Political News

‘పేడ’ కొంటాం.. రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హామీ

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాది మేలోజ‌రిగిన ఎన్నిక‌ల్లో 5 గ్యారెంటీలు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి వీటిని 6కు పెంచింది. ఇక‌, ఇప్ప‌టికే ఎన్నిక‌లు పూర్త‌యిన మిజోరాంలో అస‌లు ఏగ్యారెంటీ కూడా ఇవ్వ‌లేదు.

ఇక‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబ‌ట్టి.. మ‌ళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండ‌ద‌ని అనుకున్నారో ఏమో.. అక్క‌డ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించ‌లేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా రాజ‌స్థాన్‌లో ఈ నెల 25 న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీల‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్ర‌ధానంగా ప‌శు పోష‌కుల నుంచి పేడ‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీనిలో ప్ర‌ధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.

1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు

2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.

3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు

4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్

5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు

6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ‌` హెల్త్ ఇన్సూరెన్స్

7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ పంపిణీ

This post was last modified on November 21, 2023 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకు

రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న…

1 hour ago

మరో తమిళ స్టార్ తో పూరి మూవీ?

విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…

2 hours ago

ప్రిమియర్స్ వద్దు.. రెగ్యులర్ షోలే ముద్దు

చిన్న సినిమాలకు రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి…

3 hours ago

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

4 hours ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

5 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

5 hours ago