Political News

‘పేడ’ కొంటాం.. రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హామీ

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాది మేలోజ‌రిగిన ఎన్నిక‌ల్లో 5 గ్యారెంటీలు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి వీటిని 6కు పెంచింది. ఇక‌, ఇప్ప‌టికే ఎన్నిక‌లు పూర్త‌యిన మిజోరాంలో అస‌లు ఏగ్యారెంటీ కూడా ఇవ్వ‌లేదు.

ఇక‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబ‌ట్టి.. మ‌ళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండ‌ద‌ని అనుకున్నారో ఏమో.. అక్క‌డ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించ‌లేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా రాజ‌స్థాన్‌లో ఈ నెల 25 న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీల‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్ర‌ధానంగా ప‌శు పోష‌కుల నుంచి పేడ‌ను కొనుగోలు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీనిలో ప్ర‌ధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.

1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు

2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.

3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు

4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్

5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు

6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ‌` హెల్త్ ఇన్సూరెన్స్

7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ పంపిణీ

This post was last modified on November 21, 2023 2:03 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

2 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

11 hours ago