Political News

30 నియోజకవర్గాలే డిసైడింగ్ ఫ్యాక్టరా ?

తెలంగాణా ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల పోలరైజేషన్ పై చర్చలు పెరిగిపోతున్నాయి. మామూలుగా గత ఎన్నికల వరకు తమ ఊరికి, కాలనీకి ఏమిచేస్తారని అభ్యర్ధులను జనాలు అడిగేవారు లేకపోతే నిలదీసేవారు. కానీ ఈసారి ఎన్నికల ట్రెండ్ మారింది. తమ సామాజికవర్గానికి ఏమిచేస్తారు ? తమ మతానికి ఏమి చేయబోతున్నారని బహిరంగంగానే డిమాండ్లు చేస్తున్నారు, హామీలు తీసుకుంటున్నారు. నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం మతం, కులం గురించి ఎన్నికల్లో ప్రస్తావించకూడదు.

కానీ ఈ నిబంధనను ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదు. ఇందులో భాగంగానే ఇపుడు ప్రముఖంగా కనబడుతున్నది ఏమిటంటే ముస్లిం మైనారిటీల పాత్ర. మొత్తం 119 ఎన్నికల్లో 37 నియోజకవర్గాల్లో మైనారిటీలదే కీలకపాత్ర. ఇందులో ఓల్డ్ సిటిలోని ఏడు నియోజకవర్గాలు ఎంఐఎం ఖాతాలోనే పడుతున్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గాలను పక్కనపెట్టేద్దాం. ఇక 112 నియోజకవర్గాల్లో మిగిలింది 30 నియోజకవర్గాలు. ఈ 30 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్ధి గెలవాలన్నా ముస్లింల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్.

ముస్లిం ఓట్లు అత్యధికంగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో తలా లక్ష ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏరికోరి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో అజహరుద్దీన్, నిజమాబాద్ అర్బన్ లో షబ్బీర్ ఆలీకి టికెట్లిచ్చింది. ఖైరతబాద్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కరీంనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో సుమారు 60 వేల నుండి లక్ష ఓట్లున్నాయి. ముషీరాబాద్, మహబూబ్ నగర్, బోధన్, జహీరాబాద్, గోషామహల్లో 50 వేల ఓట్లున్నాయి.

అంబర్ పేట, సికింద్రాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డిలో 40 వేల ఓట్లుంటాయి. ఇదే విధంగా 8 నియోజకవర్గాల్లో 30-40 వేల ఓట్లున్నాయి. అలాగే 20-30 వేల ఓట్లున్న నియోజకవర్గాలు రెండున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో 12 వేల ఓట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో ఈ 30 నియోజకవర్గాల్లో 26 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకున్నది. మూడు స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే ఒక్క స్ధానం గోషామహల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో తాము పోటీచేయని సీట్లలో ముస్లిం ఓట్లను బీఆర్ఎస్ కు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెబుతున్నారు. మరి ముస్లిం మైనారిటీలు ఏమిచేస్తారో చూడాలి.

This post was last modified on November 20, 2023 9:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

27 minutes ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

3 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

4 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

5 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

5 hours ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

6 hours ago