అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండడం గమనార్హం. కర్ణాటకలో ఈ ఏడాది మేలోజరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వీటిని 6కు పెంచింది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో అసలు ఏగ్యారెంటీ కూడా ఇవ్వలేదు.
ఇక, ఛత్తీస్గఢ్లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబట్టి.. మళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండదని అనుకున్నారో ఏమో.. అక్కడ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించలేదు. ఇక, ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో ఈ నెల 25 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా పశు పోషకుల నుంచి పేడను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు.
దీనిలో ప్రధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.
1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు
2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.
3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు
4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్పీజీ సిలిండర్
5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు
6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ` హెల్త్ ఇన్సూరెన్స్
7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, ట్యాబ్స్ పంపిణీ
This post was last modified on November 21, 2023 2:03 pm
‘సప్తసాగరాలు దాటి’ అనే చిన్న సినిమాతో రుక్మిణి వసంత్ అనే కన్నడ అమ్మాయి ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే.…
ఒక భాష నుంచి ఆల్ టైమ్ హిట్ వస్తే.. ఆ ఇండస్ట్రీ అందుకు ఎంతో గర్విస్తుంది. ఆ సినిమా మాది…
నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక, ఆయన చేసిన చిత్రాల్లో అభిమానులను అత్యంత అలరించింది ఓజీనే. సినిమా…
ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…
ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…