యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఏదైనా సినిమానో.. లేక ఇతర కార్యక్రమాల్లో చూస్తున్నారని అనుకుందాం. సడెన్గా మధ్యలో యాడ్స్ రావడం కామన్. ఇవి 5 సెకన్లు గ్యారెంటీగా చూడాలి. కొన్ని కొన్ని సదరు యాడ్స్ అయ్యేవరకు చూడాలి. ఇలా యాడ్స్ ఇవ్వాలంటే.. నేరుగా యూట్యూబ్ తోనే ఒప్పందం చేసుకోవాలి. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. కోట్లలోనే ఉంటుందని అంటారు. ఇప్పుడు.. వైసీపీ కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుందని తెలుస్తోంది.
దాదాపు 300 కోట్ల రూపాయలతో యూట్యూబ్తో ఒప్పందం చేసుకున్నారని తాడేపల్లి వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. గత 10 రోజులకుపైగా యూట్యూబ్లో వైసీపీ అధినేత జగన్ యాడ్స్ పెరిగిపోయాయి. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర కార్యక్రమాల గురించి అన్ని యూట్యూబ్ కార్యక్రమాల్లోనూ 10 సెకన్లకు తగ్గకుండా.. యాడ్ వస్తోంది. దీనిలో అన్నీ నేరుగా లైవ్ కార్యక్రమాలు.. కొన్ని ప్రజాభిప్రాయ సేకరణలు ఉంటున్నాయి.
మరికొన్ని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కూడా ఉంటున్నాయి. మొత్తంగా యూట్యూబ్లో వచ్చే కార్యక్రమాలు ఏవైనా కూడా మధ్యలో వైసీపీ యాడ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. వీటికి గాను ఆరు మాసాలకు ఒప్పందం జరిగిందని తాడేపల్లి వర్గాల నుంచి తెలుస్తున్న మాట. ఈ క్రమంలో మొత్తం 300 కోట్లను యూట్యూబ్కు ఒప్పందంగా చెల్లించారని అంటున్నారు.
ఎన్నికలకు వాస్తవంగా మరో 4 మాసాల గడువు ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడే.. ఇలా ప్రచారం ప్రారంభించడం.. అందునా.. 300 కోట్లతో ఒప్పందం చేసుకోవడం ఆశ్చర్యంగానే ఉందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కంపెనీ యాడ్స్కు ఒక రేటు ఉంటే.. పొలిటికల్ యాడ్స్కు మరో రేటు ఉంటుంది. ఎంతైనా ఫర్వాలేదనేలా వైసీపీ యాడ్స్ ఇచ్చిందని అంటున్నారు. మరి ఇది.. ప్రజాధనమా? లేక పార్టీ ఫండా? అనేది సందేహమే!
This post was last modified on November 20, 2023 7:42 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…