అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బస్సుయాత్ర జోరందుకుంది. ఇప్పుడు జోరందుకోవటం ఏమిటో కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో బస్సుయాత్రలు చేస్తున్నారు కదాని అనుమానం రావటం సహజమే. కానీ ఇపుడు బస్సుయాత్రలు చేస్తున్నది రాజకీయ పార్టీల నేతలు కాదు. అచ్చంగా నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాల జేఏసీ నేతలు. కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలను జనాలకు వివరించే ఉద్దేశ్యంతో నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నేతలు రెండు యాత్రలు మొదలుపెట్టారు. ఒక బస్సు ఉత్తర తెలంగాణాలో తిరుగుతుంటే, రెండో బస్సు దక్షిణ తెలంగాణాలో తిరుగుతోంది.
ఈనెల 16వ తేదీన మొదలైన బస్సులో విద్యార్ధి, నిరుద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రతి నియోజకవర్గంలోను తిరుగుతున్నారు. ప్రతిచోట జనాలతో మాట్లాడుతు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. అలాగే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఏ విధంగా ఫెయిలైందో వివరించి చెబుతున్నారు. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూపు 1, 2 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను వివరిస్తున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల నిరుద్యోగులు ఎలా నష్టపోతున్నారో చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణా టూర్లో బస్సుయాత్ర ఇప్పటివరకు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో పూర్తయ్యింది. ఇక దక్షణి తలెంగాణా జిల్లాల్లో మొదలైన యాత్ర మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో పూర్తిచేసుకున్నది. ప్రతి ఊరిలోని లైట్రరీలు, స్టూడెంట్ సెంటర్లు, కోచింగ్ సెంటర్ల దగ్గరుండే విద్యార్ధులతో జేఏసీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి లోకాన్ని చైతన్యపరుస్తున్నారు. మూడోసారి కేసీయార్ ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులకు ఎదురవ్వబోయే కష్ట, నష్టాల గురించి జేఏసీ నేతలు వివరంగా చెబుతున్నారు.
మరో మూడు రోజుల్లో రెండు బస్సులు మరికొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి 25వ తేదీ మధ్యాహ్నానికి హైదరాబాద్ కు చేరుకోవాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అవకాశముంటే హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున విద్యార్ధులు, నిరుద్యోగులతోనే ఒక సభ పెట్టే విషయాన్ని కూడా జేఏసీ నేతలు ఆలోచిస్తున్నారు. మొత్తానికి గ్రూప్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ పెద్ద ఇబ్బందిగా మారేటట్లుగా కనబడుతోంది. మరి విద్యార్ధి, నిరుద్యోగుల జేఏసీ పర్యటనల ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.
This post was last modified on November 23, 2023 10:31 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…