2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ.. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎన్నిఅవాంతరాలు వచ్చినా.. ఇబ్బందులు వచ్చినా.. ప్రజల్లోకి వెళ్లడమే ధ్యేయంగా ప్లాన్ చేసుకోవడం గమనార్హం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిలిపివేసిన పాదయాత్రను అక్కడ నుంచి ఆయన తిరిగి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి రెండో వారం వరకు జరగనుంది.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు నుంచి కేసుల విషయంలో వెసులు బాటు వచ్చింది. ఆయన రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి.. ఆయనను ప్రసంగాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టీకరించిన నేపథ్యంలో చంద్రబాబు కూడా.. వచ్చే నెల తొలి వారం నుంచి తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. అదేసమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు.
చంద్రబాబు అరెస్టుతో బాధ చెంది మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. నారా కుటుంబం నుంచి మహిళలు రాజకీయాల్లోకి రాలేదు కానీ.. ఇటీవల తప్పని సరి పరిస్థితిలో భువనేశ్వరి బయటకు వచ్చారు. ఆమె చేసిన ప్రసంగాలకు, ఆమె యాత్రలకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన లభించింది. దీనిని కొనసాగించాలా? వద్దా అనే సందేహాలకు తాజాగా తెరపడింది. ఇక నుంచి వచ్చే ఎన్నికల వరకు కూడా.. నారా భువనేశ్వరి ప్రజల్లో ఉండాలని నిర్ణయించారు.
నారా భువనేశ్వరి పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేశ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తాజిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. మొత్తంగా ఎన్నికలకు ముందు నారా కుటుంబం మొత్తం ప్రజల్లోనే ఉండేలా పక్కా ప్లాన్ చేసుకోవడం గమనార్హం.
This post was last modified on November 25, 2023 2:32 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…