2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ.. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎన్నిఅవాంతరాలు వచ్చినా.. ఇబ్బందులు వచ్చినా.. ప్రజల్లోకి వెళ్లడమే ధ్యేయంగా ప్లాన్ చేసుకోవడం గమనార్హం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిలిపివేసిన పాదయాత్రను అక్కడ నుంచి ఆయన తిరిగి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి రెండో వారం వరకు జరగనుంది.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు నుంచి కేసుల విషయంలో వెసులు బాటు వచ్చింది. ఆయన రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి.. ఆయనను ప్రసంగాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టీకరించిన నేపథ్యంలో చంద్రబాబు కూడా.. వచ్చే నెల తొలి వారం నుంచి తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. అదేసమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు.
చంద్రబాబు అరెస్టుతో బాధ చెంది మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. నారా కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రాలేదు కానీ.. ఇటీవల తప్పని సరి పరిస్థితిలో భువనేశ్వరి బయటకు వచ్చారు. ఆమె చేసిన ప్రసంగాలకు, ఆమె యాత్రలకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన లభించింది. దీనిని కొనసాగించాలా? వద్దా అనే సందేహాలకు తాజాగా తెరపడింది. ఇక నుంచి వచ్చే ఎన్నికల వరకు కూడా.. నారా భువనేశ్వరి ప్రజల్లో ఉండాలని నిర్ణయించారు.
నారా భువనేశ్వరి పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేశ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తాజిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. మొత్తంగా ఎన్నికలకు ముందు నారా కుటుంబం మొత్తం ప్రజల్లోనే ఉండేలా పక్కా ప్లాన్ చేసుకోవడం గమనార్హం.
This post was last modified on November 25, 2023 2:32 pm
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్…
కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని…
మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. కేవలం నాలుగు రోజులకే…
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…