కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుతోపాటు ఇసుక కేసులలో చంద్రబాబుకు తాజాగా ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ రెండు కేసులలో చంద్రబాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలు, నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఐఆర్ఆర్ కేసును ఈ నెల 29న, ఇసుక కేసును ఈ నెల 30న విచారణ జరుపుతామని హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు, మద్యం టెండర్ల కేసులో కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. వాస్తవానికి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు గురువారం సాయంత్రంనాటికి పూర్తయ్యాయి. దీంతో, శుక్రవారం నాడు ఈ రెండు కేసుల్లో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సి ఉంది.
అయితే, వేరే కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐఆర్ఆర్ కేసు 29కి, ఇసుక కేసును 30 కి కోర్టు వాయిదా వేసింది. ఏది ఏమైనా చంద్రబాబుకు సంబంధించి ఈ మూడు కేసులలో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 24, 2023 3:04 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…