Political News

ప్ర‌జానాడిని ముందే ప‌ట్టేసిన జ‌గ‌న్‌…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల గ‌డువు ఉంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కానుంది. అయితే.. అప్పుటికి ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంటుంది? ఎవ‌రివైపు మొగ్గు చూపుతారు? అనే విష‌యాలు ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. స‌హ‌జంగా ఇదే అభిప్రాయం విశ్లేష‌కుల‌కు కూడా ఉంటుంది. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మాత్రం ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గు చూపుతారు? ఎలాంటి ఫ‌లితం ఇవ్వాల‌ని అనుకుంటారు? అనే విష‌యాల‌పై ఆయ‌న స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా త‌న దారిలో తాను ప‌య‌నిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు వ్యూహాల‌ను జ‌గ‌న్ అనుసరిస్తున్న‌ట్టుచెబుతున్నారు. ఒక‌టి సెంటిమెంటు. రెండు.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం.. మూడు ఓట‌ర్ల జాబితాపై త‌న‌దైన ముద్ర వేయ‌డం. అని ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. తొలి విష‌యాన్ని తీసుకుంటే.. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ఎక్క‌డ ప్ర‌సంగించినా.. మీ ఇంట్లో మంచి జ‌రిగింద‌ని అనుకుంటే.. అంటూ సెంటిమెంటును ప్ర‌జ‌ల‌పై రుద్ద‌తున్న విష‌యం తెలిసిందే. అమ్మ ఒడి నుంచి రైతు భ‌రోసా.. చేదోడు, డ్వాక్రారుణాలు.. ఇలా అనేక ప‌థ‌కాల‌ను ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు.

సో.. వీటిలో ఏదో ఒక‌టి ప్ర‌తి కుటుంబానికీ అందుతోంది. దీంతో ఆయా వ‌ర్గాల‌ను త‌న‌వైపు ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం ఆయ‌న చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, రెండో అంశం.. విప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం. ఇది కూడా చంద్ర‌బాబును జైల్లో పెట్ట‌డం, విప‌క్ష నాయ‌కుల‌పై కేసులు పెట్ట‌డం వంటివాటిని గ‌మ‌నిస్తే.. తెలుస్తుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఫ‌లితంగా కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. వారి వాయిస్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకునే కార్య‌క్ర‌మేన‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిర‌క‌త మ‌రింత పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌నేది పరిశీల‌కుల మాట‌.

ఇక‌, మూడో అంశం ఓట‌ర్ల జాబితాను ప్ర‌భావితం చేయ‌డం. ఈ క్ర‌మంలో డోర్ నెంబ‌ర్లు లేని.. మృతి చెందిన వారి ఓట్లు కూడా.. టార్గెట్ అవుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల ఓట‌ర్ల ముసాయిదా జాబితాలో ఇలాంటి వారి ఓట్లే ఎక్కువ‌గా ఉన్నాయి. అదేస‌మ‌యంలో టీడీపీ సానుభూతిప‌రులు అన్న‌వారి ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు విమ‌ర్శించారు. అయితే.. ఇదంతా కూడా.. చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతున్న‌దేన‌ని.. ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన సీఎం జ‌గ‌న్‌… త‌న‌దైన శైలిలో అనుకూల‌త‌ను పెంచుకునే చ‌ర్య‌లు ప్రారంభించార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని విప‌క్షాలు, ప్ర‌జ‌లు గ్ర‌హించ‌లేక పోతున్నార‌నేది వారి వాద‌న‌.

This post was last modified on January 6, 2024 5:47 pm

Share
Show comments

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago