Political News

ప్ర‌జానాడిని ముందే ప‌ట్టేసిన జ‌గ‌న్‌…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల గ‌డువు ఉంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కానుంది. అయితే.. అప్పుటికి ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంటుంది? ఎవ‌రివైపు మొగ్గు చూపుతారు? అనే విష‌యాలు ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. స‌హ‌జంగా ఇదే అభిప్రాయం విశ్లేష‌కుల‌కు కూడా ఉంటుంది. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మాత్రం ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గు చూపుతారు? ఎలాంటి ఫ‌లితం ఇవ్వాల‌ని అనుకుంటారు? అనే విష‌యాల‌పై ఆయ‌న స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా త‌న దారిలో తాను ప‌య‌నిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు వ్యూహాల‌ను జ‌గ‌న్ అనుసరిస్తున్న‌ట్టుచెబుతున్నారు. ఒక‌టి సెంటిమెంటు. రెండు.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం.. మూడు ఓట‌ర్ల జాబితాపై త‌న‌దైన ముద్ర వేయ‌డం. అని ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. తొలి విష‌యాన్ని తీసుకుంటే.. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ఎక్క‌డ ప్ర‌సంగించినా.. మీ ఇంట్లో మంచి జ‌రిగింద‌ని అనుకుంటే.. అంటూ సెంటిమెంటును ప్ర‌జ‌ల‌పై రుద్ద‌తున్న విష‌యం తెలిసిందే. అమ్మ ఒడి నుంచి రైతు భ‌రోసా.. చేదోడు, డ్వాక్రారుణాలు.. ఇలా అనేక ప‌థ‌కాల‌ను ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు.

సో.. వీటిలో ఏదో ఒక‌టి ప్ర‌తి కుటుంబానికీ అందుతోంది. దీంతో ఆయా వ‌ర్గాల‌ను త‌న‌వైపు ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం ఆయ‌న చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, రెండో అంశం.. విప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం. ఇది కూడా చంద్ర‌బాబును జైల్లో పెట్ట‌డం, విప‌క్ష నాయ‌కుల‌పై కేసులు పెట్ట‌డం వంటివాటిని గ‌మ‌నిస్తే.. తెలుస్తుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఫ‌లితంగా కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. వారి వాయిస్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకునే కార్య‌క్ర‌మేన‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిర‌క‌త మ‌రింత పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌నేది పరిశీల‌కుల మాట‌.

ఇక‌, మూడో అంశం ఓట‌ర్ల జాబితాను ప్ర‌భావితం చేయ‌డం. ఈ క్ర‌మంలో డోర్ నెంబ‌ర్లు లేని.. మృతి చెందిన వారి ఓట్లు కూడా.. టార్గెట్ అవుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల ఓట‌ర్ల ముసాయిదా జాబితాలో ఇలాంటి వారి ఓట్లే ఎక్కువ‌గా ఉన్నాయి. అదేస‌మ‌యంలో టీడీపీ సానుభూతిప‌రులు అన్న‌వారి ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు విమ‌ర్శించారు. అయితే.. ఇదంతా కూడా.. చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతున్న‌దేన‌ని.. ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన సీఎం జ‌గ‌న్‌… త‌న‌దైన శైలిలో అనుకూల‌త‌ను పెంచుకునే చ‌ర్య‌లు ప్రారంభించార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని విప‌క్షాలు, ప్ర‌జ‌లు గ్ర‌హించ‌లేక పోతున్నార‌నేది వారి వాద‌న‌.

Satya

Recent Posts

పెళ్లి కాలేదు… పిల్లల కోసం హీరోయిన్ ఏం చేసింది?

బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న…

1 hour ago

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

2 hours ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

2 hours ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

3 hours ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

3 hours ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

4 hours ago