కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుతోపాటు ఇసుక కేసులలో చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ రెండు కేసులలో చంద్రబాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలు, నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఐఆర్ఆర్ కేసును ఈ నెల 29న, ఇసుక కేసును ఈ నెల 30న విచారణ జరుపుతామని హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు, మద్యం టెండర్ల కేసులో కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. వాస్తవానికి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు గురువారం సాయంత్రంనాటికి పూర్తయ్యాయి. దీంతో, శుక్రవారం నాడు ఈ రెండు కేసుల్లో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది.
అయితే, వేరే కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐఆర్ఆర్ కేసు 29కి, ఇసుక కేసును 30 కి కోర్టు వాయిదా వేసింది. ఏది ఏమైనా చంద్రబాబుకు సంబంధించి ఈ మూడు కేసులలో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 24, 2023 3:04 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…