Political News

ఇంకోసారి ఇలా మాట్లాడితే పార్టీనే ర‌ద్దు చేస్తాం: ఈసీ ఫైర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిప్పులు చెరిగింది. ఇలా ఇంకోసారి మాట్లాడితే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వు. అవ‌స‌ర‌మైతే.. పార్టీని సైతం ర‌ద్దు చేస్తాం! అంటూ.. ఆగ్ర హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం పొద్దు పోయాక‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు లేఖ అందింది. ఈ లేఖ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించింది.

“మీరు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ఎలా చేయాలో తెలియ‌దా? మీకు ఎవ‌రైనా వ‌చ్చి చెప్పాలా?” అంటూ.. కేసీఆర్‌ను ఎన్నిక‌ల సంఘం ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. ప్ర‌తిప‌క్షాల‌ను జంతువుల‌తో పోల్చ‌డం.. దూష‌ణ‌ల‌కు దిగ‌డం ప్ర‌జాస్వామ్య రాజ‌కీయాల్లో స‌రికాద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు. ఇక‌పై ఎలాంటి ఫిర్యాదు వ‌చ్చినా.. తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించింది.

ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. రోజుకు రెండు నుంచి నాలుగు జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల‌పై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. ఇలా.. అక్టోబ‌రు 30న బాన్సువాడ‌లో బీఆర్ఎస్ నాయ‌కులు నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ స‌హా ఆ పార్టీ నాయ‌కుల పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్ నాయ‌కుల‌ను కుక్క‌ల‌తో పోలుస్తూ.. విమ‌ర్శ‌లు చేశారు. వారిని ద‌గాకోరులంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు వారిని త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ఈ వ్యాఖ్య‌లు చేశారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ రికార్డుల‌తో స‌హా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నిక‌ల సంఘం .. క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్, ఎస్పీ ద్వారా.. వివ‌రాలు తెప్పించుకుని ప‌రిశీలించింది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌ను హెచ్చ‌రిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది.

This post was last modified on November 25, 2023 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

1 hour ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

2 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

3 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

4 hours ago

థియేటర్ VS ఓటిటి – గ్యాప్ నిజంగా తగ్గించగలరా

థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago