తెలంగాణా ఎన్నికల్లో ఇపుడొక ఆందోళనకరమైన విషయం బయటపడింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన వివరాల ప్రకారం వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న 360 మంది అభ్యర్ధుల్లో 226 మంది నేరచరితులేనట. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తరపున పోటీచేస్తున్న వారిలో అత్యధికులు నేరచరితులే అన్న విషయం బయటపడింది. అంటే వీళ్ళల్లో గెలిచిన చాలామంది రేపు మన ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో కూర్చుంటారు. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకూడదన్నది మామూలు జనాల నుండి అత్యున్నత న్యాయస్ధానం సుప్రింకోర్టు వరకు పదేపదే కోరుకుంటున్నదే.
అయితే పోటీచేసే వాళ్ళల్లో అత్యధికులు నేరచరితులే అయినపుడు జనాలు ఎవరికి ఓట్లేయాలి ? ఈ ఆలోచనలో నుండి పుట్టిందే నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్. అందుకనే ఎన్నిక ఎన్నికకు నోటాకు పడుతున్న ఓట్లు పెరుగుతున్నది. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ సందర్భంగా అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ఆ నామినేషన్లతో తమపై నమోదైన కేసులను అఫిడవిట్ల రూపంలో అందించారు. ఆ అఫిడవిట్ల ప్రకారమే 226 మందిపై అనేక కేసులున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి చెప్పారు.
ఎన్నికల్లో నేరచరితులు పాల్గొనటం అన్నది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిదికాదని రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు జనాలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లేయాలని సూచించారు. అభ్యర్ధులపై నమోదైన కేసుల్లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో నమోదైన కేసులతో పాటు భూ కబ్జాలు, కిడ్నాపులతో పాటు అనేక క్రిమినల్ కేసులున్నట్లు చెప్పారు. ఈ కేసులు ఎక్కువగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులపైనే ఉన్నాయి.
బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న 58 మందిపైన 120 కేసులున్నాయి. కేసీయార్ పైన 9, మంత్రులు గంగుల కమలాకర్ మీద 10 కేసులు, కేటీయార్ మీద 8 కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధులు 84 మందిపైన 540 కేసులున్నాయి. వీరిటో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైన 89, బొజ్జాపై52, ప్రేమ్ సాగర్ పై 32, పీ. శ్రీనివాస్ పై 24 కేసులు నమోదయ్యాయి. బీజేపీ అభ్యర్ధులు 78 మీద 549 కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ పై 89 కేసులు, బండి సంజయ్ పై 59, సోయం బాబూరావుపై 55 కేసులున్నాయి. ఫైనల్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పైన కూడా 6 కేసులున్నాయి.
This post was last modified on November 22, 2023 11:03 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…