ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార దూకుడు పెంచారు. మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డ కేసీఆర్…టీడీపీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంటే టిడిపి ఎందుకు పుట్టేదని కేసీఆర్ ప్రశ్నించారు. 50 ఏళ్ళు పాలన చేసిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో అందరూ ఆలోచించాలని అన్నారు.
తెలంగాణకు గతంలో నష్టం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ అని, బలవంతంగా తీసుకువెళ్లి ఆంధ్రాలో కలిపేశారని కేసీఆర్ ఆరోపించారు. ఇక, 2004లో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, ఆనాడు భీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సాధన కోసమే ఆనాడు టీఆర్ఎస్ పుట్టిందని, కొట్లాడి ప్రత్యేక తెలంగాణను సాధించుకుందని గుర్తు చేశారు. ఇక, కరీంనగర్ తో తనకు ప్రత్యేకంగా అనుబంధం ఉందని, ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కేసీఆర్ అన్నారు.
అందుకే ఇక్కడి నుంచి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఆటోలకు ఫిట్నెస్ చార్జీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యంలో గడుపుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయని, అందుకే వారికి దేశంలో ఎక్కడా లేనివిధంగా వేతనంలో 30% అలవెన్స్ ఇస్తున్నామని చెప్పారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని అన్నారను. ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ప్రజలు ఓటు వేయాలని, అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని కూడా చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…