Political News

17 సీట్లపైనే కేసీఆర్ ప్రత్యేక దృష్టి ?

ప్రత్యేక తెలంగాణా ఏర్పడినప్పటి నుండి గడచిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవని సీట్లు 17 ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వీటన్నింటిని లేకపోతే కనీసం మెజారిటీ స్ధానాల్లో అయినా గెలవాలని కేసీఆర్ మహా పట్టుదలగా ఉన్నారు. ఇందుకనే వీటిపై ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మొదటి నుండి తెలంగాణా ఉద్యమంతో ఖమ్మం జిల్లాకు సంబంధం లేకుండానే రాజకీయాలు నడిచిపోతున్నాయి.

రాష్ట్రమంతా తెలంగాణా ఉద్యమం నడిచిన రోజుల్లో కూడా ఖమ్మంలో ఉద్యమం ఛాయలు కనబడలేదు. అలాగే తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను జనాలు ఆదరించలేదు. ఈ విషయమే కేసీయార్ ను బాగా కలిచేస్తోంది. 2014 ఎన్నికల్లో మొత్తం పదిసీట్లలోను పోటీచేస్తే కొత్తగూడెంలో జలగం వెంకట్రావు మాత్రమే గెలిచారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లోను కొన్నింటిలో రెండో స్ధానం మరికొన్నింటిలో మూడో స్ధానంలో ఉండిపోయింది. అందుకనే కాంగ్రెస్ తరపున గెలిచిన కొందరు ఎంఎల్ఏలను పార్టీలో కలుపుకున్నారు.

తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పది నియోజకవర్గాల్లో పోటీచేసినా గెలిచింది మళ్ళీ ఒక్కళ్ళు మాత్రమే. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కళ్ళే గెలిచారు. దాంతో పాత పద్దతినే అనుసరించిన కేసీయార్ కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచిన కొందరు ఎంఎల్ఏలను లాగేసుకున్నారు. ఏదో పద్దతిలో జిల్లాలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలున్నారని అనిపించుకున్నారు. జిల్లాలోని మధిర, వైరా, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, పాలేరు, భద్రాచలంలో గెలుపుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఒకటికి రెండుసార్లు బహిరంగసభలు నిర్వహించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషామహల్, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, కార్వాన్, ఛార్మినార్, యాకత్ పూర, బహద్దూర్ పుర, నాంపల్లి, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదు. అందుకనే ఇక్కడ కూడా పదేపదే ప్రచారం చేస్తున్నారు. కేసీయార్ బహిరంగసభల్లో పాల్గొనటమే కాకుండా మంత్రి కేటీయార్ రోడ్డుషోలు, ర్యాలీలు కూడా చేస్తున్నారు. మరి మూడో ఎన్నికల్లో అయినా కేసీయార్ ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.

This post was last modified on November 21, 2023 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago