వారం రోజులు అగ్ని ప‌రీక్షే..

మ‌రో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 30న పోలింగ్‌కు స‌ర్వ‌సిద్ధ‌మైంది. దీంతో నాయ‌కులు, పార్టీలు దూకుడు పెంచాయి. కానీ.. ఇన్నాళ్ల‌యినా.. తెలంగాణ స‌మాజం నాడిని మాత్రం ప‌ట్టుకోలేక పోయారు. అధికార పార్టీ బీఆర్ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌ల మ‌ధ్యే.. పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని తెలిసినా.. ఎవ‌రి వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతారో ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త రాలేదు. చిట్ట‌చివ‌రి నిముషంలో అంచ‌నాలు మారితే.. అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంద‌నేది తేలిపోతుంది.

ఈ చిట్ట చివ‌రి నిముషంలోనే అనేక స‌మీక‌ర‌ణ‌లు మారిపోయే అవ‌కాశం ఉంద‌ని మ‌రో అంచ‌నా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలు, నాయ‌కులు కూడా పంప‌కాల‌కు రెడీ అయిన‌ట్టు స‌మాచారం. ఇదే ఎన్నిక‌ల స‌ర‌ళిని మార్చేస్తుంద‌ని కూడా అంచ‌నావేస్తున్నారు. అయితే.. ఇది అంత ఈజీకాద‌నేది తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్ధమ‌వుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హించిన ఆక‌స్మిక త‌నిఖీల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 1750 కోట్లు పట్టుబ‌డ్డాయి.

వీటిలోనూ ఇప్ప‌టికి తెలంగాణ‌లోనే 656 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. ఇంకా ఎన్నిక‌లకు మ‌రో వారం స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం బుధ‌వారం నుంచి మ‌రిన్ని బ‌ల‌గాల‌ను తెలంగాణ‌కు పంపించనున్న‌ట్టు తెలిపింది. దీంతో అన్ని వైపుల అష్ట‌దిగ్భ‌దం చేయ‌నున్నారు. ప్ర‌తి రూపాయికీ లెక్క చూపించడంతోపాటు ఎక్క‌డిక‌క్క‌డ తనిఖీలు చేప‌ట్ట‌నున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. పోటీలో ఉన్న నాయ‌కుల‌కు కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్టు అయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి ఇప్పుడు తీవ్ర‌మైన పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో నాయ‌కులు పోటా పోటీ ప్ర‌చారాలు చేస్తున్నారు. అయితే.. ఎవ‌రికీ కూడా.. గెలుపుపై ధీమా లేకుండా పోయింది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంద‌ని స‌ర్వేలు వ‌స్తున్నా యి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నవారు.. కొంద‌రు త‌మ దారులు తాము వెతుక్కుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం అష్ట‌దిగ్బందం చేసేందుకు రెడీ కావ‌డంతో నాయ‌కులు అల్లాడిపోతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 21, 2023 9:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago