తాను పుట్టిన ఊరు మీదా.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం మీదా ప్రేమాభిమానాలు లేకుంటే ఏమవుతుందన్న మాటకు కొద్ది కాలం క్రితం వరకు సరైన ఉదాహరణ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు.
ప్రాంతం మీద అభిమానం ఉంటే.. ఎంత మేలు జరుగుతుందో తెలంగాణను చూస్తే.. అర్థమవుతుంది. కులాల కుంపట్లతో తరచూ రాజకీయ కుస్తీలకు దిగే ఆంధ్రాకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. అయినప్పటికీ.. తన ప్రాంతం మీద అభిమానం ఎంతన్న విషయంలో సందేహమే.
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కూడా కోస్తా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర లాంటి విభజన మాటలే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి జరిగిన విభజన గాయం సరిపోదా? అని మూడు ప్రాంతాలకు చెందిన వారు నిలదీస్తే.. నేతలు తమ తీరును మార్చుకోరా? కానీ.. అలాంటివేమీ చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం?
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇవాళ తెలుగు భాషా దినోత్సం. తెలుగు జాతికి మూలమైన అమ్మ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకోవాలి? బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ విషయాలేమీ పెద్ద పట్టనట్లుగా వ్యవహరిస్తారు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు. దీనికి తగ్గట్లే.. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి నేతలు కానీ.. అధికారులు కానీ కనీసం పూలమాల వేయకపోవటం చూస్తే.. ఆంధ్రోళ్లకు తెలుగు తల్లి మీద ఉన్న అభిమానం ఏ పాటిదో ఇట్టే అర్థం కాక మానదు.
మొన్నటివరకు ఏటా జరిగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహాల్ని అందంగా ముస్తాబు చేసే తీరుకు భిన్నంగా.. ఈ ఏడాది ఎలాంటి వేడుకలు జరగకపోవటం చూసినోళ్లంతా వేదన చెందుతున్నారు.
ఆంధ్రోళ్లు తమను తాము పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయ్యిందన్న ఆగ్రహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. దీనికి తగ్గట్లే..తమను తామే కాదు.. తమ తల్లిని కూడా మర్చిపోయే నరసరావుపేట లాంటి ప్రాంతాల్లోని నేతలు.. అధికారుల్ని ఏమనాలి?
This post was last modified on August 30, 2020 10:01 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…