టీడీపీపై తరచుగా విమర్శల వర్షం కురిపించే వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. టీడీపీ నేతలకు ఆయన సవాల్ కూడా రువ్వారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల నీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఏదో చేసిందని ఇక్కడి నేతలు చెబుతున్నారన్న ఆయన.. ఇలా టీడీపీ హయాంలో గుడివాడ ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపించినా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు.
గుడివాడలో ఎన్టీఆర్ తర్వాత.. టీడీపీ తరఫున గెలిచింది తానేనని..అప్పట్లోనే ఏమీ చేయలేదని నాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం జగన్ మాత్రమే గుడివాడ ప్రజలను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారన్నారని తెలిపారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని నాని విమర్శలు గుప్పించారు. కనీసం తట్ట మట్టి కూడా చంద్రబాబు హయాంలో ఎత్తలేదని అన్నారు.
ప్రజలను ఆత్మబంధువులుగా చూసింది ఒక్క వైఎస్, జగన్ మాత్రమేనని కొడాలి వ్యాఖ్యానించారు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ధనికుల కార్లు బ్రేకులు వెయ్యకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాల ఆరాటమని అన్నారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్కు తాము చెప్పామని, కానీ, ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారని నాని వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్రంలో రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇదిలావుంటే, కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on November 21, 2023 9:38 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…