టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఈ ప్రకారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 28న పూర్తి కావస్తోంది. దీంతో, ఈ నెల 29న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, రెగ్యులర్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చని తెలుస్తోంది.
చంద్రబాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలను కోర్టుకు ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని హైకోర్టు అభిప్రాయపడింది. స్కిల్ ప్రాజెక్టులో దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. రిమాండ్ కు ముందే ఆధారాలు చూపించాల్సి ఉండాల్సిందని, అందకే, దర్యాప్తులో లోపంగా భావిస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నామని వెల్లడించింది.
వాస్తవానికి చంద్రబాబుపై ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేేసు, లిక్కర్ షాపుల కేటాయింపుల కేసులలో బెయిల్ రాలేదు. మరోవైపు, చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ లపై తీర్పు వెలువడలేదు. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.
This post was last modified on November 21, 2023 5:03 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…