అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండడం గమనార్హం. కర్ణాటకలో ఈ ఏడాది మేలోజరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వీటిని 6కు పెంచింది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో అసలు ఏగ్యారెంటీ కూడా ఇవ్వలేదు.
ఇక, ఛత్తీస్గఢ్లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబట్టి.. మళ్లీ గ్యారెంటీలు ఇస్తే బాగుండదని అనుకున్నారో ఏమో.. అక్కడ కూడా ఎలాంటి గ్యారెంటీలు గుప్పించలేదు. ఇక, ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో ఈ నెల 25 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిలో ఏకంగా 7 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా పశు పోషకుల నుంచి పేడను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు.
దీనిలో ప్రధానంగా ఏడు గ్యారెంటీలు పేర్కొన్నారు.
1) పంచాయతీ స్థాయిలో 4 లక్షల ఉద్యోగాలు
2) కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.
3) కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు
4) 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్పీజీ సిలిండర్
5) పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు
6) రూ.25 లక్షల – రూ.50 లక్షల వరకు ‘చిరంజీవ` హెల్త్ ఇన్సూరెన్స్
7) ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, ట్యాబ్స్ పంపిణీ
This post was last modified on November 21, 2023 2:03 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…