Political News

పాదయాత్రకు మళ్ళీ రెడీ అవుతున్నారా ?

మధ్యలో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ మళ్ళీ ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయమై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లతో చర్చలు జరిపిన లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈనెల 24వ తేదీనుండే యువగళంతో లోకేష్ మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారట. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే చంద్రబాబునాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నపుడు చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టుచేసిన విషయం తెలిసిందే.

తండ్రి అరెస్టు విషయం తెలియగానే లోకేష్ పాదయాత్రను అర్ధాంతరంగా ఆపేసి నంద్యాల చేరుకున్నారు. అప్పటినుండి దాదాపు రెండున్నర నెలలుగా పాదయాత్ర జరగలేదు. పాదయాత్రను లోకేష్ నిలిపేసినట్లు ప్రచారం కూడా జరిగింది. రిమాండులో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసమే లోకేష్ రెగ్యులర్ గా లాయర్లతో సమావేశాలు జరుపుతున్న కారణంగానే పాదయాత్రను కంటిన్యు చేయలేకపోయారు. అయితే 53 రోజుల రిమాండు తర్వాత చంద్రబాబు జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే.

కంటి ఆపరేషన్ తదితర అనారోగ్యాల కారణంగా చంద్రబాబు మెడికల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆపరేషన్ తదితరాలను దగ్గరుండి చూసుకోవటంలో లోకేష్ బిజీ అయిపోయారు. అయితే పాదయాత్రను లోకేష్ నిలిపేయటంపై మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే సెటైర్లతో టార్గెట్ చేస్తున్నారు. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో పాదయాత్రను నిలిపేయటం కూడా ఒక ఇష్యూ అయ్యేట్లుందని లోకేష్ కు అనిపించినట్లుంది.

అందుకనే విమర్శకుల నోళ్ళు మూయించేందుకు ఈనెల 24వ తేదీ నుండి జనాల్లోకి వెళ్ళాలని నిర్ణయించారట. కాకపోతే ముందుగా అనుకున్నట్లు కాకుండా పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు చేయటంలేదు. ముందుగా వచ్చే వైజాగ్ నగరంలోనే ఆపేస్తారట. అంటే సుమారు పదిరోజులు పాదయాత్ర చేసి యువగళం పూర్తిచేసినట్లు ప్రకటిస్తారని పార్టీవర్గాల సమాచారం. యువగళం ముగింపు సందర్భంగా సభ నిర్వహించే విషయమై ఉత్తరాంధ్ర నేతలతో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత యువగళం పాదయాత్రపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

This post was last modified on November 20, 2023 9:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago