ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మూడో దఫా ఉద్యమానికి రెడీ అయ్యారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికి తెలంగాణ ప్రజలు రెండు సార్లు ఉద్యమాలు చేశారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ఆత్మగౌరవం కోసం.. ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తొలి దశలో నిజాం దురహంకారానికీ, నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని రేవంత్రెడ్డి చెప్పారు.ఈ క్రమంలోనే సాయుధ రైతు పోరాటం తెరమీదికి వచ్చిందన్నారు. ఇది నిజాం పాలనను అంతం చేసిందని వెల్లడించారు. రెండో దశలో ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి, నీళ్లు-నిధులు-నియామకాల కోసం సమాజం ఉద్యమం చేసిందన్నారు.
సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మూడోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ను గద్దె దించాలని పిలుపిచ్చారు.
This post was last modified on November 20, 2023 9:38 am
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…