జాక్షేత్రంలోకి అడుగు పెట్ట‌నున్నారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు.

చంద్ర‌బాబు అరెస్టుతో బాధ చెంది మృతి చెందిన వారి కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శించారు. నారా కుటుంబం నుంచి మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి రాలేదు కానీ.. ఇటీవ‌ల త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితిలో భువనేశ్వ‌రి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆమె చేసిన ప్ర‌సంగాల‌కు, ఆమె యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి ముఖ్యంగా మ‌హిళ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. దీనిని కొన‌సాగించాలా? వ‌ద్దా అనే సందేహాల‌కు తాజాగా తెర‌ప‌డింది. ఇక నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని నిర్ణ‌యించారు.

నారా భువ‌నేశ్వ‌రి పర్యటనలపై కూడా రూట్‌ మ్యాప్‌ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేశ్‌ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తాజిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు నారా కుటుంబం మొత్తం ప్ర‌జ‌ల్లోనే ఉండేలా ప‌క్కా ప్లాన్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 25, 2023 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

1 hour ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

5 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

6 hours ago