టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు ఏపీ టీడీపీలో నేతల మధ్య జరుగుతున్న గుసగుస! గత 20 రోజులుగా నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత.. నారా లోకేష్ జాడ కనిపించలే దని పార్టీలోనే చర్చ సాగుతోంది. జనసేన-టీడీపీల పొత్తు ప్రకటన, తర్వాత.. సంయుక్త అజెండా రూపకల్పన, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చల వంటి ముఖ్య కార్యక్రమాల్లోనే నారా లోకేష్ పాల్గొన్నారు.
తర్వాత.. ఎక్కడా కూడా కనిపించడం లేదు. కేవలం ట్విట్టర్లో పోస్టులు మాత్రమే పెడుతున్నారు. దీంతో నారా లోకేష్ ఏం చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే పార్టీలో సాగుతోంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పు డు.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో నారా లోకేష్ బిజీగా ప్రజల మధ్య ఉన్నారు. అదేసమయంలో న్యాయ పోరాటం కోసం.. న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీ-హైదరాబాద్ చుట్టూ కూడా తిరిగారు. ప్రధాన మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఇక, ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం.. ఆయన హైదరాబాద్కు వెళ్లిపోవడం తెలిసిందే. అప్పటి వరకు ప్రధాన స్రవంతిలోనే నారా లోకేష్ .. అప్పటి నుంచి కనిపించడం లేదని పార్టీ నేతల మాట. మరో 9 రోజుల్లో చంద్రబాబుకు బెయిల్ గడువు తీరనుంది. మరి అప్పటి వరకు నారా లోకేష్ బయటకు రారా? ఆయన ఎలాంటిషెడ్యూల్ పాటిస్తున్నారనేది కూడా చర్చగానే ఉంది. అయితే.. ఇప్పటి వరకు నారా లోకేష్.. పార్టీ శ్రేణులకుఎలాంటి దిశానిర్దేశం చేయలేదు.
వాస్తవానికి.. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినా.. పెద్దగా.. నాయకులు ముందుకు సాగడం లేదు. మరోవైపు.. టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు కూడా ఆశించిన రిజల్ట్ను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నాయకులకు సర్దిచెప్పి.. పొత్తులను ఫలప్రదంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన నారా లోకేష్.. ఇప్పుడు మౌనంగా ఉండడంపై పార్టీలో అంతర్గత చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 20, 2023 8:59 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…