తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకురాలు.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకముందే.. చాలా మంది నాయకులు సీఎం సీటు కోసం కర్చీఫ్ పరిచేసిన విషయం తెలిసిందే. జానా రెడ్డి నుంచి భట్టి విక్రమార్క వరకు అనేక మంది సీఎం సీటు తమదనే భావనతో ఉన్నారు. ఈ విషయంపై తాజాగా రేణుకా చౌదరి స్పందించారు. “సీఎం కావాలని నాకూ ఉంది. అయితే.. ఇదంతా అవుతుందా?!” అని పెదవి విరిచారు.
కర్ణాటకలో ఈ ఏడాది మేలో జరిగిన ఉదంతాన్ని ఆమెప్రస్తావించారు. అక్కడ సీఎం సీటు కోసం ఎంత పోరు జరిగిందో చూశారు కదా.. అంటూ ఆమె వ్యాఖ్యానించారు. డీకే శివకుమార్ ను సీఎంగా అనుకున్నారని, కానీ, చివరకు పార్టీ అధిష్టానం.. సిద్దరామయ్యను ఎంపిక చేసింది కదా! అలానే ఇక్కడ కూడా ఎంతో మంది అనుకుంటారని.. చివరకు అధిష్టానం నిర్ణయమే అందరికీ ఆమోదయోగ్యం అవుతుందని తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే తనకు కూడా సీఎం కావాలనే ఉందని అనడం గమనార్హం.
ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు అడ్డు పడ్డా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత స్థాయిలో కాంగ్రెస్కు సీట్లు వస్తాయని ఆమె చెప్పారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని.. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.
ఓటర్లకు డబ్బులు పంచి గెలుద్దాం అనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రేణుక అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. అసమర్ధ ప్రభుత్వాలు ప్రజలను హింసించాయని, అందుకే కాంగ్రెస్ను కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మైనారిటీ వర్గం మొత్తం కాంగ్రెస్ వెంట ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తనకు ఎవరిపైనా అసంతృప్తి లేదని రేణుక చెప్పారు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…