తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఇలా ఇంకోసారి మాట్లాడితే.. చర్యలు తప్పవు. అవసరమైతే.. పార్టీని సైతం రద్దు చేస్తాం! అంటూ.. ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం పొద్దు పోయాక.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రగతి భవన్కు లేఖ అందింది. ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పలు విషయాలను ప్రస్తావించింది.
“మీరు సీనియర్ రాజకీయ నాయకులు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో తెలియదా? మీకు ఎవరైనా వచ్చి చెప్పాలా?” అంటూ.. కేసీఆర్ను ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారంలో హుందాగా వ్యవహరించాలని సూచించింది. ప్రతిపక్షాలను జంతువులతో పోల్చడం.. దూషణలకు దిగడం ప్రజాస్వామ్య రాజకీయాల్లో సరికాదని తేల్చి చెప్పింది. అంతేకాదు. ఇకపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. రోజుకు రెండు నుంచి నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. ఇలా.. అక్టోబరు 30న బాన్సువాడలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సహా ఆ పార్టీ నాయకుల పై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ నాయకులను కుక్కలతో పోలుస్తూ.. విమర్శలు చేశారు. వారిని దగాకోరులంటూ మండిపడ్డారు. ప్రజలు వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రికార్డులతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం .. క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీ ద్వారా.. వివరాలు తెప్పించుకుని పరిశీలించింది. ఈ క్రమంలోనే కేసీఆర్ను హెచ్చరిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది.
This post was last modified on November 25, 2023 11:26 am
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…