అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండడం గమనార్హం. కర్ణాటకలో ఈ ఏడాది మేలోజరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వీటిని 6కు పెంచింది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో అసలు ఏగ్యారెంటీ కూడా ఇవ్వలేదు.
ఇక, ఛత్తీస్గఢ్లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబట్టి.. మళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండదని అనుకున్నారో ఏమో.. అక్కడ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించలేదు. ఇక, ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో ఈ నెల 25 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా పశు పోషకుల నుంచి పేడను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు.
దీనిలో ప్రధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.
1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు
2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.
3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు
4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్పీజీ సిలిండర్
5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు
6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ` హెల్త్ ఇన్సూరెన్స్
7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, ట్యాబ్స్ పంపిణీ
This post was last modified on November 21, 2023 2:03 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…