Political News

విరాళాల‌ రాబ‌డిలో వైసీపీ ఫ‌స్ట్‌.. టీడీపీ సెకండ్.. జ‌న‌సేన లాస్ట్‌!

రాజ‌కీయ పార్టీలు సేక‌రించే విరాళాల్లో ఏపీ అధికార పార్టీ వైసీపీ ముందుంది. ఏకంగా వైసీపీకి రూ.68 కోట్లు విరాళాల రూపంలో ఈ పార్టీకి అందాయి. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కేవ‌లం 11.92 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే విరాళాలుగా అందాయి. ఈ వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా వివ‌రించింది.

ఎవ‌రెవ‌రు ఎక్క‌డ‌నుంచి?

2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి అందిన విరాళాలన్నీ గుప్త నిధులేన‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చింది. ఇచ్చిన వారెవరో.. ఎంతెంత ఇచ్చారో తెలియ‌దు. అయితే.. ఎల‌క్టోర‌ల్ బాండ్ల నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు వీరిని ప్ర‌శ్నించ‌లేర‌ని తెలిపింది. గ‌తంలో బీజేపీకి కూడా ఇలానే 520 కోట్ల రూపాయ‌లు విరాళాలుగా రాగా.. కాంగ్రెస్ పార్టీకి 132 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను ప్ర‌తి సంవ‌త్స‌రం ఎన్నిక‌ల సంఘానికి సమ‌ర్పించాల్సి ఉంది.

ఈ క్ర‌మంలో గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఆయా పార్టీలు త‌మ‌కు వ‌చ్చిన విరాళాల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఇచ్చాయి. ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా వైసీపీకి రూ.52 కోట్లు అందాయి. ప్రుడెంట్‌ ట్రస్ట్‌ పేరుతో రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వడం మరో పద్ధతి. ఈ ట్రస్టు ఢిల్లీలో ఉంటుంది. దీనికి డబ్బు చెల్లించి బాండ్ల వంటివి కొనుగోలు చేసి వాటిని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఈ మార్గంలో వైసీపీకి రూ.16 కోట్లు అందాయి.

ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీకి ఎలక్టొరల్‌ బాండ్లు, ప్రుడెంట్‌ ట్రస్టు బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాలూ అంద‌లేదు. అన్ని విరాళాలు దాతల నుంచి బహిరంగంగా సేక‌రించారు. మొత్తం 193 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. వీరిలో టీడీపీ సానుభూతిపరులు, నేతలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నారు. ఏ దాత ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో వారి పేర్లు, చిరునామాలను కూడా టీడీపీ అందజేసింది. ఇలా 11 కోట్ల 92 ల‌క్ష‌ల రూపాయ‌లు మాత్ర‌మే టీడీపీకి అందాయి. ఇక‌, ఏపీ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యేకంగా విరాళాలు రాలేదు. క‌మ్యూనిస్టు పార్టీల‌కు 2 కోట్ల రూపాయ‌లు, జ‌న‌సేన పార్టీకి అత్యల్పంగా కోటీ 30 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళాలుగా అందాయ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

This post was last modified on November 24, 2023 8:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

8 minutes ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

3 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

3 hours ago

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…

3 hours ago

ట్రంప్ నకు సుప్రీం షాక్.. భారత్ కు లాభమా? నష్టమా?

అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…

4 hours ago

వరలక్ష్మి రిస్కు ఫలితమిస్తే మంచిదే

చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…

4 hours ago