తాను పుట్టిన ఊరు మీదా.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం మీదా ప్రేమాభిమానాలు లేకుంటే ఏమవుతుందన్న మాటకు కొద్ది కాలం క్రితం వరకు సరైన ఉదాహరణ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు.
ప్రాంతం మీద అభిమానం ఉంటే.. ఎంత మేలు జరుగుతుందో తెలంగాణను చూస్తే.. అర్థమవుతుంది. కులాల కుంపట్లతో తరచూ రాజకీయ కుస్తీలకు దిగే ఆంధ్రాకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. అయినప్పటికీ.. తన ప్రాంతం మీద అభిమానం ఎంతన్న విషయంలో సందేహమే.
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కూడా కోస్తా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర లాంటి విభజన మాటలే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి జరిగిన విభజన గాయం సరిపోదా? అని మూడు ప్రాంతాలకు చెందిన వారు నిలదీస్తే.. నేతలు తమ తీరును మార్చుకోరా? కానీ.. అలాంటివేమీ చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం?
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇవాళ తెలుగు భాషా దినోత్సం. తెలుగు జాతికి మూలమైన అమ్మ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకోవాలి? బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ విషయాలేమీ పెద్ద పట్టనట్లుగా వ్యవహరిస్తారు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు. దీనికి తగ్గట్లే.. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి నేతలు కానీ.. అధికారులు కానీ కనీసం పూలమాల వేయకపోవటం చూస్తే.. ఆంధ్రోళ్లకు తెలుగు తల్లి మీద ఉన్న అభిమానం ఏ పాటిదో ఇట్టే అర్థం కాక మానదు.
మొన్నటివరకు ఏటా జరిగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహాల్ని అందంగా ముస్తాబు చేసే తీరుకు భిన్నంగా.. ఈ ఏడాది ఎలాంటి వేడుకలు జరగకపోవటం చూసినోళ్లంతా వేదన చెందుతున్నారు.
ఆంధ్రోళ్లు తమను తాము పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయ్యిందన్న ఆగ్రహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు. దీనికి తగ్గట్లే..తమను తామే కాదు.. తమ తల్లిని కూడా మర్చిపోయే నరసరావుపేట లాంటి ప్రాంతాల్లోని నేతలు.. అధికారుల్ని ఏమనాలి?
This post was last modified on August 30, 2020 10:01 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…