Political News

టీడీపీ అలా చేసిందా నిరూపించండి.. రాజ‌కీయాలు వ‌దిలేస్తా!

టీడీపీపై త‌ర‌చుగా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించే వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. టీడీపీ నేత‌లకు ఆయ‌న స‌వాల్ కూడా రువ్వారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల నీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఏదో చేసింద‌ని ఇక్క‌డి నేత‌లు చెబుతున్నార‌న్న ఆయ‌న‌.. ఇలా టీడీపీ హ‌యాంలో గుడివాడ ప్ర‌జ‌ల మౌలిక స‌దుపాయాల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపించినా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ స‌వాల్ చేశారు.

గుడివాడ‌లో ఎన్టీఆర్ త‌ర్వాత‌.. టీడీపీ త‌ర‌ఫున గెలిచింది తానేన‌ని..అప్ప‌ట్లోనే ఏమీ చేయ‌లేద‌ని నాని వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రులుగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర్వాత ఆయ‌న కుమారుడు ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ మాత్ర‌మే గుడివాడ ప్ర‌జ‌ల‌ను గుండెల్లో పెట్టుకున్నార‌ని తెలిపారు. ఇక్క‌డి ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారన్నార‌ని తెలిపారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని నాని విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌నీసం త‌ట్ట మ‌ట్టి కూడా చంద్ర‌బాబు హ‌యాంలో ఎత్త‌లేద‌ని అన్నారు.

ప్రజలను ఆత్మబంధువులుగా చూసింది ఒక్క వైఎస్‌, జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని కొడాలి వ్యాఖ్యానించారు. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ధనికుల కార్లు బ్రేకులు వెయ్యకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాల ఆరాటమని అన్నారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్‌కు తాము చెప్పామని, కానీ, ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారని నాని వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్రంలో రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇదిలావుంటే, కొడాలి నాని వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on November 21, 2023 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

59 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago