Political News

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది ‘మూడో ఉద్య‌మం’: రేవంత్‌

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మూడో ద‌ఫా ఉద్య‌మానికి రెడీ అయ్యార‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికి తెలంగాణ ప్ర‌జ‌లు రెండు సార్లు ఉద్య‌మాలు చేశార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆత్మ‌గౌర‌వం కోసం.. ఉద్య‌మించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తొలి ద‌శ‌లో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జలు ఉద్య‌మించార‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు.ఈ క్ర‌మంలోనే సాయుధ రైతు పోరాటం తెర‌మీదికి వ‌చ్చింద‌న్నారు. ఇది నిజాం పాల‌న‌ను అంతం చేసింద‌ని వెల్ల‌డించారు. రెండో ద‌శ‌లో ఉమ్మ‌డి పాల‌కుల నిర్ల‌క్ష్యానికి, నీళ్లు-నిధులు-నియామ‌కాల కోసం స‌మాజం ఉద్య‌మం చేసింద‌న్నారు.

సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇక‌, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.

తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూడోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపిచ్చారు.

This post was last modified on November 20, 2023 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago