సాధారణంగా పదవిలో ఉన్న నాయకుడికి సెగ తప్పదు. మాకు ఇది చేయలేదు.. అది చేయలేదు.. అనే అసంతృప్తులు మామూలే. దీంతో ఆయా నాయకులు ఇతర సామాజిక వర్గాల మాట ఎలా ఉన్నా.. సొంత సామాజిక వర్గంపై ఆధారపడతారు. వారితో అయినా.. పాజిటివ్ ప్రచారం చేయించుకోవాలని భావిస్తారు. ఇక, ఆయా సామాజిక వర్గాలు కూడా పోన్లే.. మనోడే కదా.. తప్పులు ఎంత మంది చేయడం లేదని సర్దుకుపోయి.. ఎన్నికల సమయంలో సహకరించేందుకు ముందుకు వస్తాయి.
ఇది.. ఎక్కడైనా ఉన్నదే. అయితే.. అనూహ్యంగా వైసీపీకి చెందిన వివాదాస్పద ఎంపీ, హిందూపురం నాయ కుడు.. గోరంట్ల మాధవ్కు సొంత సామాజిక వర్గంలోనే సెగ పెరిగింది. అంతేకాదు.. ఇక నుంచి ఆయనను తమతో కలుపుకోవాలా? వద్దా? అనే విషయాన్ని కూడా.. వారు ఆలోచిస్తున్నారు. ఎంపీ మాధవ్ కురబ సామాజిక వర్గానికి చెందినవారు. అనంతపురంలో ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అందుకే.. ఈ సామాజిక వర్గానికి చెందిన ఉష శ్రీచరణ్కు జగన్ మంత్రివర్గంలోనూ చోటిచ్చారు.
ఇంత ప్రాధాన్యం ఉన్న కురబ వర్గం.. ఇప్పుడు ఎంపీ విషయంలో కస్సుబుస్సులాడుతోంది. తమను విడదీసి రాజకీయాలు చేస్తున్నారని.. తమలో తమకే చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని.. కురబ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అనంతపురంలో కురబ సామాజిక వర్గం ఘనంగా చేసుకునే పవిత్ర కార్యక్రమం గుడిమెట్ల ఉత్సవం. దీనిని చాలా వైభవంగా చేసుకుంటారు. దీనిలో రాజకీయాలు చేయరు. కురబ వర్గానికి చెందిన వారు ఎవరున్నా.. పిలుస్తారు.
ఇలానే.. తాజాగా జరిగిన గుడిమెట్ల ఉత్సవానికి టీడీపీ నుంచి బీకే పార్థసారథిని కూడా పిలిచారు. అయితే.. ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎంపీ గోరంట్ల.. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ.. కురబలను అవమానించే రీతిలో వ్యవహరించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. అంతేకాదు.. స్టేజ్పైనే బీకే సారథిని కొట్టే ప్రయత్నం చేయడం.. మరింత వివాదంగా మారింది.
కొన్ని దశాబ్దాలుగా.. తాము కలిసి మెలిసి ఉంటున్నామని.. కానీ. ఎంపీ కారణంగా వైషమ్యాలు పెరుగుతున్నాయని కురబవర్గంఆరోపిస్తోంది. దీంతో ఎంపీని దూరం పెట్టాలని, ఆయనను ఇక నుంచి ఏ కార్యక్రమానికీ పిలవరాదని కూడా నిర్ణయించడం సంచలనంగా మారింది. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సొంత సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయం ఎంపీకి సెగ పెట్టడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on November 21, 2023 8:29 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…