అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండడం గమనార్హం. కర్ణాటకలో ఈ ఏడాది మేలోజరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వీటిని 6కు పెంచింది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో అసలు ఏగ్యారెంటీ కూడా ఇవ్వలేదు.
ఇక, ఛత్తీస్గఢ్లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబట్టి.. మళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండదని అనుకున్నారో ఏమో.. అక్కడ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించలేదు. ఇక, ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో ఈ నెల 25 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా పశు పోషకుల నుంచి పేడను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు.
దీనిలో ప్రధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.
1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు
2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.
3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు
4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్పీజీ సిలిండర్
5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు
6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ` హెల్త్ ఇన్సూరెన్స్
7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, ట్యాబ్స్ పంపిణీ
This post was last modified on November 21, 2023 2:03 pm
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…