ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మూడో దఫా ఉద్యమానికి రెడీ అయ్యారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికి తెలంగాణ ప్రజలు రెండు సార్లు ఉద్యమాలు చేశారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ఆత్మగౌరవం కోసం.. ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తొలి దశలో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని రేవంత్రెడ్డి చెప్పారు.ఈ క్రమంలోనే సాయుధ రైతు పోరాటం తెరమీదికి వచ్చిందన్నారు. ఇది నిజాం పాలనను అంతం చేసిందని వెల్లడించారు. రెండో దశలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి, నీళ్లు-నిధులు-నియామకాల కోసం సమాజం ఉద్యమం చేసిందన్నారు.
సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూడోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ను గద్దె దించాలని పిలుపిచ్చారు.
This post was last modified on November 20, 2023 9:38 am
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో…
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం..…
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…