ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మూడో దఫా ఉద్యమానికి రెడీ అయ్యారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికి తెలంగాణ ప్రజలు రెండు సార్లు ఉద్యమాలు చేశారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ఆత్మగౌరవం కోసం.. ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తొలి దశలో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని రేవంత్రెడ్డి చెప్పారు.ఈ క్రమంలోనే సాయుధ రైతు పోరాటం తెరమీదికి వచ్చిందన్నారు. ఇది నిజాం పాలనను అంతం చేసిందని వెల్లడించారు. రెండో దశలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి, నీళ్లు-నిధులు-నియామకాల కోసం సమాజం ఉద్యమం చేసిందన్నారు.
సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూడోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ను గద్దె దించాలని పిలుపిచ్చారు.
This post was last modified on November 20, 2023 9:38 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…