సాధారణంగా పదవిలో ఉన్న నాయకుడికి సెగ తప్పదు. మాకు ఇది చేయలేదు.. అది చేయలేదు.. అనే అసంతృప్తులు మామూలే. దీంతో ఆయా నాయకులు ఇతర సామాజిక వర్గాల మాట ఎలా ఉన్నా.. సొంత సామాజిక వర్గంపై ఆధారపడతారు. వారితో అయినా.. పాజిటివ్ ప్రచారం చేయించుకోవాలని భావిస్తారు. ఇక, ఆయా సామాజిక వర్గాలు కూడా పోన్లే.. మనోడే కదా.. తప్పులు ఎంత మంది చేయడం లేదని సర్దుకుపోయి.. ఎన్నికల సమయంలో సహకరించేందుకు ముందుకు వస్తాయి.
ఇది.. ఎక్కడైనా ఉన్నదే. అయితే.. అనూహ్యంగా వైసీపీకి చెందిన వివాదాస్పద ఎంపీ, హిందూపురం నాయ కుడు.. గోరంట్ల మాధవ్కు సొంత సామాజిక వర్గంలోనే సెగ పెరిగింది. అంతేకాదు.. ఇక నుంచి ఆయనను తమతో కలుపుకోవాలా? వద్దా? అనే విషయాన్ని కూడా.. వారు ఆలోచిస్తున్నారు. ఎంపీ మాధవ్ కురబ సామాజిక వర్గానికి చెందినవారు. అనంతపురంలో ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అందుకే.. ఈ సామాజిక వర్గానికి చెందిన ఉష శ్రీచరణ్కు జగన్ మంత్రివర్గంలోనూ చోటిచ్చారు.
ఇంత ప్రాధాన్యం ఉన్న కురబ వర్గం.. ఇప్పుడు ఎంపీ విషయంలో కస్సుబుస్సులాడుతోంది. తమను విడదీసి రాజకీయాలు చేస్తున్నారని.. తమలో తమకే చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని.. కురబ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అనంతపురంలో కురబ సామాజిక వర్గం ఘనంగా చేసుకునే పవిత్ర కార్యక్రమం గుడిమెట్ల ఉత్సవం. దీనిని చాలా వైభవంగా చేసుకుంటారు. దీనిలో రాజకీయాలు చేయరు. కురబ వర్గానికి చెందిన వారు ఎవరున్నా.. పిలుస్తారు.
ఇలానే.. తాజాగా జరిగిన గుడిమెట్ల ఉత్సవానికి టీడీపీ నుంచి బీకే పార్థసారథిని కూడా పిలిచారు. అయితే.. ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎంపీ గోరంట్ల.. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ.. కురబలను అవమానించే రీతిలో వ్యవహరించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. అంతేకాదు.. స్టేజ్పైనే బీకే సారథిని కొట్టే ప్రయత్నం చేయడం.. మరింత వివాదంగా మారింది.
కొన్ని దశాబ్దాలుగా.. తాము కలిసి మెలిసి ఉంటున్నామని.. కానీ. ఎంపీ కారణంగా వైషమ్యాలు పెరుగుతున్నాయని కురబవర్గంఆరోపిస్తోంది. దీంతో ఎంపీని దూరం పెట్టాలని, ఆయనను ఇక నుంచి ఏ కార్యక్రమానికీ పిలవరాదని కూడా నిర్ణయించడం సంచలనంగా మారింది. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సొంత సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయం ఎంపీకి సెగ పెట్టడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on November 21, 2023 8:29 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…