ప్రత్యేక తెలంగాణా ఏర్పడినప్పటి నుండి గడచిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవని సీట్లు 17 ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వీటన్నింటిని లేకపోతే కనీసం మెజారిటీ స్ధానాల్లో అయినా గెలవాలని కేసీఆర్ మహా పట్టుదలగా ఉన్నారు. ఇందుకనే వీటిపై ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మొదటి నుండి తెలంగాణా ఉద్యమంతో ఖమ్మం జిల్లాకు సంబంధం లేకుండానే రాజకీయాలు నడిచిపోతున్నాయి.
రాష్ట్రమంతా తెలంగాణా ఉద్యమం నడిచిన రోజుల్లో కూడా ఖమ్మంలో ఉద్యమం ఛాయలు కనబడలేదు. అలాగే తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను జనాలు ఆదరించలేదు. ఈ విషయమే కేసీయార్ ను బాగా కలిచేస్తోంది. 2014 ఎన్నికల్లో మొత్తం పదిసీట్లలోను పోటీచేస్తే కొత్తగూడెంలో జలగం వెంకట్రావు మాత్రమే గెలిచారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లోను కొన్నింటిలో రెండో స్ధానం మరికొన్నింటిలో మూడో స్ధానంలో ఉండిపోయింది. అందుకనే కాంగ్రెస్ తరపున గెలిచిన కొందరు ఎంఎల్ఏలను పార్టీలో కలుపుకున్నారు.
తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పది నియోజకవర్గాల్లో పోటీచేసినా గెలిచింది మళ్ళీ ఒక్కళ్ళు మాత్రమే. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కళ్ళే గెలిచారు. దాంతో పాత పద్దతినే అనుసరించిన కేసీయార్ కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచిన కొందరు ఎంఎల్ఏలను లాగేసుకున్నారు. ఏదో పద్దతిలో జిల్లాలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలున్నారని అనిపించుకున్నారు. జిల్లాలోని మధిర, వైరా, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, పాలేరు, భద్రాచలంలో గెలుపుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఒకటికి రెండుసార్లు బహిరంగసభలు నిర్వహించారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషామహల్, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, కార్వాన్, ఛార్మినార్, యాకత్ పూర, బహద్దూర్ పుర, నాంపల్లి, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదు. అందుకనే ఇక్కడ కూడా పదేపదే ప్రచారం చేస్తున్నారు. కేసీయార్ బహిరంగసభల్లో పాల్గొనటమే కాకుండా మంత్రి కేటీయార్ రోడ్డుషోలు, ర్యాలీలు కూడా చేస్తున్నారు. మరి మూడో ఎన్నికల్లో అయినా కేసీయార్ ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.
This post was last modified on November 21, 2023 11:47 am
ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి..…
కమల్ హాసన్ కల్ట్ కామెడీ మూవీస్ లిస్టులో సతి లీలావతిది ప్రత్యేక స్థానం. వచ్చి ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ…
చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా వెనక్కు వచ్చిన రవిబాబు కొత్త సినిమా రేజర్ వీకెండ్ ముందే చేతులు ఎత్తేసింది. విపరీతమైన…
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశమిచ్చాడు. సొంతంగా…
రాజకీయాల్లో కేవలం పాలన మాత్రమే కాదు.. అధికారాన్ని చలాయించడమే కాదు.. అవసరాన్ని బట్టి.. అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించటం అనేది…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన…