Political News

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది ‘మూడో ఉద్య‌మం’: రేవంత్‌

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మూడో ద‌ఫా ఉద్య‌మానికి రెడీ అయ్యార‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికి తెలంగాణ ప్ర‌జ‌లు రెండు సార్లు ఉద్య‌మాలు చేశార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆత్మ‌గౌర‌వం కోసం.. ఉద్య‌మించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తొలి ద‌శ‌లో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జలు ఉద్య‌మించార‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు.ఈ క్ర‌మంలోనే సాయుధ రైతు పోరాటం తెర‌మీదికి వ‌చ్చింద‌న్నారు. ఇది నిజాం పాల‌న‌ను అంతం చేసింద‌ని వెల్ల‌డించారు. రెండో ద‌శ‌లో ఉమ్మ‌డి పాల‌కుల నిర్ల‌క్ష్యానికి, నీళ్లు-నిధులు-నియామ‌కాల కోసం స‌మాజం ఉద్య‌మం చేసింద‌న్నారు.

సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇక‌, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.

తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూడోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపిచ్చారు.

This post was last modified on November 20, 2023 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మరో తమిళ స్టార్ తో పూరి మూవీ?

విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…

1 hour ago

ప్రిమియర్స్ వద్దు.. రెగ్యులర్ షోలే ముద్దు

చిన్న సినిమాలకు రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్సీపై దాడికి యత్నించిన వైసీపీ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…

2 hours ago

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…

3 hours ago

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…

4 hours ago

ఓయ్ హీరోయిన్ ఇప్పుడెలా ఉంది?

బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…

5 hours ago