Political News

పాదయాత్రకు మళ్ళీ రెడీ అవుతున్నారా ?

మధ్యలో ఆపేసిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ మళ్ళీ ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయమై కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లతో చర్చలు జరిపిన లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈనెల 24వ తేదీనుండే యువగళంతో లోకేష్ మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారట. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే చంద్రబాబునాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నపుడు చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టుచేసిన విషయం తెలిసిందే.

తండ్రి అరెస్టు విషయం తెలియగానే లోకేష్ పాదయాత్రను అర్ధాంతరంగా ఆపేసి నంద్యాల చేరుకున్నారు. అప్పటినుండి దాదాపు రెండున్నర నెలలుగా పాదయాత్ర జరగలేదు. పాదయాత్రను లోకేష్ నిలిపేసినట్లు ప్రచారం కూడా జరిగింది. రిమాండులో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసమే లోకేష్ రెగ్యులర్ గా లాయర్లతో సమావేశాలు జరుపుతున్న కారణంగానే పాదయాత్రను కంటిన్యు చేయలేకపోయారు. అయితే 53 రోజుల రిమాండు తర్వాత చంద్రబాబు జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే.

కంటి ఆపరేషన్ తదితర అనారోగ్యాల కారణంగా చంద్రబాబు మెడికల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఆపరేషన్ తదితరాలను దగ్గరుండి చూసుకోవటంలో లోకేష్ బిజీ అయిపోయారు. అయితే పాదయాత్రను లోకేష్ నిలిపేయటంపై మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే సెటైర్లతో టార్గెట్ చేస్తున్నారు. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో పాదయాత్రను నిలిపేయటం కూడా ఒక ఇష్యూ అయ్యేట్లుందని లోకేష్ కు అనిపించినట్లుంది.

అందుకనే విమర్శకుల నోళ్ళు మూయించేందుకు ఈనెల 24వ తేదీ నుండి జనాల్లోకి వెళ్ళాలని నిర్ణయించారట. కాకపోతే ముందుగా అనుకున్నట్లు కాకుండా పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు చేయటంలేదు. ముందుగా వచ్చే వైజాగ్ నగరంలోనే ఆపేస్తారట. అంటే సుమారు పదిరోజులు పాదయాత్ర చేసి యువగళం పూర్తిచేసినట్లు ప్రకటిస్తారని పార్టీవర్గాల సమాచారం. యువగళం ముగింపు సందర్భంగా సభ నిర్వహించే విషయమై ఉత్తరాంధ్ర నేతలతో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత యువగళం పాదయాత్రపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

This post was last modified on November 20, 2023 9:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

14 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago